నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘దసరా’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు నాని.
ఈ సినిమాలో తొలిసారి నానిని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
గతంలో నాని-కీర్తి సురేష్ కలిసి ‘నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. అందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతోంది. తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మరో స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో కీలకపాత్ర ఉందట. దానికోసం సమంతను తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆమెని సంప్రదించి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. నాని-కీర్తి సురేష్ లతో పాటు సమంత పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఆమె గనుక ఒప్పుకుంటే సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
గతంలో నానితో కలిసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ వంటి సినిమాల్లో నటించింది సమంత. అలానే కీర్తి సురేష్ తో కలిసి ‘మహానటి’లో కనిపించింది. ఇప్పుడు వీరు ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on October 31, 2021 11:39 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…