పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి శరవేగంగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఐతే పునరాగమనం తర్వాత ఆయన లైన్లో పెట్టిన సినిమాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఏదంటే మాత్రం ‘భీమ్లా నాయక్’ అనే చెప్పాలి. మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్ అయిన ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లినపుడు పెద్దగా ఆసక్తి కలిగించలేదు. రీమేక్ అనగానే బేసిగ్గా ఇప్పటి జనాలకు అంత ఇంట్రెస్ట్ కలగట్లేదు. అన్ని భాషల చిత్రాలనూ ఓటీటీలో అందరూ ముందే చూసేస్తుండటమే అందుక్కారణం. ఐతే ‘భీమ్లా నాయక్’ మొదలైనప్పటితో పోలిస్తే.. తర్వాత ఒక్కో ప్రోమో రిలీజయ్యాక దాని పట్ల ప్రేక్షకుల దృష్టికోణమే మారిపోయింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మాస్ స్టయిల్లో, మరింత ఎంటర్టైనింగ్గా ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ను సినిమా కోసం బాగానే వాడుకున్నట్లు తోస్తోంది.
ఇప్పటిదాకా ప్రతి ప్రోమోలోనూ పవన్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. దీపావళి ముంగిట రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ స్పెషల్ ప్రోమో సైతం పేలిపోయే రేంజిలోనే ఉంది.
ఐతే దీంతో పాటుగా రిలీజ్ చేస్తున్న పోస్టర్ల విషయంలో మాత్రం కాస్త అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ బహిరంగ ప్రదేశంలో మందు బాటిల్ పెట్టుకుని విందుకు రెడీ అయినట్లుగా ఒక పోస్టర్.. అలాగే మందు బాటిల్ పట్టుకుని నడుచుకొస్తున్నట్లుగా ఒక పోస్టర్ వదిలారు. పవన్ మామూలు హీరోనే అయితే ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడంలో అభ్యంతరమేమీ లేదు. కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడు. అందులోనూ కొత్త తరహా రాజకీయాలు చేస్తానని ఆదర్శాలు మాట్లాడే నాయకుడు. అలాంటి నాయకుడు సినిమా కోసమైనా సరే.. ఇలాంటి అవతారంలో కనిపిస్తే చూసే జనాలకు ఇబ్బందే. ఇది సమాజానికి సరైన సంకేతాలను ఇవ్వదు. తెరమీద మందు కొట్టే సీనే చేయకూడదు.. పూర్తిగా ఉత్తముడి పాత్రలే చేయాలి అని చెప్పలేం కానీ.. ఇలాంటి పోస్టర్ల ద్వారా చెడు సంకేతాలు వెళ్తాయని.. మామూలు హీరోలే ఇలాంటివి చేయకుంటే మంచిదని.. అందులోనూ బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పవన్ అసలే ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on November 5, 2021 8:14 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…