ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రసవత్తర సమరం చూశాం. టాలీవుడ్ టాప్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ తలపడ్డారు. ఇద్దరిలో బన్నీ సినిమా ‘అల వైకుంఠపురములో’దే పైచేయి అయినా.. మహేష్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా బాగానే ఆడింది.
వీళ్లిద్దరూ వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వార్కు రెడీ అయితే ఆశ్చర్యమేమీ లేదు. వీళ్లిద్దరి కొత్త చిత్రాలు వచ్చే వేసవిని టార్గెట్ చేశాయి. ముందు అనుకున్న ప్రకారం అయితే మహేష్, బన్నీల కొత్త సినిమాలు ఈ ఏడాదే విడుదల కావాలి. కానీ కరోనా వారి ప్రణాళికల్ని మార్చేసింది. మహేష్ కొత్తగా ఇప్పుడే పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేశాడు. మరోవైపు బన్నీ-సుకుమార్ల కలయికలో ‘పుష్ప’ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.
లేటుగా అనౌన్స్ చేసినప్పటికీ మహేష్-పరశురామ్ల సినిమా పక్కా ప్లాన్తో రంగంలోకి దిగబోతోంది. షూటింగ్స్ పున:ప్రారంభం కాగానే ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని పక్కాగా విడుదల చేసే అవకాశముంది.
బన్నీ-సుకుమార్ సినిమా టార్గెట్ కూడా ప్రస్తుతానికి వేసవే. ఈ ఏడాది లాగా ఒకే వారంలో ఈ ఇద్దరి సినిమాలు పోటీకి దిగకపోవచ్చు. వేసవి సీజన్ కాబట్టి కొంచెం గ్యాప్లో ఢీకొడతారు. ఐతే బన్నీ సినిమా కచ్చితంగా వేసవికి వస్తుందనడానికి కూడా లేదు. సుక్కు టేకింగ్ సంగతి అందరికీ తెలిసిందే.
పర్ఫెక్షన్ కోసం చెక్కుతూ వెళ్తాడు. ఈ క్రమంలో ఆలస్యం జరుగుతుంది. ఆయన చేతుల్లో ఏదీ ఉండదు. ఐతే షూటింగ్ మొదలై కొన్ని రోజులు గడిచాక ఈ విషయంలో స్పష్టత రావచ్చు. ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగిన నేపథ్యంలో సుకుమార్పై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి వచ్చే వేసవికి కొంచెం విరామంతో అయినా మహేష్, బన్నీ తలపడతారేమో చూడాలి.
This post was last modified on June 3, 2020 4:11 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…