Movie News

ఎట్టకేలకు రియాకు రిలీఫ్!

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసేశారు. ఈ కేసులో కొన్నాళ్లపాటు రియా జైల్లో కూడా ఉంది. ఆ తరువాత బయటకొచ్చింది. ఇప్పుడు ఆమె బ్యాంక్ అకౌంట్ల విషయంలో కోర్టు రియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో నిందితురాలిగా ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసింది ఎన్సీబీ. అయితే పది నెలలుగా తన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని.. ఈ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని రియా కోర్టుని ఆశ్రయించింది.

రియా అకౌంట్లను ఫ్రీజ్ చేసే ఉంచారని.. ఇంకా విచారణ జరుగుతోందని ఎన్సీబీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కానీ ఇప్పటికే పది నెలలు గడిచిపోవడంతో కోర్టు ఎన్సీబీ వాదనను పట్టించుకోలేదు. రియా బ్యాంక్ అకౌంట్లను డీఫ్రీజ్ చేయమంటూ కోర్టు తీర్పునిచ్చింది. అలానే రియా ఐఫోన్, ఐప్యాడ్ లను కూడా తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఈ విషయంలో రియాకు రిలీఫ్ దొరికింది.

సుశాంత్ తో రిలేషన్ లో ఉండడంతో అతడి మరణానికి ఆమెకి లింక్ ఉందనే అనుమానంతో రియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత కేసు మొత్తం తారుమారై డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లో రియాకు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. మీడియా వర్గాల్లో కూడా రియా గురించి నానా రచ్చ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆమెకి ఈ కేసులో ఊరట లభిస్తుంది.

Satya

Recent Posts

పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…

50 minutes ago

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

3 hours ago

సేతుపతి స్థానంలో రాజశేఖర్?

దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…

3 hours ago

అరడజను సినిమాలు ‘పెద్ది’కి పోటీగా

అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…

3 hours ago

తెలంగాణలో పెద్ది టెన్షన్… కానీ ఏపీలో మొదలెట్టేశారు

తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…

4 hours ago

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు రాజుకుందా…?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…

4 hours ago