సరైన సినిమా పడితే.. ఒక హీరో అయినా.. హీరోయిన్ అయినా రాత్రికి రాత్రి ‘స్టార్’ స్టేటస్ సంపాదించేస్తుంటారు. వాళ్ల కెరీర్లు అనూహ్యమైన మలుపు తిరుగుతుంటాయి. కెరీర్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో మొదలైనప్పటికీ.. ఆ సినిమాలతో వచ్చిన పేరుతో టాప్ స్టార్ల సరసన అవకాశాలు అందుకున్న హీరోయిన్లు చాలామందే కనిపిస్తారు.
ఇలియానా, సమంతా, తమన్నా.. ఇలా ఈ కోవలో చాలామందే కనిపిస్తారు. ఇప్పుడు ‘పెళ్ళిసంద-డి’ భామ శ్రీలీల దశ కూడా ఇలాగే తిరిగినట్లుగా కనిపిస్తోంది. ‘పెళ్ళిసంద-డి’ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినా సరే… ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అయ్యిందంటే, మంచి వసూళ్లు వచ్చాయంటే అందులో శ్రీలీల పాత్ర కీలకం. చూడగానే వారెవా అనిపించే అందం, చక్కటి హావభావాలు పలికించే కళ్లు, ముఖచిత్రం ఉన్న ఈ అమ్మాయి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
ఇలాంటి అమ్మాయిలను తమ సినిమాల్లో పెట్టుకునే విషయంలో ఫిలిం మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయరు. ‘పెళ్ళిసంద-డి’ చేస్తుండగానే ఆమె గురించి విని రవితేజ కొత్త సినిమాకు కథానాయికగా బుక్ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీలీల పేరు మార్మోగుతుండటంతో ఓ పెద్ద సినిమాకు ఆమెను కథానాయికగా పరిగణిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అది జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ కావడం వివేషం.
ఈ చిత్ర కథానాయికల విషయం ఎంతకీ తెగట్లేదు. కియారా అద్వానీ, జాన్వి కపూర్.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుందని కూడా అంటుండగా.. ఒక్క హీరోయిన్ కూడా ఇంకా ఫైనలైజ్ అయినట్లుగా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్టు పూర్తి కాని ఈ చిత్రానికి ఓ హీరోయిన్గా శ్రీలీలను పరిశీలిస్తున్నారని.. ఆమె ఓకే కావడం దాదాపు ఖాయం అని అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం శ్రీలీల టాప్ హీరోయిన్లలో ఒకరైపోవడం లాంఛనమే.
This post was last modified on October 28, 2021 10:04 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…