ఇండియాలో వెబ్ సిరీస్ కల్చర్ బాగా ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిరీస్ల్లో ఒకటి ‘ఫ్యామిలీ మ్యాన్’ అయితే.. ఇంకోటి ‘స్పెషల్ ఆప్స్’. ఈ రెండు సిరీస్లూ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం వెబ్ సిరీస్లకు అలవాటు పడేలా చేశాయి.
ఈ రెండు సిరీస్ల్లోనూ ఉత్కంఠకు లోటు ఉండదు. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇందులో కీలకంగా ఉంటాయి. ఏ ఎపిసోడ్కు ఆ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ రేపుతూ సాగి ప్రేక్షకులను ఆద్యంతం అలరింపజేస్తాయి. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్’కు ఇప్పటికే సీక్వెల్ వచ్చేసింది.
రెండో సీజన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించి సూపర్ హిట్టయింది. ఇక అందరి దృష్టీ మూడో సీజన్ మీదికి మళ్లింది. ఇప్పుడు ‘స్పెషల్ ఆప్స్’కు సైతం సీక్వెల్ రెడీ అయిపోయింది. నవంబరు 12నే రెండో సీజన్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కాబోతోంది.
‘స్పెషల్ ఆప్స్ 1.5’ పేరుతో రానున్న ఈ సిరీస్కు ట్రైలర్ లాంచ్ చేశారు. పార్లమెంటు మీద దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది జాడను హిమ్మత్ సింగ్ కనిపెట్టి తన టీంతో కలిసి అతడి భరతం ఎలా పట్టాడనే నేపథ్ంయలో ‘స్పెషల్ ఆప్స్’ తొలి సీజన్ నడుస్తుంది.
రెండో సీజన్కు వచ్చేసరికి అసలు హిమ్మత్ సింగ్ అనేవాడికి ఇంత గొప్ప ఆఫీసర్గా ఎలా పేరు వచ్చింది.. అతడి నేపథ్యం ఏంటి.. కెరీర్ ఆరంభంలో అతను ఎందుకు సస్పెండయ్యాడు.. తర్వాత తిరిగి డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాడు.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో ఒక ముఖ్యమైన ఆపరేషన్ను ఎలా నడిపించి ఉపద్రవాన్ని తప్పించాడు అనే నేపథ్యంలో సెకండ్ సీజన్ నడవబోతోందని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.
నీరజ్ పాండే క్రియేట్ చేసిన ఈ సిరీస్.. తొలి సీజన్ లాగే ఉత్కంఠభరితంగా సాగుతూ, ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కేకే మీనన్ మరోసారి ప్రేక్షకుల మనసులు దోచేలాగే కనిపిస్తున్నాడు.
This post was last modified on October 19, 2021 11:30 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…