సోషల్ మీడియా పుణ్యమా అని ఉన్నట్లుండి అనామకులు తెగ పాపులర్ అయిపోతుంటారు. కొన్ని క్షణాల వీడియోలతో సూపర్ పాపులర్ అయిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇలా పాపులర్ అయినవాడే శరత్. ఈ పేరు చెబితే ఎవరో తెలియకపోవచ్చు కానీ.. ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ’’ అంటూ సాగే వీడియోను గుర్తు చేస్తే అందరికీ అతనెవరో తెలిసిపోతుంది.
ఒక టీ ప్రాడక్ట్ యాడ్ను అనుకరిస్తూ తమాషాగా అతను చేసిన డ్యాన్స్ భలే వైరల్ అయింది. కోట్ల మందికి ఆ కుర్రాడిని పరిచయం చేసింది. దీని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ట్రోల్ కంటెంట్కు అతణ్ని చాలా బాగా వాడేసింది సోషల్ మీడియా. పేరు తెలియకుండానే బాగా పాపులర్ అయిపోయిన ఈ కుర్రాడు.. ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎవరో అతణ్ని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలై కనిపించాడు.
శరత్ మీద ఎవరు ఎందుకు దాడి చేశారనే విషయంలో గత రెండు రోజుల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే మంగళవారం శరత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో వెల్లడించాడు. ‘‘నేనంటే పడని వ్యక్తులు నా మీద దాడి చేశారు. గతంలో నా చెల్లిని వేధింపులకు గురి చేస్తుంటే సాయి, హరి అనే వ్యక్తులను కొట్టాను. ఆ కేసులో నేను గతంలో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చాను.
నేను ఇలా బయటికి రాగానే నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ ఇచ్చారు. ఐతే ఇదంతా జీర్ణించుకోలేక.. నా ఎదుగుదల నచ్చక నాపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నన్ను కొట్టిన వాళ్ల మీద రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని ముఖం మీద దెబ్బలతోనే మీడియాతో మాట్లాడుతూ వివరించాడు శరత్.
This post was last modified on October 19, 2021 11:26 pm
2027 సంక్రాంతి అయిదు నెలల ముందే టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేమంటే మేమంటూ ఎవరికి వారు పోటీ పడి…
ఇంకా షూటింగ్ మొదలుకుండానే కేవలం ప్రీ లుక్ పోస్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సోషల్…
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ఏపీ తెలంగాణలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. బడా సంస్థ పంపిణి హక్కులు…
సందీప్ కిషన్.. హిట్లు ఫ్లాపుల కంటే ముందుగా గుర్తొచ్చేది ఈ హీరో చేసే ప్రయోగాలు. 16 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా…
భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉరి తీయడానికి బదులుగా ప్రాణాలు తీసేందుకు తక్కువ నొప్పిని…
2014 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఒకటి.…