ఒక క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఎట్టకేలకు మొదలైంది. ‘క్రాక్’తో బ్లాక్బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త చిత్రానికి శనివారమే ముహూర్త వేడుక జరిగింది. ఈ ప్రాజెక్టు ఖరారై చాలా కాలమైంది కానీ.. రకరకాల కారణాల వల్ల సినిమా మొదలవడానికి టైం పట్టేసింది. ఈ చిత్రానికి కథానాయికగా శ్రుతి హాసన్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ రోజు ముహూర్త వేడుకలో ఆమె కూడా పాల్గొంది.
బాలయ్యతో కలిసి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. కానీ ఈ జోడీనిలా చూడటం కొంచెం కొత్తగానే అనిపిస్తోంది అందరికీ. ఎందుకంటే శ్రుతి హాసన్ ఇప్పటిదాకా బాలయ్య తరం సీనియర్ హీరోలు ఎవ్వరితోనూ ఇప్పటిదాకా రొమాన్స్ చేయలేదు. ఈ విషయంలో ఆమె తనకు తాను ఒక రూల్ పెట్టుకున్నట్లు చెబుతారు సన్నిహితులు.
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురూ కమల్ హాసన్ తరం హీరోలు. వీళ్లతోనే కాక తమిళంలోనూ కమల్ తరం హీరోలెవ్వరితోనూ శ్రుతి కలిసి నటించలేదు. తండ్రి తరం హీరోలతో రొమాన్స్ చేయడం బాగోదని ఆమె ఇప్పటిదాకా వాళ్లెవ్వరితోనూ సినిమాలు చేసినట్లు లేదు.
వీరి తర్వాతి తరం సీనియర్ హీరోలైన పవన్ కళ్యాణ్, రవితేజ, సూర్య లాంటి స్టార్లతో మాత్రమే జత కట్టింది. యంగ్ హీరోలు చాలామందితో ఆడిపాడింది. ఐతే మధ్యలో కొన్నేళ్లు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని ఏడాది నుంచి మళ్లీ బిజీ అవుతున్న శ్రుతి ఇప్పుడు తన వద్దకు ఏ అవకాశం వచ్చినా విడిచిపెట్టట్లేదు.
శ్రుతి కథానాయికగా గోపీచంద్ చేసిన బలుపు, క్రాక్ బ్లాక్బస్టర్ హిట్లు అయ్యేసరికి ఆమె అతడికి లక్కీ ఛార్మ్గా మారిపోయింది. దీంతో బాలయ్య సినిమాకు కూడా ఆమెనే అడిగాడు. శ్రుతి కాదనలేకపోయింది. తండ్రి తరం సీనియర్లతో రొమాన్స్ చేయకూడదన్న రూల్ పక్కన పెట్టేసి బాలయ్యతో ఆమె జట్టు కట్టబోతోంది. కాబట్టి ఇక చిరు, నాగ్, వెంకీలకు జోడీగా అడిగినా శ్రుతి కాదనకపోవచ్చు.
This post was last modified on November 13, 2021 2:32 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…