వరుస సినిమాలను అనౌన్స్ చేయడమే కాదు.. వాటిని చకచకా పూర్తి చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ ఆచార్య రిలీజ్ డేట్ని ప్రకటించారు. గాడ్ఫాదర్ని చకచకా కంప్లీట్ చేస్తున్నారు. భోళాశంకర్ని లైన్లో పెట్టారు. ఇప్పుడు తన 154వ సినిమాని కూడా లాంఛనంగా మొదలు పెట్టేశారు.
బాబి డైరెక్షన్లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఓ మాస్ పోస్టర్ని విడుదల చేసి ఇంప్రెస్ చేసింది టీమ్. ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ మాస్ లుక్తో మెస్మరైజ్ చేశారు. ఇందులో చిరంజీవి స్టైల్ చూస్తుంటే మళ్లీ ఒకప్పటికి మెగాస్టార్ని చూసినట్టే ఉంది. పోస్టర్తోనే ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేయడం ఖాయమనిపిస్తోంది. అరాచకం ఆరంభం అని కోట్ చేశాడంటే బాబి ఈ సినిమాని ఏ రేంజ్లో తెరకెక్కించబోతున్నాడో ఊహించవచ్చు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్గా శ్రుతీ హాసన్ను సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ తను ప్రభాస్తో సాలార్ మూవీ చేస్తోంది. గోపీచంద్ మలినేని చిత్రంలో బాలయ్య సరసన కూడా కనిపించనుందని రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు చిరంజీవితో కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వాల్తేరు వీర్రాజు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on November 8, 2021 10:54 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…