సెలెబ్రిటీల లైఫ్పై అందరికీ ఆసక్తే. కాబట్టే ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త అసత్యమైతే వారికెంత బాధ కలుగుతుందో తనలాంటి వాళ్లకే తెలుస్తుంది అంటోంది సమంత. తప్పుడు వార్తలు ప్రచారం చేసి తననలా బాధపెట్టిన మూడు యూట్యూబ్ చానెళ్లపై పరువు నష్టం దావా వేసిందామె.
సమంత, నాగచైతన్యల విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుంచి మీడియాలో ఎన్ని రకాల వార్తలు వచ్చాయో తెలిసిందే. ముఖ్యంగా డివోర్స్కి సమంత ప్రవర్తనే కారణమంటూ బాగా ప్రచారం జరిగింది. ఆమెకి అబార్షన్స్ అయ్యాయని, పిల్లలు కనడానికి ఇష్టపడటం లేదని, ప్రీతమ్ జుకల్కర్తో ఆమెకున్న అనుబంధమే విడాకులకు కారణమని.. ఇలా చాలా వార్తలొచ్చాయి. అవన్నీ నిజం కాదని ఓ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చిన సమంత, ఇప్పుడు కుకట్పల్లి కోర్టులో మూడు యూట్యూబ్ చానెళ్ల మీద పరువు నష్టం దావా వేసింది.
తనపై సోషల్ మీడియాలో దారుణంగా దుష్ప్రచారం చేశారని, తప్పుడు వార్తలతో తన పరువుకు నష్టం కలిగించారని పిటిషన్లో పేర్కొంది సామ్. ఆమె తరఫున హైకోర్ట్ లాయర్ బాలాజీ కోర్టులో పిటిషన్ను దాఖలు చేసి వాదనలు వినిపించారు. మరి ఇప్పటికైనా అసత్య వార్తలకు ఫుల్స్టాప్ పడి సమంతకి ఊరట దొరుకుతుందో లేదో.
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…