మోడర్న్ క్యారెక్టర్లు చేసే స్టార్ హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిలుగా చూపించాలంటే అంత తేలిక కాదు. ఈ మధ్యే వచ్చిన కొండపొలంలో గొర్రెలు మేపుకునే అమ్మాయిగా రకుల్ ప్రీత్ను చూపించడానికి క్రిష్ అండ్ టీం చాలానే కష్టపడింది. మేకప్ విషయంలో ఎంత శ్రమించారో వీడియో రూపంలో కూడా రిలీజ్ చేశారు.
రంగు తక్కువున్న వాళ్లకు రెగ్యులర్ మేకప్ వేసి తెల్లగా చేయడం కంటే.. మంచి రంగున్న వాళ్లను ఛామన ఛాయకు మార్చాలంటే తేలికేమీ కాదు. రకుల్ తర్వాత రష్మిక మందన్నా సైతం మేకప్ కోసం చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమెది పక్కా పల్లెటూరి పాత్ర. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియోల్లో రష్మిక ఒరిజినల్ కంటే తక్కువ రంగులో, ఛామన ఛాయలో కనిపిస్తోంది.
ఇందుకోసం మేకప్ ద్వారా బాగానే మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ విషయాన్ని రష్మిక పరోక్షంగా ఒక ఫొటో ద్వారా రివీల్ చేసింది. ఆమె తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక ఫొటో పెట్టింది. అందులో ఒక చేయి కనిపిస్తుండగా.. మణికట్టు వరకు నల్లగా ఉన్న ఆ చేయి.. పైభాగంలో తెల్లగా ఉంది. ఈ పొటో పెట్టి పుష్ప లంచ్ బ్రేక్స్ ఇలా ఉంటాయి అంటూ ఫన్నీ ఇమోజీ జోడించింది రష్మిక.
అంటే ఆమె ఒంటి మొత్తానికి నలుపు రంగు పూసేశారని.. తిండి తినడం కోసం చేతిని కడుక్కుంటే అది మాత్రం ఒరిజినల్ రంగులోకి వచ్చిందని పరోక్షంగా రష్మిక చెబుతున్నట్లుంది. సాలిడ్ కలర్లో ఉండే రష్మికను ఛామన ఛాయలో చూపించడానికి పుష్ప టీం ఎంత శ్రమిస్తోందో చెప్పడానికి ఈ ఫొటోనే రుజువు. ఈ సినిమాలో ఆమె శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 17న పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 15, 2021 7:40 am
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…