సరైన సినిమా పడితే.. ఒక హీరో అయినా.. హీరోయిన్ అయినా రాత్రికి రాత్రి ‘స్టార్’ స్టేటస్ సంపాదించేస్తుంటారు. వాళ్ల కెరీర్లు అనూహ్యమైన మలుపు తిరుగుతుంటాయి. కెరీర్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో మొదలైనప్పటికీ.. ఆ సినిమాలతో వచ్చిన పేరుతో టాప్ స్టార్ల సరసన అవకాశాలు అందుకున్న హీరోయిన్లు చాలామందే కనిపిస్తారు.
ఇలియానా, సమంతా, తమన్నా.. ఇలా ఈ కోవలో చాలామందే కనిపిస్తారు. ఇప్పుడు ‘పెళ్ళిసంద-డి’ భామ శ్రీలీల దశ కూడా ఇలాగే తిరిగినట్లుగా కనిపిస్తోంది. ‘పెళ్ళిసంద-డి’ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినా సరే… ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అయ్యిందంటే, మంచి వసూళ్లు వచ్చాయంటే అందులో శ్రీలీల పాత్ర కీలకం. చూడగానే వారెవా అనిపించే అందం, చక్కటి హావభావాలు పలికించే కళ్లు, ముఖచిత్రం ఉన్న ఈ అమ్మాయి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
ఇలాంటి అమ్మాయిలను తమ సినిమాల్లో పెట్టుకునే విషయంలో ఫిలిం మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయరు. ‘పెళ్ళిసంద-డి’ చేస్తుండగానే ఆమె గురించి విని రవితేజ కొత్త సినిమాకు కథానాయికగా బుక్ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీలీల పేరు మార్మోగుతుండటంతో ఓ పెద్ద సినిమాకు ఆమెను కథానాయికగా పరిగణిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అది జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ కావడం వివేషం.
ఈ చిత్ర కథానాయికల విషయం ఎంతకీ తెగట్లేదు. కియారా అద్వానీ, జాన్వి కపూర్.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుందని కూడా అంటుండగా.. ఒక్క హీరోయిన్ కూడా ఇంకా ఫైనలైజ్ అయినట్లుగా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్టు పూర్తి కాని ఈ చిత్రానికి ఓ హీరోయిన్గా శ్రీలీలను పరిశీలిస్తున్నారని.. ఆమె ఓకే కావడం దాదాపు ఖాయం అని అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం శ్రీలీల టాప్ హీరోయిన్లలో ఒకరైపోవడం లాంఛనమే.
This post was last modified on October 28, 2021 10:04 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…