Movie News

మెగా రీమేక్‌కి ముహూర్తం ఖరార్‌‌

ఇప్పటికే ‘లూసిఫర్’ రీమేక్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘వేదాళం’ రీమేక్‌ని కూడా త్వరలో మొదలుపెట్టబోతున్నారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘భోళాశంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ముహూర్తం ఖరారయ్యింది.

నవంబర్ 11న ఉదయం 7:45కి చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు అనౌన్స్ చేశారు. అదే నెల 15 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. నిజానికి వరుస రీమేక్స్ చేయడం బాగోదు కనుక మెగాస్టార్ మధ్యలో ఓ స్ట్రెయిట్ సినిమా చేయాలనుకుంటున్నారని, అందుకే ఈ మూవీని కొన్నాళ్ల పాటు ఆపి బాబి డైరెక్షన్‌లో సినిమాని మొదలు పెడతారని వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని ఈ ప్రకటనతో తేల్చేసింది టీమ్. వచ్చే యేడు థియేటర్స్‌లో మూవీని రిలీజ్‌ చేస్తామని కూడా కన్‌ఫర్మ్ చేసింది.

సిస్టర్‌‌ సెంటిమెంట్‌కి చాలా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో మెగాస్టార్‌‌కి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఆయనకి జోడీగా ఎవరు కనిపిస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. కథ ప్రకారం చిరు గ్యాంగ్‌స్టర్‌‌గా కనిపిస్తారు. ‘లూసిఫర్’ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌‌’లోనూ ఆయన చేస్తున్నది డాన్ పాత్రే. కాకపోతే రెండు క్యారెక్టర్స్‌కి చాలా వేరియేషన్‌ ఉంటుంది. ఏదేమైనా బ్యాక్‌ టు బ్యాక్ రీమేక్స్ చేయడం, రెండింటిలోనూ ఆయన గ్యాంగ్‌స్టర్‌‌ కావడం ఊహించని విశేషమే.

This post was last modified on October 27, 2021 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago