‘సాహో’ లాంటి యాక్షన్ మూవీ తర్వాత ‘రాధేశ్యామ్’ లాంటి లవ్స్టోరీతో వస్తానని ప్రకటించాడు ప్రభాస్. 2018 సెప్టెంబర్లో సినిమా లాంచ్ అయ్యింది. 2022 జనవరిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యలో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆరాటపడ్డారో తెలిసిందే. ఎట్టకేలకి వారి ఎదురు చూపులు ఫలించాయి. మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ అప్డేట్ కోసం ఎదురుచూసి డిజప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. దాంతో టీజర్ వస్తుందా లేక ప్రభాస్ పోస్టర్ని రిలీజ్ చేసి సరిపెట్టుకోమంటారా అనే అనుమానాలూ ఉన్నాయి. లక్కీగా టీజర్ రిలీజ్కే ఫిక్సయ్యింది టీమ్. 23న ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాలకు టీజర్ను విడుదల చేయనున్నామని, ఈ టీజర్తో విక్రమాదిత్య ఎవరో తెలుసుకుంటారని యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది.
యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్స్టోరీ ఇది. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. మూడొందల కోట్ల భారీ బడ్జెట్తో మూడున్నరేళ్లకు పైగా తెరకెక్కించాడు రాధాకృష్ణ కుమార్. అన్నేళ్లు తీసేంతగా ఈ సినిమాలో ఏముందో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి టీజర్తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి.
This post was last modified on October 20, 2021 3:56 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…