Movie News

వాకింగ్ కు వెళ్లిన నటిపై దాడి.. గాయాలు

హైదరాబాద్ మహానగరంలో వీఐపీలు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు.. సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు వాకింగ్ చేసే ప్రాంతం కేబీఆర్ పార్కు. ప్రధాన రోడ్డు పక్కనే ఉండే ఈ పార్కుకు వాకింగ్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేయటానికి వచ్చిన నటిపై దాడి జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఆదివారం సాయంత్రం జరగ్గా.. ఆలస్యంగా బయటకు వచ్చింది.

ప్రస్తుతం దాడికి గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలైన నటి చౌరాసియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చూస్తే.. ఆదివారం సాయంత్రం చౌరాసియా కేబీఆర్ పార్కు వద్దకు వాకింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆమెపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆమె చేతిలో ఉన్న ఐఫోన్ ను లాక్కెళ్లాడు.

తన ఫోన్ ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న దుండగుడితో నటి చౌరాసియా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెపై దాడి చేయటమే కాకుండా.. రాయికి ఆమెను బలంగా కొట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. దుండగుడి కారణంగా గాయాలు కావటంతో ఆమె కింద పడిపోయారు. ఫోన్ ను దొంగలించిన అతను పారిపోయాడు.

అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. దాడిలో గాయపడిన నటిని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు గాయాలు అయినట్లు చెబుతున్నా.. దాని తీవ్రత ఎంతన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చే పార్కు వద్ద ఈ ఘటన జరగటం సంచలనంగా మారింది.

This post was last modified on November 15, 2021 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

13 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

33 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago