ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రసవత్తర సమరం చూశాం. టాలీవుడ్ టాప్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ తలపడ్డారు. ఇద్దరిలో బన్నీ సినిమా ‘అల వైకుంఠపురములో’దే పైచేయి అయినా.. మహేష్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా బాగానే ఆడింది.
వీళ్లిద్దరూ వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వార్కు రెడీ అయితే ఆశ్చర్యమేమీ లేదు. వీళ్లిద్దరి కొత్త చిత్రాలు వచ్చే వేసవిని టార్గెట్ చేశాయి. ముందు అనుకున్న ప్రకారం అయితే మహేష్, బన్నీల కొత్త సినిమాలు ఈ ఏడాదే విడుదల కావాలి. కానీ కరోనా వారి ప్రణాళికల్ని మార్చేసింది. మహేష్ కొత్తగా ఇప్పుడే పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేశాడు. మరోవైపు బన్నీ-సుకుమార్ల కలయికలో ‘పుష్ప’ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.
లేటుగా అనౌన్స్ చేసినప్పటికీ మహేష్-పరశురామ్ల సినిమా పక్కా ప్లాన్తో రంగంలోకి దిగబోతోంది. షూటింగ్స్ పున:ప్రారంభం కాగానే ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని పక్కాగా విడుదల చేసే అవకాశముంది.
బన్నీ-సుకుమార్ సినిమా టార్గెట్ కూడా ప్రస్తుతానికి వేసవే. ఈ ఏడాది లాగా ఒకే వారంలో ఈ ఇద్దరి సినిమాలు పోటీకి దిగకపోవచ్చు. వేసవి సీజన్ కాబట్టి కొంచెం గ్యాప్లో ఢీకొడతారు. ఐతే బన్నీ సినిమా కచ్చితంగా వేసవికి వస్తుందనడానికి కూడా లేదు. సుక్కు టేకింగ్ సంగతి అందరికీ తెలిసిందే.
పర్ఫెక్షన్ కోసం చెక్కుతూ వెళ్తాడు. ఈ క్రమంలో ఆలస్యం జరుగుతుంది. ఆయన చేతుల్లో ఏదీ ఉండదు. ఐతే షూటింగ్ మొదలై కొన్ని రోజులు గడిచాక ఈ విషయంలో స్పష్టత రావచ్చు. ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగిన నేపథ్యంలో సుకుమార్పై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి వచ్చే వేసవికి కొంచెం విరామంతో అయినా మహేష్, బన్నీ తలపడతారేమో చూడాలి.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…