ఇంకో ఐదు రోజుల్లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. అందుకు ఐదు రోజుల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. స్టార్ హీరోల పుట్టిన రోజులొస్తుంటే.. ముందే స్పెషల్గా కామన్ డిస్ ప్లే పిక్ రెడీ చేయించి.. సెలబ్రెటీలతో దాన్ని లాంచ్ చేయించడం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది.
ఇదే కోవలో బాలయ్య అభిమానుల కోసం ఓ సీడీపీ తయారు చేయించారు. ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవరాయలు లుక్తో పాటు నిప్పురవ్వలో లుక్ తీసుకని జై బాలయ్య నినాదాలు, బాలయ్య తల్లిదండ్రుల ఫొటోలతో కలిపి ఈ సీడీపీ తయారు చేయించారు. ఈ సీడీపీని ఏకంగా 50 మంది ప్రముఖులతో లాంచ్ చేయించడం విశేషం. అందులో బాలయ్య తనయురాలు బ్రాహ్మణితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, పీఆర్వోలు ఉన్నారు.
గత నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 25 మంది సెలబ్రెటీలతో సీడీపీ లాంచ్ చేయించారు. బాలయ్య విషయానికి వచ్చేసరికి సంఖ్య రెట్టింపవడం విశేషం. ఇటీవల చిరు అండ్ కోతో బాలయ్య అనుకోని తగవు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం విషయంలో సినీ పరిశ్రమ రెండుగా చీలినట్లు కనిపించింది.
కానీ ఇప్పుడు చిరు వర్గం అనుకున్న చాలామంది బాలయ్య గురించి ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ ఆయన బర్త్ డే సీడీపీతో ట్వీట్లు వేయడం విశేషం. ఆ ట్వీట్లు.. అవి వేసిన వ్యక్తుల్ని చూస్తే వీళ్లు బాలయ్యను ఈ రేంజిలో లేపుతున్నారేంటి అన్న అనుమానం కలుగుతుంది.
చిరు, బాలయ్య మధ్య అనుకోకుండా వచ్చిన గ్యాప్ను ఫిల్ చేసి ఇండస్ట్రీ అంతా ఒకటే అని చూపించేందుకే ఈ ప్రయత్నమా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే బాలయ్య పుట్టిన రోజుకు ఇంకెంత హంగామా ఉంటుందో చూడాలి మరి.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…