Movie News

రజినీ మార్కెట్ ఎంతలా పడిందంటే..

ఒకప్పుడు తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజవుతుంటే దానికి పోటీగా మన సినిమాలను రిలీజ్ చేయడానికి జంకేవారు. మన స్టార్ హీరోలతో సమానంగా రజినీకి క్రేజ్, మార్కెట్ ఉండేవి. ఆయన సినిమాలకు మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగేది. టాక్ బాలేకున్నా ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండేది కాదు. బాషా, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, శివాజి, రోబో లాంటి సినిమాలు మామూలు వసూళ్లు రాబట్టలేదు. ‘కబాలి’ టైంకి రజినీకి తెలుగులో క్రేజ్ పీక్స్‌కు చేరి.. ఆ చిత్రానికి తొలి రోజు రూ.12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ‘2.0’కు ఇంతకంటే ఎక్కువ ఓపెనింగ్సే వచ్చాయి కానీ.. అది వేరే లీగ్ సినిమా. ఐతే అప్పుడు ఆ స్థాయిలో ఉన్న రజినీ మార్కెట్.. ఇప్పుడు ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఆయన కొత్త చిత్రం ‘పెద్దన్న’కు వచ్చిన ఓపెనింగ్సే నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం కేవలం 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.

నైజాంలో అయితే మరీ కనీసంగా రూ.42 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. రజినీ చివరి సినిమా ‘దర్బార్’కు తెలంగాణ వరకే రూ.2.3 కోట్ల వసూళ్లు రావడం గమనార్హం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా అందులో మూడో వంతు వసూళ్లే వచ్చాయి. ‘కబాలి’ దగ్గర్నుంచి తన స్థాయికి తగని సినిమాలు చేసి ఇంతకుముందున్న భారీ మార్కెట్‌ను రజినీ చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. ‘పెద్దన్న’ విషయంలో మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎగ్జైట్మెంట్ లేదని.. రజినీ పట్ల వారికి ముందున్న ఆసక్తి మొత్తం పోయిందని.. ఆయన క్రేజ్, మార్కెట్ దారుణంగా దెబ్బ తినేశాయని స్పష్టమవుతోంది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు మరీ నామమాత్రంగానే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ అవ్వగానే సినిమా కథ ముగిసినట్లే అనుకోవచ్చు. ‘పెద్దన్న’ చూశాక అసలు రజినీ సినిమాలు మానేస్తే బెటర్ అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.

This post was last modified on November 7, 2021 3:12 am

Share
Show comments
Published by
suman

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

59 minutes ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

3 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

3 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

5 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

6 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

7 hours ago