కన్నడ హీరోల్లో ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ ఉన్న హీరోల్లో ఒకడిగా పేరుంది పునీత్ రాజ్కుమార్కు. కెరీర్ ఆరంభం నుంచి అతను ఎప్పుడూ ఫిట్గానే కనిపించాడు. ఎలాంటి సమయంలోనూ పునీత్ ఫిట్నెస్ను నిర్లక్ష్యం చేసినట్లు కనిపించేవాడు కాదు. లాక్ డౌన్ టైంలో కూడా యూట్యూబ్ ఛానెల్లో ఎన్నో ఫిట్నెస్ వీడియోలు షేర్ చేశాడు పునీత్. అలాంటివాడు ఇప్పుడు జిమ్లో వర్కవుట్లు చేస్తూనే గుండెపోటుకు గురై చనిపోవడం అభిమానులను షాక్కు గురి చేస్తోంది.
తన శక్తికి మించి బరువులు ఎత్తడం వల్ల ప్రతికూల ప్రభావం పడి పునీత్ గుండెపోటుకు గురైనట్లుగా చెబుతున్నారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటారో చూడాలి. ఈ సంగతలా ఉంచితే.. పునీత్ ఫ్యామిలీ హిస్టరీ అతడికి చేటు చేసినట్లు స్పష్టమవుతోంది. పునీత్ కుటుంబంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటికే ముగ్గురు గుండెపోటుకు గురి కావడం గమనార్హం.
పునీత్ తండ్రి, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ 2006లో, 78 ఏళ్ల వయసులో చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడాయన గుండెపోటుతోనే మరణించారు. ఆ వయసులో గుండెపోటు రావడం గురించి మరీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ పునీత్ అన్నలిద్దరూ తక్కువ వయసులోనే గుండెపోటుకు గురి కావడం గమనార్హం.
పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్కుమార్కు 2013లోనే గుండెపోటు వచ్చింది. అతడికి కూడా ఫిట్నెస్ ఫ్రీక్గా పేరుంది. కాకపోతే రాఘవేంద్రకు ప్రాణాపాయం తలెత్తలేదు. ఇంకో రెండేళ్లకే, అంటే 2015లో పునీత్ పెద్దన్నయ్య, ప్రముఖ కథానాయకుడు శివరాజ్కుమార్కు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇలా తండ్రి, ఇద్దరు అన్నలు గుండెపోటుకు గురైన నేపథ్యంలో తనకూ ముప్పు పొంచి ఉందని పునీత్ జాగ్రత్త పడాల్సింది. అతడి జాగ్రత్తగానే ఉండి ఉండొచ్చు కూడా. అయినా సరే ఈ రోజు హఠాత్పరిణామం చోటు చేసుకుంది. కోట్లమంది ఆరాధించే నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
This post was last modified on October 29, 2021 9:09 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…