‘సాహో’ లాంటి యాక్షన్ మూవీ తర్వాత ‘రాధేశ్యామ్’ లాంటి లవ్స్టోరీతో వస్తానని ప్రకటించాడు ప్రభాస్. 2018 సెప్టెంబర్లో సినిమా లాంచ్ అయ్యింది. 2022 జనవరిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యలో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆరాటపడ్డారో తెలిసిందే. ఎట్టకేలకి వారి ఎదురు చూపులు ఫలించాయి. మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ అప్డేట్ కోసం ఎదురుచూసి డిజప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. దాంతో టీజర్ వస్తుందా లేక ప్రభాస్ పోస్టర్ని రిలీజ్ చేసి సరిపెట్టుకోమంటారా అనే అనుమానాలూ ఉన్నాయి. లక్కీగా టీజర్ రిలీజ్కే ఫిక్సయ్యింది టీమ్. 23న ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాలకు టీజర్ను విడుదల చేయనున్నామని, ఈ టీజర్తో విక్రమాదిత్య ఎవరో తెలుసుకుంటారని యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది.
యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్స్టోరీ ఇది. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. మూడొందల కోట్ల భారీ బడ్జెట్తో మూడున్నరేళ్లకు పైగా తెరకెక్కించాడు రాధాకృష్ణ కుమార్. అన్నేళ్లు తీసేంతగా ఈ సినిమాలో ఏముందో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి టీజర్తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి.
This post was last modified on October 20, 2021 3:56 pm
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…