సరైన సినిమా పడితే.. ఒక హీరో అయినా.. హీరోయిన్ అయినా రాత్రికి రాత్రి ‘స్టార్’ స్టేటస్ సంపాదించేస్తుంటారు. వాళ్ల కెరీర్లు అనూహ్యమైన మలుపు తిరుగుతుంటాయి. కెరీర్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో మొదలైనప్పటికీ.. ఆ సినిమాలతో వచ్చిన పేరుతో టాప్ స్టార్ల సరసన అవకాశాలు అందుకున్న హీరోయిన్లు చాలామందే కనిపిస్తారు.
ఇలియానా, సమంతా, తమన్నా.. ఇలా ఈ కోవలో చాలామందే కనిపిస్తారు. ఇప్పుడు ‘పెళ్ళిసంద-డి’ భామ శ్రీలీల దశ కూడా ఇలాగే తిరిగినట్లుగా కనిపిస్తోంది. ‘పెళ్ళిసంద-డి’ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినా సరే… ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అయ్యిందంటే, మంచి వసూళ్లు వచ్చాయంటే అందులో శ్రీలీల పాత్ర కీలకం. చూడగానే వారెవా అనిపించే అందం, చక్కటి హావభావాలు పలికించే కళ్లు, ముఖచిత్రం ఉన్న ఈ అమ్మాయి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
ఇలాంటి అమ్మాయిలను తమ సినిమాల్లో పెట్టుకునే విషయంలో ఫిలిం మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయరు. ‘పెళ్ళిసంద-డి’ చేస్తుండగానే ఆమె గురించి విని రవితేజ కొత్త సినిమాకు కథానాయికగా బుక్ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీలీల పేరు మార్మోగుతుండటంతో ఓ పెద్ద సినిమాకు ఆమెను కథానాయికగా పరిగణిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అది జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ కావడం వివేషం.
ఈ చిత్ర కథానాయికల విషయం ఎంతకీ తెగట్లేదు. కియారా అద్వానీ, జాన్వి కపూర్.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుందని కూడా అంటుండగా.. ఒక్క హీరోయిన్ కూడా ఇంకా ఫైనలైజ్ అయినట్లుగా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్టు పూర్తి కాని ఈ చిత్రానికి ఓ హీరోయిన్గా శ్రీలీలను పరిశీలిస్తున్నారని.. ఆమె ఓకే కావడం దాదాపు ఖాయం అని అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం శ్రీలీల టాప్ హీరోయిన్లలో ఒకరైపోవడం లాంఛనమే.
This post was last modified on October 28, 2021 10:04 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…