ఇండియాలో వెబ్ సిరీస్ కల్చర్ బాగా ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిరీస్ల్లో ఒకటి ‘ఫ్యామిలీ మ్యాన్’ అయితే.. ఇంకోటి ‘స్పెషల్ ఆప్స్’. ఈ రెండు సిరీస్లూ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం వెబ్ సిరీస్లకు అలవాటు పడేలా చేశాయి.
ఈ రెండు సిరీస్ల్లోనూ ఉత్కంఠకు లోటు ఉండదు. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇందులో కీలకంగా ఉంటాయి. ఏ ఎపిసోడ్కు ఆ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ రేపుతూ సాగి ప్రేక్షకులను ఆద్యంతం అలరింపజేస్తాయి. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్’కు ఇప్పటికే సీక్వెల్ వచ్చేసింది.
రెండో సీజన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించి సూపర్ హిట్టయింది. ఇక అందరి దృష్టీ మూడో సీజన్ మీదికి మళ్లింది. ఇప్పుడు ‘స్పెషల్ ఆప్స్’కు సైతం సీక్వెల్ రెడీ అయిపోయింది. నవంబరు 12నే రెండో సీజన్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కాబోతోంది.
‘స్పెషల్ ఆప్స్ 1.5’ పేరుతో రానున్న ఈ సిరీస్కు ట్రైలర్ లాంచ్ చేశారు. పార్లమెంటు మీద దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది జాడను హిమ్మత్ సింగ్ కనిపెట్టి తన టీంతో కలిసి అతడి భరతం ఎలా పట్టాడనే నేపథ్ంయలో ‘స్పెషల్ ఆప్స్’ తొలి సీజన్ నడుస్తుంది.
రెండో సీజన్కు వచ్చేసరికి అసలు హిమ్మత్ సింగ్ అనేవాడికి ఇంత గొప్ప ఆఫీసర్గా ఎలా పేరు వచ్చింది.. అతడి నేపథ్యం ఏంటి.. కెరీర్ ఆరంభంలో అతను ఎందుకు సస్పెండయ్యాడు.. తర్వాత తిరిగి డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాడు.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో ఒక ముఖ్యమైన ఆపరేషన్ను ఎలా నడిపించి ఉపద్రవాన్ని తప్పించాడు అనే నేపథ్యంలో సెకండ్ సీజన్ నడవబోతోందని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.
నీరజ్ పాండే క్రియేట్ చేసిన ఈ సిరీస్.. తొలి సీజన్ లాగే ఉత్కంఠభరితంగా సాగుతూ, ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కేకే మీనన్ మరోసారి ప్రేక్షకుల మనసులు దోచేలాగే కనిపిస్తున్నాడు.
This post was last modified on October 19, 2021 11:30 pm
ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…