వరుస సినిమాలను అనౌన్స్ చేయడమే కాదు.. వాటిని చకచకా పూర్తి చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ ఆచార్య రిలీజ్ డేట్ని ప్రకటించారు. గాడ్ఫాదర్ని చకచకా కంప్లీట్ చేస్తున్నారు. భోళాశంకర్ని లైన్లో పెట్టారు. ఇప్పుడు తన 154వ సినిమాని కూడా లాంఛనంగా మొదలు పెట్టేశారు.
బాబి డైరెక్షన్లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఓ మాస్ పోస్టర్ని విడుదల చేసి ఇంప్రెస్ చేసింది టీమ్. ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ మాస్ లుక్తో మెస్మరైజ్ చేశారు. ఇందులో చిరంజీవి స్టైల్ చూస్తుంటే మళ్లీ ఒకప్పటికి మెగాస్టార్ని చూసినట్టే ఉంది. పోస్టర్తోనే ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేయడం ఖాయమనిపిస్తోంది. అరాచకం ఆరంభం అని కోట్ చేశాడంటే బాబి ఈ సినిమాని ఏ రేంజ్లో తెరకెక్కించబోతున్నాడో ఊహించవచ్చు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్గా శ్రుతీ హాసన్ను సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ తను ప్రభాస్తో సాలార్ మూవీ చేస్తోంది. గోపీచంద్ మలినేని చిత్రంలో బాలయ్య సరసన కూడా కనిపించనుందని రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు చిరంజీవితో కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వాల్తేరు వీర్రాజు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on November 8, 2021 10:54 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…