మైనే ప్యార్ కియా సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన కథానాయికగా భాగ్యశ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా రాణాలో నటించి మాయమైన భాగ్యశ్రీ.. మళ్లీ ఇటు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఆమె అతడికి తల్లి పాత్ర పోషిస్తుండటం విశేషం.
హిందీలో కూడా సినిమాలు చేయడం మానేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతడి కోసమే తానీ సినిమాను ఒప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది భాగ్యశ్రీ. ప్రభాస్ను కలిశాక అతను తనకు ఫ్యాన్ అని తెలిసిందని ఆమె చెప్పింది.
ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు తనను ప్రేమ పావురాలు హీరోయిన్గానే గుర్తుంచుకున్నారని చెప్పిన భాగ్యశ్రీ.. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ప్రభాస్ నటనకు పెద్ద అభిమాని కావడం వల్లే తాను ఈ సినిమా అంగీకరించానని అంది.
ప్రభాస్ ఎంత ఎదిగినా చాలా వినయంగా ఉంటాడని.. తాను తొలి రోజు షూటింగ్ స్పాట్కు వచ్చినపుడు ఎదురొచ్చి ఆహ్వానం పలికాడని.. తనకు పెద్ద ఫ్యాన్ అని చెప్పాడని భాగ్యశ్రీ అంది. తామిద్దరం భోజన ప్రియులమని.. షూటింగ్ సందర్భంగా ఎక్కువగా తిండి గురించే మాట్లాడుకునేవాళ్లమని ఆమె వెల్లడించింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 4, 2020 7:26 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…