ఇంకో ఐదు రోజుల్లో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. అందుకు ఐదు రోజుల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. స్టార్ హీరోల పుట్టిన రోజులొస్తుంటే.. ముందే స్పెషల్గా కామన్ డిస్ ప్లే పిక్ రెడీ చేయించి.. సెలబ్రెటీలతో దాన్ని లాంచ్ చేయించడం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది.
ఇదే కోవలో బాలయ్య అభిమానుల కోసం ఓ సీడీపీ తయారు చేయించారు. ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవరాయలు లుక్తో పాటు నిప్పురవ్వలో లుక్ తీసుకని జై బాలయ్య నినాదాలు, బాలయ్య తల్లిదండ్రుల ఫొటోలతో కలిపి ఈ సీడీపీ తయారు చేయించారు. ఈ సీడీపీని ఏకంగా 50 మంది ప్రముఖులతో లాంచ్ చేయించడం విశేషం. అందులో బాలయ్య తనయురాలు బ్రాహ్మణితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, పీఆర్వోలు ఉన్నారు.
గత నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 25 మంది సెలబ్రెటీలతో సీడీపీ లాంచ్ చేయించారు. బాలయ్య విషయానికి వచ్చేసరికి సంఖ్య రెట్టింపవడం విశేషం. ఇటీవల చిరు అండ్ కోతో బాలయ్య అనుకోని తగవు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం విషయంలో సినీ పరిశ్రమ రెండుగా చీలినట్లు కనిపించింది.
కానీ ఇప్పుడు చిరు వర్గం అనుకున్న చాలామంది బాలయ్య గురించి ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ ఆయన బర్త్ డే సీడీపీతో ట్వీట్లు వేయడం విశేషం. ఆ ట్వీట్లు.. అవి వేసిన వ్యక్తుల్ని చూస్తే వీళ్లు బాలయ్యను ఈ రేంజిలో లేపుతున్నారేంటి అన్న అనుమానం కలుగుతుంది.
చిరు, బాలయ్య మధ్య అనుకోకుండా వచ్చిన గ్యాప్ను ఫిల్ చేసి ఇండస్ట్రీ అంతా ఒకటే అని చూపించేందుకే ఈ ప్రయత్నమా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే బాలయ్య పుట్టిన రోజుకు ఇంకెంత హంగామా ఉంటుందో చూడాలి మరి.
This post was last modified on June 6, 2020 7:18 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…