ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టాక చాలా బిజీ అయిపోయారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. సౌత్ లో ఆయన చాలా బిజీ యాక్టర్. అంతేకాదు.. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఆయన ముందు జాబితాలో ఉంటారు. ఇప్పుడు జగ్గూభాయ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.
ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ రూపొందించనున్న ఓ సినిమాలో జగపతిబాబుని ఎన్నుకున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మొహంజొదారో’, ‘పానిపట్’ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు అడ్వెంచరస్ కథను సిద్ధం చేసుకున్నారు. ఇందులో ఫర్హాన్ అక్తర్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు.
కథ ప్రకారం.. సినిమాలో ఫర్హాన్ అక్తర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇక విలన్ పాత్రలో జగపతిబాబుని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్ గానే జగపతిబాబు కూడా ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేశారని టాక్. మొత్తానికి జగ్గూభాయ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫారెన్ లొకేషన్స్ లో చిత్రీకరిస్తారట.
This post was last modified on October 22, 2021 1:59 pm
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…