బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. సామ్ బాంబే తన మొదటి భార్య అల్విరాతో ఇప్పటికీ మాట్లాడుతుండడంతో పూనమ్ అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన సామ్ బాంబే.. పూనమ్ ను గోడకేసి కొట్టాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో ఆమె తన భర్త సామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పూనమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. పూనమ్ దాదాపు రెండేళ్లపాటు సామ్ బాంబేతో సహజీవనం చేసి గతేడాది సెప్టెంబర్ 1న అతడిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నిరోజులకే తన భర్త చేయి చేసుకోవడంతో అతడిపై డొమెస్టిక్ వయిలెన్స్ కేసు పెట్టింది. ఆ సమయంలో సామ్ బాంబే తనను క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే.. పూనమ్ పై దాడి చేశాడు.
ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడింది పూనమ్. తన భర్త సామ్ ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని.. ప్రతిసారీ కొడుతూ, ఆ తరువాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో కరిగిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపరిచాడని.. సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడని వాపోయింది. దీనివలన ఎన్నిరోజు హాస్పిటల్ లో ఉండాల్సివస్తుందే తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.
This post was last modified on November 9, 2021 12:06 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…