మోడర్న్ క్యారెక్టర్లు చేసే స్టార్ హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిలుగా చూపించాలంటే అంత తేలిక కాదు. ఈ మధ్యే వచ్చిన కొండపొలంలో గొర్రెలు మేపుకునే అమ్మాయిగా రకుల్ ప్రీత్ను చూపించడానికి క్రిష్ అండ్ టీం చాలానే కష్టపడింది. మేకప్ విషయంలో ఎంత శ్రమించారో వీడియో రూపంలో కూడా రిలీజ్ చేశారు.
రంగు తక్కువున్న వాళ్లకు రెగ్యులర్ మేకప్ వేసి తెల్లగా చేయడం కంటే.. మంచి రంగున్న వాళ్లను ఛామన ఛాయకు మార్చాలంటే తేలికేమీ కాదు. రకుల్ తర్వాత రష్మిక మందన్నా సైతం మేకప్ కోసం చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమెది పక్కా పల్లెటూరి పాత్ర. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియోల్లో రష్మిక ఒరిజినల్ కంటే తక్కువ రంగులో, ఛామన ఛాయలో కనిపిస్తోంది.
ఇందుకోసం మేకప్ ద్వారా బాగానే మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ విషయాన్ని రష్మిక పరోక్షంగా ఒక ఫొటో ద్వారా రివీల్ చేసింది. ఆమె తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక ఫొటో పెట్టింది. అందులో ఒక చేయి కనిపిస్తుండగా.. మణికట్టు వరకు నల్లగా ఉన్న ఆ చేయి.. పైభాగంలో తెల్లగా ఉంది. ఈ పొటో పెట్టి పుష్ప లంచ్ బ్రేక్స్ ఇలా ఉంటాయి అంటూ ఫన్నీ ఇమోజీ జోడించింది రష్మిక.
అంటే ఆమె ఒంటి మొత్తానికి నలుపు రంగు పూసేశారని.. తిండి తినడం కోసం చేతిని కడుక్కుంటే అది మాత్రం ఒరిజినల్ రంగులోకి వచ్చిందని పరోక్షంగా రష్మిక చెబుతున్నట్లుంది. సాలిడ్ కలర్లో ఉండే రష్మికను ఛామన ఛాయలో చూపించడానికి పుష్ప టీం ఎంత శ్రమిస్తోందో చెప్పడానికి ఈ ఫొటోనే రుజువు. ఈ సినిమాలో ఆమె శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 17న పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 15, 2021 7:40 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…