హైదరాబాద్ మహానగరంలో వీఐపీలు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు.. సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు వాకింగ్ చేసే ప్రాంతం కేబీఆర్ పార్కు. ప్రధాన రోడ్డు పక్కనే ఉండే ఈ పార్కుకు వాకింగ్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేయటానికి వచ్చిన నటిపై దాడి జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఆదివారం సాయంత్రం జరగ్గా.. ఆలస్యంగా బయటకు వచ్చింది.
ప్రస్తుతం దాడికి గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలైన నటి చౌరాసియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చూస్తే.. ఆదివారం సాయంత్రం చౌరాసియా కేబీఆర్ పార్కు వద్దకు వాకింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆమెపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆమె చేతిలో ఉన్న ఐఫోన్ ను లాక్కెళ్లాడు.
తన ఫోన్ ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న దుండగుడితో నటి చౌరాసియా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెపై దాడి చేయటమే కాకుండా.. రాయికి ఆమెను బలంగా కొట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. దుండగుడి కారణంగా గాయాలు కావటంతో ఆమె కింద పడిపోయారు. ఫోన్ ను దొంగలించిన అతను పారిపోయాడు.
అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. దాడిలో గాయపడిన నటిని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు గాయాలు అయినట్లు చెబుతున్నా.. దాని తీవ్రత ఎంతన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చే పార్కు వద్ద ఈ ఘటన జరగటం సంచలనంగా మారింది.
This post was last modified on November 15, 2021 10:48 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…