ఒకప్పుడు తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజవుతుంటే దానికి పోటీగా మన సినిమాలను రిలీజ్ చేయడానికి జంకేవారు. మన స్టార్ హీరోలతో సమానంగా రజినీకి క్రేజ్, మార్కెట్ ఉండేవి. ఆయన సినిమాలకు మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగేది. టాక్ బాలేకున్నా ఓపెనింగ్స్కు ఢోకా ఉండేది కాదు. బాషా, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, శివాజి, రోబో లాంటి సినిమాలు మామూలు వసూళ్లు రాబట్టలేదు. ‘కబాలి’ టైంకి రజినీకి తెలుగులో క్రేజ్ పీక్స్కు చేరి.. ఆ చిత్రానికి తొలి రోజు రూ.12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ‘2.0’కు ఇంతకంటే ఎక్కువ ఓపెనింగ్సే వచ్చాయి కానీ.. అది వేరే లీగ్ సినిమా. ఐతే అప్పుడు ఆ స్థాయిలో ఉన్న రజినీ మార్కెట్.. ఇప్పుడు ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఆయన కొత్త చిత్రం ‘పెద్దన్న’కు వచ్చిన ఓపెనింగ్సే నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం కేవలం 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
నైజాంలో అయితే మరీ కనీసంగా రూ.42 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. రజినీ చివరి సినిమా ‘దర్బార్’కు తెలంగాణ వరకే రూ.2.3 కోట్ల వసూళ్లు రావడం గమనార్హం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా అందులో మూడో వంతు వసూళ్లే వచ్చాయి. ‘కబాలి’ దగ్గర్నుంచి తన స్థాయికి తగని సినిమాలు చేసి ఇంతకుముందున్న భారీ మార్కెట్ను రజినీ చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. ‘పెద్దన్న’ విషయంలో మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎగ్జైట్మెంట్ లేదని.. రజినీ పట్ల వారికి ముందున్న ఆసక్తి మొత్తం పోయిందని.. ఆయన క్రేజ్, మార్కెట్ దారుణంగా దెబ్బ తినేశాయని స్పష్టమవుతోంది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు మరీ నామమాత్రంగానే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ అవ్వగానే సినిమా కథ ముగిసినట్లే అనుకోవచ్చు. ‘పెద్దన్న’ చూశాక అసలు రజినీ సినిమాలు మానేస్తే బెటర్ అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.
This post was last modified on November 7, 2021 3:12 am
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…