15 ఏళ్ల కిందట చిన్న స్థాయి కథానాయికగా కెరీర్ను ఆరంభించి.. చాలా త్వరగానే స్టార్ హీరోయిన్గా ఎదిగిన భామ ప్రియమణి. తెలుగు పెళ్లైన కొత్తలో లాంటి మీడియం రేంజ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసిందామె. ఒక ఐదారేళ్ల పాటు ఆమె హవా సాగింది. కానీ ఉన్నట్లుండి ఆమె కనుమరుగైపోయింది. ఒక దశలో పూర్తిగా సినిమాలకు దూరమైంది.
కానీ ఇప్పుడు ప్రియమణి స్పెషల్ క్యారెక్టర్లతో తన సెకండ్ ఇన్నింగ్స్ను భలేగా ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో సత్తా చాటిన ప్రియమణి.. ఇప్పుడు తెలుగులో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తోంది. అందులో ఒకటి ‘నారప్ప’ అన్న సంగతి తెలిసిందే. ఇంకోటి ‘విరాటపర్వం’ అని తాజాగా వెల్లడైంది.
గురువారం ప్రియమణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘విరాటపర్వం’ నుంచి ప్రియమణి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో భారతక్క అనే నక్సలైట్ పాత్ర చేస్తోందామె. ఈ చిత్రంలో ప్రియమణి నటిస్తున్న సంగతే ఎవరికీ తెలియదు. ఈ రోజే ఈ విషయాన్ని రివీల్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా చాలా ఇంటెన్స్గా ఉండబోతోందని మొదట్నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి. రానా, సాయిపల్లవి లాంటి మంచి పెర్ఫామర్లకు దీటుగా ప్రియమణి పాత్ర కూడా ఉంటుందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రియమణి నటిస్తున్న ‘నారప్ప’ నుంచి కూడా ఆమె ఫస్ట్ లుక్ను ఈ రోజే లాంచ్ చేశారు.
అది కూడా ప్రియమణి ప్రత్యేకతను చాటేలాగే ఉంది. దీని మాతృక ‘అసురన్’లో మంజు వారియర్ చేసిన పాత్రను ప్రియమణి చేస్తోంది. ఆ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లకు కెరీర్లో గ్యాప్ వచ్చి, కొంచెం వయసు పెరిగాక రీఎంట్రీ ఇస్తే చాలా వరకు మొక్కుబడి పాత్రలే చేస్తుంటారు కానీ.. ప్రియమణి మాత్రం రీఎంట్రీకి బలమైన పాత్రలే ఎంచుకుందన్నది స్పష్టం. ఇలా అందరికీ జరగదు. మొత్తానికి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రియమణి గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఉన్నాయి ఈ రోజు రిలీజ్ చేసిన ఆమె లుక్స్.
This post was last modified on June 4, 2020 2:47 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…