Movie News

బాల‌య్యను ఓ రేంజిలో లేపుతున్నారే..

ఇంకో ఐదు రోజుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు. అందుకు ఐదు రోజుల ముందే సోష‌ల్ మీడియాలో హంగామా మొద‌లైపోయింది. స్టార్ హీరోల పుట్టిన రోజులొస్తుంటే.. ముందే స్పెష‌ల్‌గా కామ‌న్ డిస్ ప్లే పిక్ రెడీ చేయించి.. సెల‌బ్రెటీల‌తో దాన్ని లాంచ్ చేయించ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్‌గా మారింది.

ఇదే కోవ‌లో బాల‌య్య అభిమానుల కోసం ఓ సీడీపీ త‌యారు చేయించారు. ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు లుక్‌తో పాటు నిప్పుర‌వ్వ‌లో లుక్ తీసుక‌ని జై బాల‌య్య నినాదాలు, బాల‌య్య త‌ల్లిదండ్రుల ఫొటోల‌తో క‌లిపి ఈ సీడీపీ త‌యారు చేయించారు. ఈ సీడీపీని ఏకంగా 50 మంది ప్ర‌ముఖుల‌తో లాంచ్ చేయించ‌డం విశేషం. అందులో బాల‌య్య త‌న‌యురాలు బ్రాహ్మ‌ణితో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, పీఆర్వోలు ఉన్నారు.

గ‌త నెల‌లో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 25 మంది సెల‌బ్రెటీల‌తో సీడీపీ లాంచ్ చేయించారు. బాల‌య్య విష‌యానికి వ‌చ్చేస‌రికి సంఖ్య రెట్టింప‌వ‌డం విశేషం. ఇటీవ‌ల చిరు అండ్ కోతో బాల‌య్య అనుకోని త‌గ‌వు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం విష‌యంలో సినీ ప‌రిశ్ర‌మ రెండుగా చీలిన‌ట్లు క‌నిపించింది.

కానీ ఇప్పుడు చిరు వ‌ర్గం అనుకున్న చాలామంది బాల‌య్య గురించి ఓ రేంజిలో ఎలివేష‌న్లు ఇస్తూ ఆయ‌న బ‌ర్త్ డే సీడీపీతో ట్వీట్లు వేయ‌డం విశేషం. ఆ ట్వీట్లు.. అవి వేసిన వ్య‌క్తుల్ని చూస్తే వీళ్లు బాల‌య్యను ఈ రేంజిలో లేపుతున్నారేంటి అన్న అనుమానం క‌లుగుతుంది.

చిరు, బాల‌య్య మధ్య అనుకోకుండా వ‌చ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసి ఇండ‌స్ట్రీ అంతా ఒక‌టే అని చూపించేందుకే ఈ ప్ర‌య‌త్నమా అన్న సందేహాలు కూడా త‌లెత్తుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే బాల‌య్య పుట్టిన రోజుకు ఇంకెంత హంగామా ఉంటుందో చూడాలి మ‌రి.

This post was last modified on June 6, 2020 7:18 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

48 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

1 hour ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago