20 ఏళ్ల కెరీర్లో అపజయం అన్నదే లేకుండా సాగిపోతున్నాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే ఆయనకు విజయాలేమీ ఊరికే వచ్చేయలేదు. ఒకప్పుడు మామూలు సినిమాలే తీసినా.. ఆ తర్వాత మగధీర, ఈగ, బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు తీయడానికి రాజమౌళి ఎంతెంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు.
ఐతే బాలీవుడ్లో ఇలా పెద్దగా కష్టపడకుండానే వందల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు అందించే దర్శకుడొకడున్నాడు. అతనే రోహిత్ శెట్టి. అతనే కళాఖండాలు తీయడు. మామూలు మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడు. కానీ మాస్ పల్స్ బాగా తెలిసిన అతడికి బాక్సాఫీస్ను షేక్ చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇంతకముందు వచ్చిన సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతాడు. లేదంటే వేరే భాష నుంచి సినిమా తీసుకుని రీమేక్ చేస్తాడు. ఎలా చేసినా.. మాస్ను అలరించడం మాత్రం బాగా తెలుసు.
ఇలాగే ఇప్పటిదాకా 8 వంద కోట్ల సినిమాలు అందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు అతడి నుంచి తొమ్మిదో వంద కోట్ల సినిమా వచ్చింది. అదే సూర్యవంశీ. కరోనా దెబ్బకు విలవిలలాడిపోయిన బాలీవుడ్కు ఊపిరి పోసిన చిత్రమిది. కేవలం వంద కోట్లతో ఆగిపోకుండా.. వరల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసిందీ సినిమా. ఫుల్ రన్లో రూ.250 కోట్ల మార్కును కూడా అందుకునేలా ఉంది.
సూర్యవంశీకి మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. ఇది కూడా రోహిత్ మార్కు రొటీన్ మాస్ మసాలా సినిమానే. కానీ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్కు లోటు లేదు. దీనికంటే ముందు రోహిత్.. టెంపర్ సినిమాను రీమేక్ చేశాడు. సింబా పేరుతో వచ్చిన ఆ సినిమా ప్రోమోలు చూసి టెంపర్ను చెడగొట్టేశారనే అభిప్రాయం కలిగింది. కానీ ఆ సినిమా కూడా రూ.200 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం.
This post was last modified on November 16, 2021 10:54 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…