మైనే ప్యార్ కియా సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన కథానాయికగా భాగ్యశ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా రాణాలో నటించి మాయమైన భాగ్యశ్రీ.. మళ్లీ ఇటు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఆమె అతడికి తల్లి పాత్ర పోషిస్తుండటం విశేషం.
హిందీలో కూడా సినిమాలు చేయడం మానేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతడి కోసమే తానీ సినిమాను ఒప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది భాగ్యశ్రీ. ప్రభాస్ను కలిశాక అతను తనకు ఫ్యాన్ అని తెలిసిందని ఆమె చెప్పింది.
ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు తనను ప్రేమ పావురాలు హీరోయిన్గానే గుర్తుంచుకున్నారని చెప్పిన భాగ్యశ్రీ.. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ప్రభాస్ నటనకు పెద్ద అభిమాని కావడం వల్లే తాను ఈ సినిమా అంగీకరించానని అంది.
ప్రభాస్ ఎంత ఎదిగినా చాలా వినయంగా ఉంటాడని.. తాను తొలి రోజు షూటింగ్ స్పాట్కు వచ్చినపుడు ఎదురొచ్చి ఆహ్వానం పలికాడని.. తనకు పెద్ద ఫ్యాన్ అని చెప్పాడని భాగ్యశ్రీ అంది. తామిద్దరం భోజన ప్రియులమని.. షూటింగ్ సందర్భంగా ఎక్కువగా తిండి గురించే మాట్లాడుకునేవాళ్లమని ఆమె వెల్లడించింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…