బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. సామ్ బాంబే తన మొదటి భార్య అల్విరాతో ఇప్పటికీ మాట్లాడుతుండడంతో పూనమ్ అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన సామ్ బాంబే.. పూనమ్ ను గోడకేసి కొట్టాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో ఆమె తన భర్త సామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పూనమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. పూనమ్ దాదాపు రెండేళ్లపాటు సామ్ బాంబేతో సహజీవనం చేసి గతేడాది సెప్టెంబర్ 1న అతడిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నిరోజులకే తన భర్త చేయి చేసుకోవడంతో అతడిపై డొమెస్టిక్ వయిలెన్స్ కేసు పెట్టింది. ఆ సమయంలో సామ్ బాంబే తనను క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే.. పూనమ్ పై దాడి చేశాడు.
ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడింది పూనమ్. తన భర్త సామ్ ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని.. ప్రతిసారీ కొడుతూ, ఆ తరువాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో కరిగిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపరిచాడని.. సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడని వాపోయింది. దీనివలన ఎన్నిరోజు హాస్పిటల్ లో ఉండాల్సివస్తుందే తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.
This post was last modified on November 9, 2021 12:06 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…