Movie News

రజినీ మార్కెట్ ఎంతలా పడిందంటే..

ఒకప్పుడు తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజవుతుంటే దానికి పోటీగా మన సినిమాలను రిలీజ్ చేయడానికి జంకేవారు. మన స్టార్ హీరోలతో సమానంగా రజినీకి క్రేజ్, మార్కెట్ ఉండేవి. ఆయన సినిమాలకు మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగేది. టాక్ బాలేకున్నా ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండేది కాదు. బాషా, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, శివాజి, రోబో లాంటి సినిమాలు మామూలు వసూళ్లు రాబట్టలేదు. ‘కబాలి’ టైంకి రజినీకి తెలుగులో క్రేజ్ పీక్స్‌కు చేరి.. ఆ చిత్రానికి తొలి రోజు రూ.12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ‘2.0’కు ఇంతకంటే ఎక్కువ ఓపెనింగ్సే వచ్చాయి కానీ.. అది వేరే లీగ్ సినిమా. ఐతే అప్పుడు ఆ స్థాయిలో ఉన్న రజినీ మార్కెట్.. ఇప్పుడు ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఆయన కొత్త చిత్రం ‘పెద్దన్న’కు వచ్చిన ఓపెనింగ్సే నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం కేవలం 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.

నైజాంలో అయితే మరీ కనీసంగా రూ.42 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. రజినీ చివరి సినిమా ‘దర్బార్’కు తెలంగాణ వరకే రూ.2.3 కోట్ల వసూళ్లు రావడం గమనార్హం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా అందులో మూడో వంతు వసూళ్లే వచ్చాయి. ‘కబాలి’ దగ్గర్నుంచి తన స్థాయికి తగని సినిమాలు చేసి ఇంతకుముందున్న భారీ మార్కెట్‌ను రజినీ చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. ‘పెద్దన్న’ విషయంలో మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎగ్జైట్మెంట్ లేదని.. రజినీ పట్ల వారికి ముందున్న ఆసక్తి మొత్తం పోయిందని.. ఆయన క్రేజ్, మార్కెట్ దారుణంగా దెబ్బ తినేశాయని స్పష్టమవుతోంది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు మరీ నామమాత్రంగానే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ అవ్వగానే సినిమా కథ ముగిసినట్లే అనుకోవచ్చు. ‘పెద్దన్న’ చూశాక అసలు రజినీ సినిమాలు మానేస్తే బెటర్ అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.

This post was last modified on November 7, 2021 3:12 am

Share
Show comments
Published by
suman

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

1 hour ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

3 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

3 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

4 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

12 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

13 hours ago