Movie News

న‌లుగురికి చూపునిచ్చిన పునీత్‌

కొంత‌మంది మ‌ర‌ణించిన త‌ర్వాతే వాళ్లెంత మంచి వార‌నే విష‌యం ప్రపంచానికి తెలుస్తుంటుంది. క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. అత‌ను ఒక్క‌డే 26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు న‌డుపుతున్నాడ‌ని.. 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి బాధ్య‌త‌లు చూస్తున్నాడ‌ని.. మైసూర్లో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థ‌ను న‌డుపుతున్నాడ‌ని తెలిసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారిప్పుడు.

ఈ మెసేజ్ అత‌ను మ‌ర‌ణించిన రోజు నుంచి సోష‌ల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. అదే స‌మ‌యంలో త‌న మ‌ర‌ణానంత‌రం క‌ళ్లు దాన‌మివ్వాల‌ని ముందే డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌డంతో.. చ‌నిపోయిన కొన్ని గంట‌ల్లోనే పునీత్ క‌ళ్ల‌ను తీసి ఒక పెట్టెలో తీసుకెళ్తున్న దృశ్యం కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది.

పునీల్ క‌ళ్లు ఏకంగా న‌లుగురికి చూపునివ్వ‌డం విశేషం. అత‌డి క‌ళ్ల‌ను ఈ విష‌యాన్ని బెంగ‌ళూరులోని నారాయ‌ణ నేత్రాల‌య ఆసుప‌త్రి వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. సాధారణంగా చ‌నిపోయిన వ్య‌క్తుల నుంచి సేక‌రించిన‌ కళ్ళను ఇతరులకి ట్రాన్స్‌‌ప్లాంట్ చేస్తారు. ఒక వ్యక్తి కళ్ళతో ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుంది. కానీ పునీత్ కళ్ళలోని కార్నియాలను వేరు చేసి అంధులైన నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అవి విజ‌య‌వంత‌మై ఆ న‌లుగురికీ చూపు వ‌చ్చింది.

అధునాతన సాంకేతికతతో ఈ మార్పిడి చేశామని నారాయణ నేత్రాలయ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భుజంగ్ శెట్టి వెల్ల‌డించారు. పునీత్ క‌ళ్ల‌తో చూపు దక్కించుకున్నవారిలో ఒక మహిళ మరియు ముగ్గురు పురుషులు ఉన్నారు. వీళ్లంద‌రూ కర్ణాటకకి చెందినవారే. పునీత్ తండ్రి రాజ్‌కుమార్, త‌ల్లి పార్వ‌త‌మ్మ కూడా మ‌ర‌ణానంత‌రం వారి క‌ళ్ల‌ను దానం చేశారు. వారిని పునీత్ అనుస‌రించి న‌లుగురు అంధుల జీవితాల్లో వెలుగులు నింపాడు.

This post was last modified on November 2, 2021 7:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

2 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

4 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

5 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

5 hours ago

8 వారాల ఓటీటీ నిబంధన.. అసలు భయం ఇదేనా?

సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…

12 hours ago

‘పెద్ది’కి ఉన్న ఏకైక అడ్వాంటేజ్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…

14 hours ago