‘సాహో’ లాంటి యాక్షన్ మూవీ తర్వాత ‘రాధేశ్యామ్’ లాంటి లవ్స్టోరీతో వస్తానని ప్రకటించాడు ప్రభాస్. 2018 సెప్టెంబర్లో సినిమా లాంచ్ అయ్యింది. 2022 జనవరిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యలో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆరాటపడ్డారో తెలిసిందే. ఎట్టకేలకి వారి ఎదురు చూపులు ఫలించాయి. మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ అప్డేట్ కోసం ఎదురుచూసి డిజప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. దాంతో టీజర్ వస్తుందా లేక ప్రభాస్ పోస్టర్ని రిలీజ్ చేసి సరిపెట్టుకోమంటారా అనే అనుమానాలూ ఉన్నాయి. లక్కీగా టీజర్ రిలీజ్కే ఫిక్సయ్యింది టీమ్. 23న ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాలకు టీజర్ను విడుదల చేయనున్నామని, ఈ టీజర్తో విక్రమాదిత్య ఎవరో తెలుసుకుంటారని యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది.
యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్స్టోరీ ఇది. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. మూడొందల కోట్ల భారీ బడ్జెట్తో మూడున్నరేళ్లకు పైగా తెరకెక్కించాడు రాధాకృష్ణ కుమార్. అన్నేళ్లు తీసేంతగా ఈ సినిమాలో ఏముందో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి టీజర్తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి.
This post was last modified on October 20, 2021 3:56 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…