Movie News

ఈ డైరెక్ట‌ర్.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మెషీన్


20 ఏళ్ల కెరీర్లో అప‌జ‌యం అన్న‌దే లేకుండా సాగిపోతున్నాడు మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఐతే ఆయ‌న‌కు విజ‌యాలేమీ ఊరికే వ‌చ్చేయ‌లేదు. ఒక‌ప్పుడు మామూలు సినిమాలే తీసినా.. ఆ త‌ర్వాత మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబ‌లి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు తీయ‌డానికి రాజ‌మౌళి ఎంతెంత క‌ష్ట‌ప‌డ్డాడో అంద‌రికీ తెలుసు.

ఐతే బాలీవుడ్లో ఇలా పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే వంద‌ల కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టే సినిమాలు అందించే ద‌ర్శ‌కుడొక‌డున్నాడు. అత‌నే రోహిత్ శెట్టి. అత‌నే కళాఖండాలు తీయ‌డు. మామూలు మాస్ మ‌సాలా సినిమాలే చేస్తుంటాడు. కానీ మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన అత‌డికి బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇంత‌క‌ముందు వ‌చ్చిన సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అవుతాడు. లేదంటే వేరే భాష నుంచి సినిమా తీసుకుని రీమేక్ చేస్తాడు. ఎలా చేసినా.. మాస్‌ను అల‌రించ‌డం మాత్రం బాగా తెలుసు.

ఇలాగే ఇప్ప‌టిదాకా 8 వంద కోట్ల సినిమాలు అందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు అత‌డి నుంచి తొమ్మిదో వంద కోట్ల సినిమా వ‌చ్చింది. అదే సూర్య‌వంశీ. క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడిపోయిన బాలీవుడ్‌కు ఊపిరి పోసిన చిత్ర‌మిది. కేవ‌లం వంద కోట్ల‌తో ఆగిపోకుండా.. వ‌ర‌ల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసిందీ సినిమా. ఫుల్ ర‌న్లో రూ.250 కోట్ల మార్కును కూడా అందుకునేలా ఉంది.

సూర్య‌వంశీకి మ‌రీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. ఇది కూడా రోహిత్ మార్కు రొటీన్ మాస్ మ‌సాలా సినిమానే. కానీ అభిమానుల‌కు, మాస్ ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్‌కు లోటు లేదు. దీనికంటే ముందు రోహిత్‌.. టెంప‌ర్ సినిమాను రీమేక్ చేశాడు. సింబా పేరుతో వ‌చ్చిన ఆ సినిమా ప్రోమోలు చూసి టెంప‌ర్‌ను చెడ‌గొట్టేశార‌నే అభిప్రాయం క‌లిగింది. కానీ ఆ సినిమా కూడా రూ.200 కోట్ల దాకా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం.

This post was last modified on November 16, 2021 10:54 pm

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

34 minutes ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

40 minutes ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

1 hour ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

2 hours ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

4 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

4 hours ago