మొత్తానికి 2022 సంక్రాంతికి తెలుగు చిత్రాల సమరంపై క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మాత్రమే ఇప్పటిదాకా ఖరారవగా.. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ కూడా బెర్తు ఖరారు చేసుకుంది. ఈ సినిమా ముందు నుంచే సంక్రాంతి రేసులో ఉంది కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ రాకతో అది వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. ఇప్పటికే మహేష్ మూవీ ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని వేసవికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
ఇగోకు పోయి ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం కంటే ఇలా వాయిదా వేసుకోవడమే కరెక్ట్ అనే అభిప్రాయాలు కలుగుతుండటంతో పవన్ సినిమాను కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పించవచ్చని అనుకున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’ టీం తగ్గలేదు. ముందు చెప్పినట్లే జనవరి 12నే తమ సినిమా వస్తుందని స్పష్టం చేసింది.
‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ మూవీ ‘గంగూబాయి కతియావాడీ’ నిర్మాతలను రిక్వెస్ట్ చేసి వాయిదాకు ఒప్పించగలిగిన రాజమౌళి.. ‘భీమ్లా నాయక్’ టీంకు మాత్రం కన్విన్స్ చేయలేకపోయాడు. ఆయన ఈ చిత్ర బృందానికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదని తెలుస్తోంది. దీంతో ‘భీమ్లా నాయక్’ టీంను, పవన్ కళ్యాణ్ను ఒక వర్గం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. ‘బాహుబలి’ లాగే ‘ఆర్ఆర్ఆర్’ కూడా టాలీవుడ్కు గర్వకారణమని.. అలాంటి సినిమాకు స్పేస్ ఇవ్వకుండా ఇలా పోటీకి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆల్రెడీ సంక్రాంతి బెర్తులు బుక్ అయ్యాక ‘ఆర్ఆర్ఆర్’ టీం లేటుగా రేసులోకి రావడం సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.
‘ఆర్ఆర్ఆర్’ అప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దసరాకు తమ చిత్రం పక్కాగా వస్తుందని క్లారిటీ ఇచ్చాకే వేరే చిత్రాలు సంక్రాంతికి బెర్తులు బుక్ చేసుకున్నాయి. ఆ మేరకు షూటింగ్ సహా అన్ని ప్రణాళికలు వేసుకుని ఆ దిశగా పని చేసుకుంటుంటే ఉన్నట్లుండి ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. వేసవి లాంటి సీజన్లో అయితే వేరే చిత్రాలను కొన్ని వారాలు వాయిదా వేసుకోవచ్చు. కానీ సంక్రాంతి కాదంటే మళ్లీ మంచి సీజన్ కోసం వేసవి వరకు ఎదురు చూడాలి. అందుకే ‘భీమ్లా నాయక్’ టీం వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. అయినా ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం వల్ల ‘భీమ్లా నాయక్’కే రిస్క్ కాబట్టి ఆ చిత్రాన్ని సంక్రాంతికే ఖరారు చేయడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.
This post was last modified on November 16, 2021 10:45 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…