వరుస సినిమాలను అనౌన్స్ చేయడమే కాదు.. వాటిని చకచకా పూర్తి చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ ఆచార్య రిలీజ్ డేట్ని ప్రకటించారు. గాడ్ఫాదర్ని చకచకా కంప్లీట్ చేస్తున్నారు. భోళాశంకర్ని లైన్లో పెట్టారు. ఇప్పుడు తన 154వ సినిమాని కూడా లాంఛనంగా మొదలు పెట్టేశారు.
బాబి డైరెక్షన్లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఓ మాస్ పోస్టర్ని విడుదల చేసి ఇంప్రెస్ చేసింది టీమ్. ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ మాస్ లుక్తో మెస్మరైజ్ చేశారు. ఇందులో చిరంజీవి స్టైల్ చూస్తుంటే మళ్లీ ఒకప్పటికి మెగాస్టార్ని చూసినట్టే ఉంది. పోస్టర్తోనే ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేయడం ఖాయమనిపిస్తోంది. అరాచకం ఆరంభం అని కోట్ చేశాడంటే బాబి ఈ సినిమాని ఏ రేంజ్లో తెరకెక్కించబోతున్నాడో ఊహించవచ్చు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్గా శ్రుతీ హాసన్ను సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ తను ప్రభాస్తో సాలార్ మూవీ చేస్తోంది. గోపీచంద్ మలినేని చిత్రంలో బాలయ్య సరసన కూడా కనిపించనుందని రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు చిరంజీవితో కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వాల్తేరు వీర్రాజు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…