2022 సంక్రాంతి సినిమాల విషయంలో ఇప్పటిదాకా స్పష్టత కనిపించడం లేదు. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’.. 14న ‘రాధేశ్యామ్’ ఖరారైనట్లే కానీ.. మధ్యలో 12కు షెడ్యూల్ అయిన ‘భీమ్లా నాయక్ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ రాకతో ఆల్రెడీ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను వేసవికి వాయిదా వేసేశారు. ‘భీమ్లా నాయక్’ కూడా వాయిదా పడటం లాంఛనమే అనుకున్నారు. కానీ ఆ చిత్ర బృందం ఆ విషయాన్ని ధ్రువీకరించట్లేదు. పైగా ఇంతకుముందు లాగే ప్రమోషన్ల జోరు కొనసాగిస్తోంది. కొత్తగా ఏ ప్రోమో రిలీజ్ చేసినా జనవరి 12న విడుదల అనే నొక్కి వక్కాణిస్తోంది.
‘సర్కారు వారి పాట’ టీం కూడా ఒక దశలో ఇలాగే గాంభీర్యం ప్రదర్శించినా.. తర్వాత వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ టీం కూడా అలాగే చేస్తుందని భావిస్తున్నారు. కానీ ఎంతకీ విషయం మాత్రం తెగట్లేదు.
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’లతో పాటుగా ‘భీమ్లా నాయక్’ కూడా వస్తే కచ్చితంగా థియేటర్ల సమస్య తప్పదు. దీనికి తోడు వసూళ్లపైనా ప్రభావం ఉంటుంది. మూడు చిత్రాల్లో ఏది వీక్ అయితే దానికి వసూళ్లలో కోత పడుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్, దాని మీద ఉన్న అంచనాల దృష్ట్యా మిగతా రెండు చిత్రాలకే కష్టం అనే అభిప్రాయం ఉంది. ఎంతైనా ‘భీమ్లా నాయక్’ రీమేక్ మూవీ, పైగా మామూలు చిత్రం కాబట్టి దానికి ఇబ్బందే అంటున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం పవన్ కళ్యాణ్ మేనియాను నమ్ముకుంది.
తమ సినిమా పాటలు, ఇతర ప్రోమోలకు వస్తున్న అద్భుత స్పందనతో సంక్రాంతి విడుదల విషయంలో తగ్గొద్దనుకుంటోంది. డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాత సంప్రదింపులు కొనసాగుతున్నాయి. థియేటర్లు బుక్ చేసుకోవాలని సంకేతాలు కూడా అందినట్లుగా ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. సంక్రాంతికి ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ అందరిలోనూ కనిపిస్తోంది. ఒకవేళ పక్కాగా సంక్రాంతికి వచ్చేట్లయితే ‘భీమ్లా నాయక్’ టీం అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించి సస్పెన్సుకు తెరదించేస్తే బెటరేమో.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…