సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలైన సమయంలో టికెట్ రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పిడిప్పుడే నిర్మాతలకు ఫేవర్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని, సినీ పెద్దలను ఏకిపారేస్తూ ఓ స్పీచ్ ఇచ్చారు. దీంతో అప్పటివరకు ఏపీ ప్రతినిధుల చుట్టూ తిరిగిన నిర్మాతలు తలలు పట్టుకున్నారు. మళ్లీ ఏపీ ప్రతినిధుల చుట్టూ తిరిగి టికెట్ రేట్లు పెంచమని రిక్వెస్ట్ చేసుకున్నారు.
కానీ ఇప్పటివరకు టికెట్ హైకింగ్ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ టాలీవుడ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన కొత్త ప్రపోజల్ విషయంలో ఏపీ గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ‘పుష్ప’ రిలీజ్ కి ముందు కానీ.. లేకపోతే సంక్రాంతి పండగకు కానీ టికెట్ రేట్స్ ను పెంచే అవకాశాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమా గనుక సంక్రాంతికి వస్తే.. ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది.
అందుకే ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి పవన్ ను తన సినిమాను వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. 2022 వేసవి వరకు సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని అడుగుతున్నారట. కానీ ‘బీమ్లా నాయక్’ మేకర్స్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికైతే.. సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గనుక డిసెంబర్ లోపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తే.. పవన్ తన సినిమాను జనవరిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on November 14, 2021 2:59 pm
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…