మొత్తానికి 2022 సంక్రాంతికి తెలుగు చిత్రాల సమరంపై క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మాత్రమే ఇప్పటిదాకా ఖరారవగా.. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ కూడా బెర్తు ఖరారు చేసుకుంది. ఈ సినిమా ముందు నుంచే సంక్రాంతి రేసులో ఉంది కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ రాకతో అది వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. ఇప్పటికే మహేష్ మూవీ ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని వేసవికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
ఇగోకు పోయి ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం కంటే ఇలా వాయిదా వేసుకోవడమే కరెక్ట్ అనే అభిప్రాయాలు కలుగుతుండటంతో పవన్ సినిమాను కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పించవచ్చని అనుకున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’ టీం తగ్గలేదు. ముందు చెప్పినట్లే జనవరి 12నే తమ సినిమా వస్తుందని స్పష్టం చేసింది.
‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ మూవీ ‘గంగూబాయి కతియావాడీ’ నిర్మాతలను రిక్వెస్ట్ చేసి వాయిదాకు ఒప్పించగలిగిన రాజమౌళి.. ‘భీమ్లా నాయక్’ టీంకు మాత్రం కన్విన్స్ చేయలేకపోయాడు. ఆయన ఈ చిత్ర బృందానికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదని తెలుస్తోంది. దీంతో ‘భీమ్లా నాయక్’ టీంను, పవన్ కళ్యాణ్ను ఒక వర్గం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. ‘బాహుబలి’ లాగే ‘ఆర్ఆర్ఆర్’ కూడా టాలీవుడ్కు గర్వకారణమని.. అలాంటి సినిమాకు స్పేస్ ఇవ్వకుండా ఇలా పోటీకి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆల్రెడీ సంక్రాంతి బెర్తులు బుక్ అయ్యాక ‘ఆర్ఆర్ఆర్’ టీం లేటుగా రేసులోకి రావడం సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.
‘ఆర్ఆర్ఆర్’ అప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దసరాకు తమ చిత్రం పక్కాగా వస్తుందని క్లారిటీ ఇచ్చాకే వేరే చిత్రాలు సంక్రాంతికి బెర్తులు బుక్ చేసుకున్నాయి. ఆ మేరకు షూటింగ్ సహా అన్ని ప్రణాళికలు వేసుకుని ఆ దిశగా పని చేసుకుంటుంటే ఉన్నట్లుండి ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. వేసవి లాంటి సీజన్లో అయితే వేరే చిత్రాలను కొన్ని వారాలు వాయిదా వేసుకోవచ్చు. కానీ సంక్రాంతి కాదంటే మళ్లీ మంచి సీజన్ కోసం వేసవి వరకు ఎదురు చూడాలి. అందుకే ‘భీమ్లా నాయక్’ టీం వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. అయినా ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం వల్ల ‘భీమ్లా నాయక్’కే రిస్క్ కాబట్టి ఆ చిత్రాన్ని సంక్రాంతికే ఖరారు చేయడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.
This post was last modified on November 16, 2021 10:45 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…