కొంతమంది మరణించిన తర్వాతే వాళ్లెంత మంచి వారనే విషయం ప్రపంచానికి తెలుస్తుంటుంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అతను ఒక్కడే 26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు నడుపుతున్నాడని.. 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి బాధ్యతలు చూస్తున్నాడని.. మైసూర్లో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థను నడుపుతున్నాడని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు.
ఈ మెసేజ్ అతను మరణించిన రోజు నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. అదే సమయంలో తన మరణానంతరం కళ్లు దానమివ్వాలని ముందే డిక్లరేషన్ ఇవ్వడంతో.. చనిపోయిన కొన్ని గంటల్లోనే పునీత్ కళ్లను తీసి ఒక పెట్టెలో తీసుకెళ్తున్న దృశ్యం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
పునీల్ కళ్లు ఏకంగా నలుగురికి చూపునివ్వడం విశేషం. అతడి కళ్లను ఈ విషయాన్ని బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఆసుపత్రి వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించడం గమనార్హం. సాధారణంగా చనిపోయిన వ్యక్తుల నుంచి సేకరించిన కళ్ళను ఇతరులకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఒక వ్యక్తి కళ్ళతో ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుంది. కానీ పునీత్ కళ్ళలోని కార్నియాలను వేరు చేసి అంధులైన నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అవి విజయవంతమై ఆ నలుగురికీ చూపు వచ్చింది.
అధునాతన సాంకేతికతతో ఈ మార్పిడి చేశామని నారాయణ నేత్రాలయ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భుజంగ్ శెట్టి వెల్లడించారు. పునీత్ కళ్లతో చూపు దక్కించుకున్నవారిలో ఒక మహిళ మరియు ముగ్గురు పురుషులు ఉన్నారు. వీళ్లందరూ కర్ణాటకకి చెందినవారే. పునీత్ తండ్రి రాజ్కుమార్, తల్లి పార్వతమ్మ కూడా మరణానంతరం వారి కళ్లను దానం చేశారు. వారిని పునీత్ అనుసరించి నలుగురు అంధుల జీవితాల్లో వెలుగులు నింపాడు.
This post was last modified on November 2, 2021 7:15 am
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…