నిత్యామీనన్ ఏదైనా సినిమా యాక్సెప్ట్ చేసిందంటే అందులో కచ్చితంగా ఏదో ఒక మంచి పాయింటే ఉంటుందని నమ్ముతారు ఆడియెన్స్. ఆమెకి సత్యదేవ్ లాంటి మంచి ఆర్టిస్ట్ తోడయ్యాడు. వాళ్లిద్దరితో రాహుల్ రామకృష్ణ లాంటి గుడ్ పర్ఫార్మర్ కలిశాడు. ఇంకేముంది.. స్కైల్యాబ్ ట్రైలర్ అదిరింది.
1979లో అమెరికా ఏర్పాటు చేసిన స్కైల్యాబ్ భూమ్మీద పడబోతోందనే వార్తలు ప్రజల్ని చాలా కంగారుపెట్టాయి. ఏ శకలం వచ్చి పడుతుందో, తమని ఎక్కడ తుడిచి పెట్టేస్తుందో అని ప్రపంచ దేశాలన్నీ కంగారుపడ్డాయి. అలాంటి సమయంలో కరీంనగర్ జిల్లాలోని బండ లింగంపల్లి అనే ఊళ్లో ప్రజలు ఎలా ఫీలయ్యారు, వారి జీవితాలు ఎలా మారాయి అనే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు విశ్వక్ కందెరావ్. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ ట్రైలర్ను వదిలారు. పూర్తి భిన్నమైన కథతో, విభిన్నమైన క్యారెక్టర్స్తో రూపొందుతున్న ఈ కామెడీ డ్రామా ఎలా ఉంటుందో రుచి చూపించారు.
సత్యదేవ్కి డబ్బు పిచ్చి. బండ లింగంపల్లిలో క్లినిక్ స్టార్ట్ చేసి ఎక్కడికో ఎదిగిపోవాలనుకుంటారు. రిపోర్టర్గా సంచలనాలు సృష్టించాలనుకునే దొరబిడ్డ గౌరిగా నిత్యామీనన్ కనిపిస్తోంది. ఏదో ఒక అద్భుతమైన న్యూస్ దొరికితే జీవితమే మారిపోతుందని ఎదురు చూస్తుంటుంది. సుబేదార్ రామారావు పాత్రను రాహుల్ రామకృష్ణ పోషించాడు. స్కైల్యాబ్ పడుతోందనే వార్తతో వీరి జీవితాలు ఎలా మారాయి అనేది చాలా ఎంటర్టైనింగ్గా చూపించారని ట్రైలర్లోని కామెడీ చూస్తే అర్థమవుతోంది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే నిత్య, సత్యదేవ్ల బ్యాగ్లో మంచి హిట్ పడినట్టే.
This post was last modified on November 7, 2021 3:59 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…