ఒక సినిమా సత్తా ఏంటో సరిగ్గా అంచనా వేసి సరైన రేటు పెట్టి సినిమాలు కొని డిస్ట్రిబ్యూట్ చేస్తాడని అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు పేరుంది. ఒకప్పుడు తెలుగు సినిమాల నైజాం మార్కెట్ ఎప్పుడూ 30 కోట్ల దాటని టైంలో బాహుబలి: ది కంక్లూజన్ మీద ఆయన ఏకంగా రూ.50 కోట్లు పెట్టి అందరూ విస్తుపోయేలా చేశాడు.
ఆ సినిమా ఆ మార్కును అలవోకగా దాటేసి రాజుకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఒక మామూలు సినిమా కోసం నైజాంలో రాజు ఏకంగా రూ.40 కోట్లు పెట్టేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. భీమ్లా నాయక్. ఇదొక రీమేక్ మూవీ. కథలో అంత భారీతనం ఏమీ ఉండదు. ఇద్దరు వ్యక్తుల ఇగో క్లాష్ చుట్టూ నడిచే కథ ఇది. పవన్ కళ్యాణే ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. ఆయన్ని నమ్ముకునే దిల్ రాజు నైజాం హక్కుల కోసం ఏకంగా రూ.40 కోట్లు పెట్టేస్తున్నట్లు సమాచారం.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాకుండా మరే చిత్రానికీ నైజాంలో రూ.40 కోట్ల రేటు పలకలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. అందులోనూ కరోనా వల్ల మార్కెట్ ఇంకా దెబ్బ తిన్న నేపథ్యంలో భీమ్లా నాయక్ లాంటి సినిమా మీద రూ.40 కోట్లు పెట్టడం అంటే సాహసమే. ఐతే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో రాజుకు బాగానే గురి ఉండటం, భీమ్లా నాయక్ ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచి, సినిమాకు మంచి హైప్ రావడంతో రాజు ధైర్యం చేస్తున్నట్లున్నాడు.
సంక్రాంతికైనా, మరో సీజన్లో అయినా భీమ్లా నాయక్ ఎప్పుడొచ్చినా భారీ వసూళ్లే సాధిస్తుందన్న అంచనాతో రాజు రికార్డు రేటు పెట్టేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మీద రాజుకు ఎప్పుడూ మంచి అంచనానే ఉంది. ఆయన సినిమాలు వేటికైనా అంతకుముందు చిత్రాలకంటే ఎక్కువ రేటే పెట్టి హక్కులు తీసుకుంటుంటాడు. మరి భీమ్లా నాయక్ విషయంలో ఆయన నమ్మకం ఏమేర ఫలిస్తుందో చూడాలి.
This post was last modified on November 15, 2021 7:24 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…