20 ఏళ్ల కెరీర్లో అపజయం అన్నదే లేకుండా సాగిపోతున్నాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే ఆయనకు విజయాలేమీ ఊరికే వచ్చేయలేదు. ఒకప్పుడు మామూలు సినిమాలే తీసినా.. ఆ తర్వాత మగధీర, ఈగ, బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు తీయడానికి రాజమౌళి ఎంతెంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు.
ఐతే బాలీవుడ్లో ఇలా పెద్దగా కష్టపడకుండానే వందల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు అందించే దర్శకుడొకడున్నాడు. అతనే రోహిత్ శెట్టి. అతనే కళాఖండాలు తీయడు. మామూలు మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడు. కానీ మాస్ పల్స్ బాగా తెలిసిన అతడికి బాక్సాఫీస్ను షేక్ చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇంతకముందు వచ్చిన సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతాడు. లేదంటే వేరే భాష నుంచి సినిమా తీసుకుని రీమేక్ చేస్తాడు. ఎలా చేసినా.. మాస్ను అలరించడం మాత్రం బాగా తెలుసు.
ఇలాగే ఇప్పటిదాకా 8 వంద కోట్ల సినిమాలు అందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు అతడి నుంచి తొమ్మిదో వంద కోట్ల సినిమా వచ్చింది. అదే సూర్యవంశీ. కరోనా దెబ్బకు విలవిలలాడిపోయిన బాలీవుడ్కు ఊపిరి పోసిన చిత్రమిది. కేవలం వంద కోట్లతో ఆగిపోకుండా.. వరల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసిందీ సినిమా. ఫుల్ రన్లో రూ.250 కోట్ల మార్కును కూడా అందుకునేలా ఉంది.
సూర్యవంశీకి మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. ఇది కూడా రోహిత్ మార్కు రొటీన్ మాస్ మసాలా సినిమానే. కానీ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్కు లోటు లేదు. దీనికంటే ముందు రోహిత్.. టెంపర్ సినిమాను రీమేక్ చేశాడు. సింబా పేరుతో వచ్చిన ఆ సినిమా ప్రోమోలు చూసి టెంపర్ను చెడగొట్టేశారనే అభిప్రాయం కలిగింది. కానీ ఆ సినిమా కూడా రూ.200 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం.
This post was last modified on November 16, 2021 10:54 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…