సోషల్ మీడియా పుణ్యమా అని ఉన్నట్లుండి అనామకులు తెగ పాపులర్ అయిపోతుంటారు. కొన్ని క్షణాల వీడియోలతో సూపర్ పాపులర్ అయిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇలా పాపులర్ అయినవాడే శరత్. ఈ పేరు చెబితే ఎవరో తెలియకపోవచ్చు కానీ.. ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ’’ అంటూ సాగే వీడియోను గుర్తు చేస్తే అందరికీ అతనెవరో తెలిసిపోతుంది.
ఒక టీ ప్రాడక్ట్ యాడ్ను అనుకరిస్తూ తమాషాగా అతను చేసిన డ్యాన్స్ భలే వైరల్ అయింది. కోట్ల మందికి ఆ కుర్రాడిని పరిచయం చేసింది. దీని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ట్రోల్ కంటెంట్కు అతణ్ని చాలా బాగా వాడేసింది సోషల్ మీడియా. పేరు తెలియకుండానే బాగా పాపులర్ అయిపోయిన ఈ కుర్రాడు.. ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎవరో అతణ్ని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలై కనిపించాడు.
శరత్ మీద ఎవరు ఎందుకు దాడి చేశారనే విషయంలో గత రెండు రోజుల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే మంగళవారం శరత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో వెల్లడించాడు. ‘‘నేనంటే పడని వ్యక్తులు నా మీద దాడి చేశారు. గతంలో నా చెల్లిని వేధింపులకు గురి చేస్తుంటే సాయి, హరి అనే వ్యక్తులను కొట్టాను. ఆ కేసులో నేను గతంలో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చాను.
నేను ఇలా బయటికి రాగానే నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ ఇచ్చారు. ఐతే ఇదంతా జీర్ణించుకోలేక.. నా ఎదుగుదల నచ్చక నాపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నన్ను కొట్టిన వాళ్ల మీద రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని ముఖం మీద దెబ్బలతోనే మీడియాతో మాట్లాడుతూ వివరించాడు శరత్.
This post was last modified on October 19, 2021 11:26 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…