టాలీవుడ్లో దర్శకేంద్రరావు వైభవం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకుని.. ఆ తర్వాత రెండు తరాల హీరోలు ఆయనతో సినిమా చేయడానికి తపించిన వాళ్లే. ఆయనతో ఒక్క సినిమా చేసి ఇమేజ్ను మార్చుకున్న వాళ్లు ఎంతోమంది. వెంకటేష్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లు ఆయన చేతుల మీదుగా పరిచయమై బడా స్టార్లు అయిన వాళ్లే. అలాంటి దర్శకుడు తన కొడుకు ప్రకాష్ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. నీతో అనే సినిమాతో అతణ్ని లాంచ్ చేసి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు రాఘవేంద్రరావు. ఆ తర్వాత మార్నింగ్ రాగా అనే సినిమా చేసి.. దర్శకత్వం వైపు వెళ్లిపోయాడు ప్రకాష్. మరో లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు సైతం తన కొడుకు అరుణ్ కుమార్కు హీరోగా కెరీర్ ఇవ్వలేకపోయాడు. సొంతంగా సినిమాలు తీశాడు. వేరేవాళ్ల చేతికి అప్పగించాడు. అయినా ఫలితం లేకపోయింది.
ఇక వర్తమానంలోకి వస్తే ఎంతోమంది హీరోలకు భారీ విజయాలందించిన పూరి జగన్నాథ్ సైతం తన కొడుకు ఆకాశ్ను హీరోగా నిలబెట్టే విషయంలో తడబడుతున్నాడు. టీనేజీలో అతను ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రాపోరి వచ్చింది వెళ్లింది కూడా తెలియదు. ఇక పూరీనే స్వయంగా మెహబూబా మూవీతో కొడుకును రీలాంచ్ చేశాడు. ఆ చిత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది.
ఇప్పుడు రొమాంటిక్తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఆకాశ్. కానీ ఈ సినిమాలో కూడా మెరుపులేమీ లేవు. హీరో హీరోయిన్ల రొమాన్స్ తప్ప సినిమాకు ఏ ఆకర్షణా లేదు. నిజానికి ఈ సినిమా పట్ల యూత్లో ఆసక్తి రేగడానికి హీరోయిన్ కేతిక శర్మ బోల్డ్ లుక్స్, ప్రోమోలే కారణం. అందువల్లే ఈ చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.
ఈ చిత్రం వల్ల ఆకాశ్కైతే పెద్దగా ఉపయోగం లేదు. పూరి అరగతీసిన యాక్షన్, లవ్ అంశాలనే ఇందులోనూ దట్టించాడు. అవి ప్రేక్షకులకు రుచించడం లేదు. ఆకాశ్ టాలెంటెడ్ అనిపించినా.. వీక్ స్క్రిప్ట్ వల్ల అతను పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. పూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. స్క్రిప్టు ఆయనదే కావడంతో తన సినిమాలాగే అనిపించింది. తన టైం అయిపోయిందని పూరి గుర్తించి కొడుకు శ్రేయస్సు దృష్ట్యా ఇప్పటి ట్రెండుకు తగ్గ దర్శకులకు ఆకాశ్ను అప్పగించి సైడైపోవడం బెటర్ అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయిప్పుడు. కొడుకును హీరోగా నిలబెట్టాలన్న ఆశ ఉండొచ్చు కానీ.. ఆయన జోక్యమే అతడికి శాపం అవుతున్నపుడు సైలెంటుగా ఉండటమే బెటర్ కదా.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…