సినిమా అనగానే ఎంతసేపూ ‘కమర్షియాలిటీ’ గురించే ఆలోచిస్తారు ఫిలిం మేకర్స్. సినిమా అనేది ఒక వ్యాపారం కాబట్టి అలా ఆలోచించడంలో తప్పు కూడా లేదు. ఐతే అందరూ అలాగే ఆలోచించి కమర్షియల్ హంగులతోనే సినిమాలు తీసుకుంటూ పోతే.. ఇక సమాజాన్ని కదిలించే.. ఆలోచన రేకెత్తించే.. సమస్యల్ని ఎత్తి చూపే సినిమాలు చేసేదెవరు? అందుకే కొందరు సామాజిక బాధ్యతతో సినిమాలు తీసే ప్రయత్నం చేస్తుంటారు.
ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ ఇలాంటి మంచి ప్రయత్నాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంటుంది. ఈ విషయంలో తమిళ స్టార్ హీరో సూర్య మిగతా వాళ్లకు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల కోసం తపించే అతను.. సామాజిక బాధ్యతతోనూ కొన్ని సినిమాలు చేస్తుంటాడు. ముఖ్యంగా 2డీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను పెట్టాక అందులో నిర్మిస్తున్న ప్రతి చిత్రం సొసైటీకి ఏదో ఒక మంచి సందేశం ఇచ్చేది.. ఏదైనా బర్నింగ్ ఇష్యూను చర్చించేదిగానే ఉంటోంది.
తాజాగా సూర్య తనే లీడ్ రోల్ చేస్తూ ‘జై భీమ్’ అనే సినిమా చేశాడు. జ్ఞానవేల్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక అరుదైన సినిమా అనడంలో సందేహం లేదు. ఇంతకుముందు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘విసారణై’ సినిమాను కొంతమేర గుర్తు చేసినా దీని ప్రత్యేకత దీనిదే. ఒక గిరిజన తెగకు చెందిన యువకుడిని పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి నేరం ఒప్పించేందుకు చిత్ర హింసలు పెట్టి అతడి ప్రాణాలను హరిస్తే.. నిస్సహాయురాలైన అతడి భార్యకు అండగా నిలిచి ఈ కేసులో ఆమెకు న్యాయం జరిగేలా చేసిన ఓ లాయర్ కథ ఇది. 90వ దశకంలో తమిళనాట జరిగిన నిజమైన కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ కథాంశాన్ని బట్టి ఇంత సీరియస్, ఇష్యూ బేస్డ్ మూవీ సగటు ప్రేక్షకులకు ఏం రుచిస్తుందిలే అనుకోవడానికి లేదు. కథాంశం ఎంత హార్డ్ హిట్టింగ్గా ఉంటుందో.. కోర్ట్ రూం డ్రామా అంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా, హృద్యంగా సాగుతుంది. ఆద్యంతం ఎంగేజ్ చేయడమే కాక ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి సినిమాకు నిర్మాతగా అండగా నిలవడమే కాక.. అద్భుతమైన పెర్ఫామెన్స్తో సినిమాకు ప్రాణం పోసిన సూర్యను ఎంత పొగిడినా తక్కువే. సూర్య మీద ఇప్పటిదాకా ఉన్న అభిమానం, గౌరవాన్ని ఇంకొన్ని రెట్లు పెంచే సినిమా ఇదనడంలో సందేహం లేదు.
This post was last modified on November 2, 2021 4:14 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…