నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘దసరా’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు నాని.
ఈ సినిమాలో తొలిసారి నానిని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
గతంలో నాని-కీర్తి సురేష్ కలిసి ‘నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. అందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతోంది. తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మరో స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో కీలకపాత్ర ఉందట. దానికోసం సమంతను తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆమెని సంప్రదించి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. నాని-కీర్తి సురేష్ లతో పాటు సమంత పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఆమె గనుక ఒప్పుకుంటే సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
గతంలో నానితో కలిసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ వంటి సినిమాల్లో నటించింది సమంత. అలానే కీర్తి సురేష్ తో కలిసి ‘మహానటి’లో కనిపించింది. ఇప్పుడు వీరు ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. మరేం జరుగుతుందో చూడాలి!
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…