సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం నరసాపేట రాజబాబు స్వస్థలం. నటనంటే ఎంతో ఇష్టం కావడంతో చిన్నప్పటిన ఉంచే నాటకాల్లో నటించారు రాజబాబు. ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించారు. ‘సింధూరం’ సినిమా తర్వాత నటుడిగా బాగా బిజీ అయ్యారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మళ్లీ రావా, భరత్ అను నేను, శ్రీకారం వంటి ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించారు.
టెలివిజన్ రంగంలోనూ రాజబాబుకి మంచి పేరుంది. చిలసౌ స్రవంతి, అభిషేకం, రాధ–మధు, వసంత కోకిల, మనసు మమత, బంగారు పంజరం వంటి సూపర్ హిట్ సీరియల్స్లో నటించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్లోని పాత్రకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉంటారని, నవ్విస్తూ ఉంటారని రాజబాబుకు పేరు. అందుకే ఆందరూ ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తుంటారు. ఆయన మృతి సినీ, టీవీ, రంగస్థల పరిశ్రమలకు తీరని లోటంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 25, 2021 10:37 am
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…