టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను పూర్తి చేయడానికి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. దర్శకుడు క్రిష్ తన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను పునః ప్రారంభించాడు. ఈరోజు నుంచే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ ను సగానికి పైగా పూర్తి చేశారు. సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా షూటింగ్ ను కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను షురూ చేశారు. దీపావళి పండగ తరువాత నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారట. పవన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వారియర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. అది ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. ఇక పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకు తెరపై చూడని విధంగా దర్శకుడు క్రిష్ ఆయన్ను ప్రెజంట్ చేయబోతున్నారు.
This post was last modified on November 3, 2021 6:45 am
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…
ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన…
ప్రేమతో మీ కార్తీక్ అని వచ్చినా ఎవరు పట్టించుకోకపోవడంతో RX 100 సినిమాతో యువతని ఉర్రూతలూగించేలా చేశాడు యువ హీరో…