సూపర్ స్టార్ మహేష్ బాబు తెరమీద ఉదాత్తమైన పాత్రలు చేయడమే కాదు.. బయట కూడా గొప్ప స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. ఇప్పటిదాకా మహేష్ చొరవతో వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించడం తెలిసిందే. ఇంకా వేరే రకంగారూ మహేష్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఏపీలో ఒక గ్రామం, తెలంగాణలో మరో గ్రామం దత్తత తీసుకుని వాటిని మహేష్ అభివృద్ధి చేయిస్తున్న సంగతి తెలిసిందే.
గ్రామాల దత్తత నేపథ్యంలో సాగే ‘శ్రీమంతుడు’ సినిమా చేసిన టైంలో మహేష్ ఈ బాధ్యత చేపట్టాడు. ఆ సినిమా కాన్సెప్ట్ మహేష్లోనే కాదు.. ఇలాంటి శ్రీమంతులు చాలామందిలో కదలిక తెచ్చి తాము పుట్టిన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేలా స్ఫూర్తినిచ్చింది.
ఈ క్రమంలోనే సుభాష్ రెడ్డి అనే వ్యాపారవేత్త తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతంలో తాను పుట్టిన ఊరిలో అధునాతన సౌకర్యాలతో పాఠశాల నిర్మించారు. ఇదే స్కూల్లో చదువుకున్న పాత విద్యార్థులు మరిందరు ఆయనకు సహకారం అందించారు. ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్ మంగళవారం ఆరంభించారు. ఈ సందర్భంగానే ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో సుభాష్ రెడ్డి ఈ పాఠశాలను నిర్మించిన విషయం వెల్లడించారు. ఈ విషయం తెలిసి మహేష్ కదిలిపోయాడు.
ట్విట్టర్లో స్కూల్ ఇనాగరేషన్ ఫంక్షన్ తాలూకు వీడియోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో ఈ స్కూల్ నిర్మాణం జరిగిందని తెలిసి తనకెంతో సంతోషంగా ఉందని, సుభాష్ రెడ్డి లాంటి రియల్ హీరోలు సొసైటీకి చాలా అవసరమని మహేష్ వ్యాఖ్యానించాడు. ఈ స్కూల్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగాక ‘శ్రీమంతుడు’ టీంతో కలిసి పాఠశాలను తాను సందర్శిస్తానని కూడా మహేష్ పేర్కొనడం విశేషం.
This post was last modified on November 10, 2021 3:28 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…