Movie News

బాబాయ్ అబ్బాయ్.. క్లారిటీ ప్లీజ్

అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న రావాల్సిన సినిమా ‘విరాటపర్వం’. ముందుగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆ చిత్రం.. వైరస్ ప్రభావం తొలగిపోయి థియేటర్లు పున:ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా రిలీజ్ దిశగా అడుగులే వేయట్లేదు. అలాగని ఓటీటీలో అయినా సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నాలైనా జరుగుతున్నాయా అంటే అలాంటి సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఈ సినిమా గురించి మీడియాలో ఏవేవో రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ వార్తల లింక్స్ మీద హీరో రానా దగ్గుబాటి వ్యంగ్యంగా స్పందిస్తున్నాడు. సెటైర్లు బాగానే వేస్తున్నాడు.

అది బాగానే ఉంది కానీ.. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మాత్రం దగ్గుబాటి హీరో ఏ సమాధానం చెప్పట్లేదు. మరీ ఇలా నెలలు నెలలు ప్రేక్షకులను వెయిట్ చేయిస్తుంటే సినిమా మీద ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ సినిమా అనే కాదు.. సురేష్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన వెంకటేష్ సినిమా ‘దృశ్యం-2’ విషయంలో కూడా ఏ క్లారిటీ లేదు. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం అయింది. ఈ రెండు చిత్రాలతో పాటుగా ‘నారప్ప’ సినిమాకు కలిపి సురేష్ బాబు ఓటీటీ డీల్స్ చేసుకున్నట్లుగా వేసవిలో వార్తలొచ్చాయి.

కానీ వీటిలో ‘నారప్ప’ ఒక్కటే జూన్‌లో అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. అప్పుడు ఓటీటీ రిలీజ్ విషయంలో వ్యతిరేకత వచ్చినా సురేష్ బాబు తగ్గలేదు. ఆ చిత్రాన్ని ప్రైమ్‌లోనే రిలీజ్ చేశారు. ఒకవేళ ‘దృశ్యం-2’, ‘విరాటపర్వం’ చిత్రాల విషయంలోనూ ఓటీటీ బాటలోనే వెళ్లాలనుకుంటే.. ‘నారప్ప’ విషయంలో మొహమాట పడని సురేష్ బాబు వీటి విషయంలో ఎందుకు తగ్గుతున్నాడో అర్థం కావడం లేదు. పోనీ ఈ చిత్రాలకు ఓటీటీ డీల్స్ క్యాన్సిల్ చేసి థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలనుకుంటే.. ఆ పని అయినా చేయాల్సింది. కానీ ఎటూ తేల్చకుండా నెలలకు నెలలు రిలీజ్ ఆపడం వల్ల అసలుకే మోసం వస్తోంది. ఆయనకు వడ్డీల భారం, పైగా సినిమాల మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా బాబాయ్-అబ్బాయ్ సినిమాల విషయంలో ఓ క్లారిటీ వస్తే బెటర్.

This post was last modified on November 10, 2021 3:31 pm

Share
Show comments

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago