నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసేశారు. ఈ కేసులో కొన్నాళ్లపాటు రియా జైల్లో కూడా ఉంది. ఆ తరువాత బయటకొచ్చింది. ఇప్పుడు ఆమె బ్యాంక్ అకౌంట్ల విషయంలో కోర్టు రియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో నిందితురాలిగా ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసింది ఎన్సీబీ. అయితే పది నెలలుగా తన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని.. ఈ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని రియా కోర్టుని ఆశ్రయించింది.
రియా అకౌంట్లను ఫ్రీజ్ చేసే ఉంచారని.. ఇంకా విచారణ జరుగుతోందని ఎన్సీబీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కానీ ఇప్పటికే పది నెలలు గడిచిపోవడంతో కోర్టు ఎన్సీబీ వాదనను పట్టించుకోలేదు. రియా బ్యాంక్ అకౌంట్లను డీఫ్రీజ్ చేయమంటూ కోర్టు తీర్పునిచ్చింది. అలానే రియా ఐఫోన్, ఐప్యాడ్ లను కూడా తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఈ విషయంలో రియాకు రిలీఫ్ దొరికింది.
సుశాంత్ తో రిలేషన్ లో ఉండడంతో అతడి మరణానికి ఆమెకి లింక్ ఉందనే అనుమానంతో రియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత కేసు మొత్తం తారుమారై డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లో రియాకు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. మీడియా వర్గాల్లో కూడా రియా గురించి నానా రచ్చ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆమెకి ఈ కేసులో ఊరట లభిస్తుంది.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…