సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం నరసాపేట రాజబాబు స్వస్థలం. నటనంటే ఎంతో ఇష్టం కావడంతో చిన్నప్పటిన ఉంచే నాటకాల్లో నటించారు రాజబాబు. ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించారు. ‘సింధూరం’ సినిమా తర్వాత నటుడిగా బాగా బిజీ అయ్యారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మళ్లీ రావా, భరత్ అను నేను, శ్రీకారం వంటి ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించారు.
టెలివిజన్ రంగంలోనూ రాజబాబుకి మంచి పేరుంది. చిలసౌ స్రవంతి, అభిషేకం, రాధ–మధు, వసంత కోకిల, మనసు మమత, బంగారు పంజరం వంటి సూపర్ హిట్ సీరియల్స్లో నటించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్లోని పాత్రకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉంటారని, నవ్విస్తూ ఉంటారని రాజబాబుకు పేరు. అందుకే ఆందరూ ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తుంటారు. ఆయన మృతి సినీ, టీవీ, రంగస్థల పరిశ్రమలకు తీరని లోటంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 25, 2021 10:37 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…