మోడర్న్ క్యారెక్టర్లు చేసే స్టార్ హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిలుగా చూపించాలంటే అంత తేలిక కాదు. ఈ మధ్యే వచ్చిన కొండపొలంలో గొర్రెలు మేపుకునే అమ్మాయిగా రకుల్ ప్రీత్ను చూపించడానికి క్రిష్ అండ్ టీం చాలానే కష్టపడింది. మేకప్ విషయంలో ఎంత శ్రమించారో వీడియో రూపంలో కూడా రిలీజ్ చేశారు.
రంగు తక్కువున్న వాళ్లకు రెగ్యులర్ మేకప్ వేసి తెల్లగా చేయడం కంటే.. మంచి రంగున్న వాళ్లను ఛామన ఛాయకు మార్చాలంటే తేలికేమీ కాదు. రకుల్ తర్వాత రష్మిక మందన్నా సైతం మేకప్ కోసం చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమెది పక్కా పల్లెటూరి పాత్ర. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియోల్లో రష్మిక ఒరిజినల్ కంటే తక్కువ రంగులో, ఛామన ఛాయలో కనిపిస్తోంది.
ఇందుకోసం మేకప్ ద్వారా బాగానే మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ విషయాన్ని రష్మిక పరోక్షంగా ఒక ఫొటో ద్వారా రివీల్ చేసింది. ఆమె తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక ఫొటో పెట్టింది. అందులో ఒక చేయి కనిపిస్తుండగా.. మణికట్టు వరకు నల్లగా ఉన్న ఆ చేయి.. పైభాగంలో తెల్లగా ఉంది. ఈ పొటో పెట్టి పుష్ప లంచ్ బ్రేక్స్ ఇలా ఉంటాయి అంటూ ఫన్నీ ఇమోజీ జోడించింది రష్మిక.
అంటే ఆమె ఒంటి మొత్తానికి నలుపు రంగు పూసేశారని.. తిండి తినడం కోసం చేతిని కడుక్కుంటే అది మాత్రం ఒరిజినల్ రంగులోకి వచ్చిందని పరోక్షంగా రష్మిక చెబుతున్నట్లుంది. సాలిడ్ కలర్లో ఉండే రష్మికను ఛామన ఛాయలో చూపించడానికి పుష్ప టీం ఎంత శ్రమిస్తోందో చెప్పడానికి ఈ ఫొటోనే రుజువు. ఈ సినిమాలో ఆమె శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 17న పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…