Movie News

యంగ్ హీరో.. నాలుగు పడవల ప్రయాణం

హీరోయిన్లు ఒకేసారి రెండు… మూడు.. నాలుగు.. ఇలా ఎక్కువ సినిమాల్లో నటించొచ్చు కానీ.. హీరోలకు ఆ వెసులుబాటు ఉండదు. చాలా వరకు సినిమాలు హీరోల చుట్టూనే తిరుగుతాయి కాబట్టి ఒక్కో చిత్రానికి బల్క్ డేట్లు ఇవ్వాలి. ఒక లుక్ మెయింటైన్ చేయాలి. ఇంకా చాలా రకాల విషయాలు ముడిపడి ఉంటాయి. అందుకే ఒక టైంలో ఒక సినిమాకే సమయం ఇస్తుంటారు. మహా అయితే ఇంకొక్క సినిమాను జోడిస్తారు. కానీ ఒక హీరో ఒకే టైంలో నాలుగు సినిమాల్లో నటించాలంటే మాత్రం కష్టమే.

యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు ఈ సాహసమే చేస్తున్నాడు. ఆల్రెడీ అతను ‘18 పేజెస్’, ‘కార్తికేయ-2’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలూ చివరి దశలో ఉన్నాయి. ఇంతలోనే గత కొన్ని వారాల్లో నిఖిల్ రెండు కొత్త చిత్రాలను అనౌన్స్ చేశాడు.

అందులో ఒకటి ఎడిటర్ గ్యారీ డైరెక్టర్‌గా మారి తీయబోతున్న స్పై థ్రిల్లర్ కాగా.. ఇంకోటి తాజాగా ప్రకటించిన సుధీర్ వర్మ చిత్రం. ఈ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఏక కాలంలో చేస్తుండటంతో ఇది తనకు చాలా కొత్త అనుభవం అంటూ నిఖిల్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పటిదాకా కెరీర్లో చాలా వరకు ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చానని.. కానీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏక కాలంలో నాలుగు సినిమాలు చేస్తున్నానని.. ఈ నాలుగు చిత్రాలూ తనకెంతో ఇష్టమైన స్క్రిప్టులతో తెరకెక్కుతున్నవని.. అందుకే అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నానని నిఖిల్ వెల్లడించాడు.

సుకుమార్ కథతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ చేస్తున్న ‘18 పేజెస్’ వీటిలో అన్నింటికంటే ముందు రిలీజయ్యే అవకాశముంది. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఇక ఒకప్పుడు నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా అతడి కెరీర్లోనే అత్యధి బడ్జెట్లో రూపొందుతోంది. వీటితో పాటు గ్యారీ, సుధీర్ వర్మ సినిమాలు కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘కార్తికేయ-2’తో పాటు ఇవి రెండూ కూడా థ్రిల్లర్లే కావడం విశేషం.

This post was last modified on October 26, 2021 1:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

2 hours ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

4 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

5 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

7 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

7 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

8 hours ago