సుకుమార్ సినిమాలంటే ఎప్పుడూ ఒక భారీతనం ఉంటుంది. ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడే రకం ఐతే ఎంత ఖర్చు చేసినా.. సినిమాను సరిగ్గా మార్కెట్ చేసి.. క్రేజ్ పెంచి నిర్మాతలకు మంచి బిజినెస్ అయ్యేలాగా చూస్తాడన్న పేరు ఆయనకు ఉంది.
తన చివరి సినిమా రంగస్థలంకు కూడా సుకుమార్ బడ్జెట్ హద్దులు దాటించేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో.. ఏ స్థాయిలో బిజినెస్ జరిగిందో.. రిలీజ్ తర్వాత అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
ఐతే ఇలా బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల 1 నేనొక్కడినే లాంటి సినిమాల విషయంలో తగిలిన ఎదురు దెబ్బ ఎలాంటిదన్నది కూడా తెలిసిందే. ఐతే ఇప్పుడు తన కొత్త చిత్రం పుష్ప విషయంలోనూ సుకుమార్ ఓ రేంజిలో ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు కొంచెం ఎక్కువే అయిందట.
పుష్ప సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే.. సుదీర్ఘంగా సాగిన స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్ పనుల కోసం దాదాపు రూ.10 కోట్ల దాకా ఖర్చు పెట్టించినట్లుగా గుసగుసలు వినిపించాయి అప్పట్లో. ఇక కరోనా అడ్డంకులు.. మధ్య మధ్యలో షూటింగ్కు బ్రేకులు పడటం.. షెడ్యూళ్లు వాయిదా పడటం.. లాంటి కారణాలతో కూడా బడ్జెట్ ఎక్కువైంది.
ఇక మేకింగ్ విషయంలోనూ ఖర్చు మామూలుగా లేదట. కేవలం పాటలకే రూ.10 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడట సుక్కు. వేర్వేరు లొకేషన్లలో భారీగా జనాలతో.. భారీ సెట్ ప్రాపర్టీస్తో.. ఎక్కువ రోజులు తీసిన దాక్కో దాక్కో మేక పాటకే రూ.3 కోట్ల దాకా ఖర్చయినట్లు సమాచారం.
తాజాగా సామి సామి పాటను పూర్తి చేయగా.. దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. ఇక చివరగా ఐటెం సాంగ్ తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. దానికి 2-3 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారని.. అది సినిమాలో అన్నింటికంటే గ్రాండ్గా ఉండే సాంగ్ అని అంటున్నారు. మొత్తంగా సినిమాలో ఉన్న ఐదు పాటలకు కలిపి రూ.10 కోట్ల దాకా ఖర్చవుతోందట. అంటే ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా తీసే ఖర్చుతో సుకుమార్ పాటలే తీశాడన్నమాట.
This post was last modified on November 14, 2021 11:39 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…