15 ఏళ్ల కిందట చిన్న స్థాయి కథానాయికగా కెరీర్ను ఆరంభించి.. చాలా త్వరగానే స్టార్ హీరోయిన్గా ఎదిగిన భామ ప్రియమణి. తెలుగు పెళ్లైన కొత్తలో లాంటి మీడియం రేంజ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసిందామె. ఒక ఐదారేళ్ల పాటు ఆమె హవా సాగింది. కానీ ఉన్నట్లుండి ఆమె కనుమరుగైపోయింది. ఒక దశలో పూర్తిగా సినిమాలకు దూరమైంది.
కానీ ఇప్పుడు ప్రియమణి స్పెషల్ క్యారెక్టర్లతో తన సెకండ్ ఇన్నింగ్స్ను భలేగా ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో సత్తా చాటిన ప్రియమణి.. ఇప్పుడు తెలుగులో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తోంది. అందులో ఒకటి ‘నారప్ప’ అన్న సంగతి తెలిసిందే. ఇంకోటి ‘విరాటపర్వం’ అని తాజాగా వెల్లడైంది.
గురువారం ప్రియమణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘విరాటపర్వం’ నుంచి ప్రియమణి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో భారతక్క అనే నక్సలైట్ పాత్ర చేస్తోందామె. ఈ చిత్రంలో ప్రియమణి నటిస్తున్న సంగతే ఎవరికీ తెలియదు. ఈ రోజే ఈ విషయాన్ని రివీల్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా చాలా ఇంటెన్స్గా ఉండబోతోందని మొదట్నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి. రానా, సాయిపల్లవి లాంటి మంచి పెర్ఫామర్లకు దీటుగా ప్రియమణి పాత్ర కూడా ఉంటుందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రియమణి నటిస్తున్న ‘నారప్ప’ నుంచి కూడా ఆమె ఫస్ట్ లుక్ను ఈ రోజే లాంచ్ చేశారు.
అది కూడా ప్రియమణి ప్రత్యేకతను చాటేలాగే ఉంది. దీని మాతృక ‘అసురన్’లో మంజు వారియర్ చేసిన పాత్రను ప్రియమణి చేస్తోంది. ఆ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లకు కెరీర్లో గ్యాప్ వచ్చి, కొంచెం వయసు పెరిగాక రీఎంట్రీ ఇస్తే చాలా వరకు మొక్కుబడి పాత్రలే చేస్తుంటారు కానీ.. ప్రియమణి మాత్రం రీఎంట్రీకి బలమైన పాత్రలే ఎంచుకుందన్నది స్పష్టం. ఇలా అందరికీ జరగదు. మొత్తానికి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రియమణి గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఉన్నాయి ఈ రోజు రిలీజ్ చేసిన ఆమె లుక్స్.
This post was last modified on June 4, 2020 2:47 pm
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…