ఆంధ్రప్రదేశ్లో సినిమా బిజినెస్ మామూలుగానే కరోనా దెబ్బకు బాగా దెబ్బ తినేసింది. అది చాలదన్నట్లు టికెట్ల రేట్లపై అక్కడ నియంత్రణ తీసుకురావడంతో సినిమాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ‘ఎ’ సెంటర్ల వరకు టికెట్ల రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి కానీ.. బి, సి సెంటర్లలో దశాబ్దం కిందటున్న నామమాత్రపు రేట్లతో టికెట్లు అమ్మాలనడమే ఎవరికీ మింగుడు పడటం లేదు.
ఈ సెంటర్లలో కామన్ రేటు రూ.100 చొప్పున టికెట్ అమ్మేలా చూడాలని సినీ పరిశ్రమ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఇదిగో అదిగో అంటూనే నిర్ణయాన్ని వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ వేడుకలో ఈ విషయమై ఎంత గట్టిగా మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీని వల్ల మరింత ఇగోకు వెళ్లినట్లుంది ఏపీ సర్కారు. ఐతే టికెట్ల రేట్లపై నియంత్రణ వల్ల ఇన్ని రోజులూ నిర్మాతలకు నేరుగా సెగ తగల్లేదు. కానీ ఇప్పుడు కథ మారింది.
టాలీవుడ్లో పెద్ద సినిమాలకు సంబంధించి ఒకప్పుడు చేసుకున్న బిజినెస్ డీల్స్ రివైజ్ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. గత కొన్ని నెలల్లో రిలీజైన ప్రతి సినిమాకూ ఏపీలో అనుకున్న దానికంటే తక్కువ వసూళ్లే వచ్చాయి. తెలంగాణలో మంచి లాభాలందుకున్న ‘లవ్ స్టోరి’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి చిత్రాలకు కూడా ఏపీలో నష్టాలు తప్పలేదు.
ఈ నేపథ్యంలో ముందు అనుకున్న ఒప్పందాల కంటే 20 శాతం తక్కువగా డబ్బులు కడతామని, లేకుంటే తమకు వర్కవుట్ కాదని ఏపీలో బయ్యర్లు కచ్చితంగా చెబుతున్నారు. దీనికి నిర్మాతలు ససేమిరా అంటున్నారు. ముందు అనుకున్న రేట్లకు సినిమాను కొని తెలిసి తెలిసి తామెలా నష్టపోతామంటున్నారు బయ్యర్లు. నిర్మాతలేమీ అలా తగ్గిస్తే తాము నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఇక వాళ్లకున్న ఏకైక మార్గం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు పారితోషకాల్లో కోత విధించడమే.
ముఖ్యంగా సినిమాకు సంబంధించి మేజర్ పారితోషకం వెళ్లేది హీరోలకే. వాళ్లు కొంచెం తగ్గించుకుని డబ్బులు వెనక్కి ఇచ్చినా, పుచ్చుకోబోయే దాంట్లో కోత పెట్టుకున్నా సమస్య కొంచెం పరిష్కారం అవుతుంది. కానీ హీరోలను అలా అడిగే ధైర్యం నిర్మాతలకు ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు బయ్యర్లతో డీల్ చేయలేక, అటు హీరోలకు సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారు నిర్మాతలు. ఏపీలో టికెట్ల రేట్ల గొడవ పరిష్కారం అయ్యే వరకు ఈ తలనొప్పి తప్పదు.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…