నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘దసరా’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు నాని.
ఈ సినిమాలో తొలిసారి నానిని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
గతంలో నాని-కీర్తి సురేష్ కలిసి ‘నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. అందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతోంది. తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మరో స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో కీలకపాత్ర ఉందట. దానికోసం సమంతను తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆమెని సంప్రదించి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. నాని-కీర్తి సురేష్ లతో పాటు సమంత పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఆమె గనుక ఒప్పుకుంటే సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
గతంలో నానితో కలిసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ వంటి సినిమాల్లో నటించింది సమంత. అలానే కీర్తి సురేష్ తో కలిసి ‘మహానటి’లో కనిపించింది. ఇప్పుడు వీరు ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on October 31, 2021 11:39 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…