బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. సామ్ బాంబే తన మొదటి భార్య అల్విరాతో ఇప్పటికీ మాట్లాడుతుండడంతో పూనమ్ అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన సామ్ బాంబే.. పూనమ్ ను గోడకేసి కొట్టాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో ఆమె తన భర్త సామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పూనమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. పూనమ్ దాదాపు రెండేళ్లపాటు సామ్ బాంబేతో సహజీవనం చేసి గతేడాది సెప్టెంబర్ 1న అతడిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నిరోజులకే తన భర్త చేయి చేసుకోవడంతో అతడిపై డొమెస్టిక్ వయిలెన్స్ కేసు పెట్టింది. ఆ సమయంలో సామ్ బాంబే తనను క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే.. పూనమ్ పై దాడి చేశాడు.
ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడింది పూనమ్. తన భర్త సామ్ ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని.. ప్రతిసారీ కొడుతూ, ఆ తరువాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో కరిగిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపరిచాడని.. సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడని వాపోయింది. దీనివలన ఎన్నిరోజు హాస్పిటల్ లో ఉండాల్సివస్తుందే తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.
This post was last modified on November 9, 2021 12:06 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…