నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసేశారు. ఈ కేసులో కొన్నాళ్లపాటు రియా జైల్లో కూడా ఉంది. ఆ తరువాత బయటకొచ్చింది. ఇప్పుడు ఆమె బ్యాంక్ అకౌంట్ల విషయంలో కోర్టు రియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో నిందితురాలిగా ఆమె బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసింది ఎన్సీబీ. అయితే పది నెలలుగా తన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని.. ఈ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని రియా కోర్టుని ఆశ్రయించింది.
రియా అకౌంట్లను ఫ్రీజ్ చేసే ఉంచారని.. ఇంకా విచారణ జరుగుతోందని ఎన్సీబీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కానీ ఇప్పటికే పది నెలలు గడిచిపోవడంతో కోర్టు ఎన్సీబీ వాదనను పట్టించుకోలేదు. రియా బ్యాంక్ అకౌంట్లను డీఫ్రీజ్ చేయమంటూ కోర్టు తీర్పునిచ్చింది. అలానే రియా ఐఫోన్, ఐప్యాడ్ లను కూడా తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఈ విషయంలో రియాకు రిలీఫ్ దొరికింది.
సుశాంత్ తో రిలేషన్ లో ఉండడంతో అతడి మరణానికి ఆమెకి లింక్ ఉందనే అనుమానంతో రియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత కేసు మొత్తం తారుమారై డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లో రియాకు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. మీడియా వర్గాల్లో కూడా రియా గురించి నానా రచ్చ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆమెకి ఈ కేసులో ఊరట లభిస్తుంది.
This post was last modified on November 10, 2021 6:16 pm
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…