ఒకప్పుడు తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజవుతుంటే దానికి పోటీగా మన సినిమాలను రిలీజ్ చేయడానికి జంకేవారు. మన స్టార్ హీరోలతో సమానంగా రజినీకి క్రేజ్, మార్కెట్ ఉండేవి. ఆయన సినిమాలకు మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగేది. టాక్ బాలేకున్నా ఓపెనింగ్స్కు ఢోకా ఉండేది కాదు. బాషా, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, శివాజి, రోబో లాంటి సినిమాలు మామూలు వసూళ్లు రాబట్టలేదు. ‘కబాలి’ టైంకి రజినీకి తెలుగులో క్రేజ్ పీక్స్కు చేరి.. ఆ చిత్రానికి తొలి రోజు రూ.12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ‘2.0’కు ఇంతకంటే ఎక్కువ ఓపెనింగ్సే వచ్చాయి కానీ.. అది వేరే లీగ్ సినిమా. ఐతే అప్పుడు ఆ స్థాయిలో ఉన్న రజినీ మార్కెట్.. ఇప్పుడు ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఆయన కొత్త చిత్రం ‘పెద్దన్న’కు వచ్చిన ఓపెనింగ్సే నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం కేవలం 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
నైజాంలో అయితే మరీ కనీసంగా రూ.42 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. రజినీ చివరి సినిమా ‘దర్బార్’కు తెలంగాణ వరకే రూ.2.3 కోట్ల వసూళ్లు రావడం గమనార్హం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా అందులో మూడో వంతు వసూళ్లే వచ్చాయి. ‘కబాలి’ దగ్గర్నుంచి తన స్థాయికి తగని సినిమాలు చేసి ఇంతకుముందున్న భారీ మార్కెట్ను రజినీ చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. ‘పెద్దన్న’ విషయంలో మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎగ్జైట్మెంట్ లేదని.. రజినీ పట్ల వారికి ముందున్న ఆసక్తి మొత్తం పోయిందని.. ఆయన క్రేజ్, మార్కెట్ దారుణంగా దెబ్బ తినేశాయని స్పష్టమవుతోంది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు మరీ నామమాత్రంగానే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ అవ్వగానే సినిమా కథ ముగిసినట్లే అనుకోవచ్చు. ‘పెద్దన్న’ చూశాక అసలు రజినీ సినిమాలు మానేస్తే బెటర్ అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.
This post was last modified on November 7, 2021 3:12 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…