నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘దసరా’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు నాని.
ఈ సినిమాలో తొలిసారి నానిని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
గతంలో నాని-కీర్తి సురేష్ కలిసి ‘నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. అందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతోంది. తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మరో స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో కీలకపాత్ర ఉందట. దానికోసం సమంతను తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆమెని సంప్రదించి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. నాని-కీర్తి సురేష్ లతో పాటు సమంత పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఆమె గనుక ఒప్పుకుంటే సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
గతంలో నానితో కలిసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ వంటి సినిమాల్లో నటించింది సమంత. అలానే కీర్తి సురేష్ తో కలిసి ‘మహానటి’లో కనిపించింది. ఇప్పుడు వీరు ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on October 31, 2021 11:39 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…