బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. సామ్ బాంబే తన మొదటి భార్య అల్విరాతో ఇప్పటికీ మాట్లాడుతుండడంతో పూనమ్ అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన సామ్ బాంబే.. పూనమ్ ను గోడకేసి కొట్టాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో ఆమె తన భర్త సామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పూనమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. పూనమ్ దాదాపు రెండేళ్లపాటు సామ్ బాంబేతో సహజీవనం చేసి గతేడాది సెప్టెంబర్ 1న అతడిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నిరోజులకే తన భర్త చేయి చేసుకోవడంతో అతడిపై డొమెస్టిక్ వయిలెన్స్ కేసు పెట్టింది. ఆ సమయంలో సామ్ బాంబే తనను క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే.. పూనమ్ పై దాడి చేశాడు.
ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడింది పూనమ్. తన భర్త సామ్ ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని.. ప్రతిసారీ కొడుతూ, ఆ తరువాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో కరిగిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపరిచాడని.. సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడని వాపోయింది. దీనివలన ఎన్నిరోజు హాస్పిటల్ లో ఉండాల్సివస్తుందే తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.
This post was last modified on November 9, 2021 12:06 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…