సోషల్ మీడియా పుణ్యమా అని ఉన్నట్లుండి అనామకులు తెగ పాపులర్ అయిపోతుంటారు. కొన్ని క్షణాల వీడియోలతో సూపర్ పాపులర్ అయిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇలా పాపులర్ అయినవాడే శరత్. ఈ పేరు చెబితే ఎవరో తెలియకపోవచ్చు కానీ.. ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ’’ అంటూ సాగే వీడియోను గుర్తు చేస్తే అందరికీ అతనెవరో తెలిసిపోతుంది.
ఒక టీ ప్రాడక్ట్ యాడ్ను అనుకరిస్తూ తమాషాగా అతను చేసిన డ్యాన్స్ భలే వైరల్ అయింది. కోట్ల మందికి ఆ కుర్రాడిని పరిచయం చేసింది. దీని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ట్రోల్ కంటెంట్కు అతణ్ని చాలా బాగా వాడేసింది సోషల్ మీడియా. పేరు తెలియకుండానే బాగా పాపులర్ అయిపోయిన ఈ కుర్రాడు.. ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎవరో అతణ్ని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలై కనిపించాడు.
శరత్ మీద ఎవరు ఎందుకు దాడి చేశారనే విషయంలో గత రెండు రోజుల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే మంగళవారం శరత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో వెల్లడించాడు. ‘‘నేనంటే పడని వ్యక్తులు నా మీద దాడి చేశారు. గతంలో నా చెల్లిని వేధింపులకు గురి చేస్తుంటే సాయి, హరి అనే వ్యక్తులను కొట్టాను. ఆ కేసులో నేను గతంలో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చాను.
నేను ఇలా బయటికి రాగానే నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ ఇచ్చారు. ఐతే ఇదంతా జీర్ణించుకోలేక.. నా ఎదుగుదల నచ్చక నాపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నన్ను కొట్టిన వాళ్ల మీద రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని ముఖం మీద దెబ్బలతోనే మీడియాతో మాట్లాడుతూ వివరించాడు శరత్.
This post was last modified on October 19, 2021 11:26 pm
రాజకీయ పార్టీ అధినేతలు.. నేతలు విమర్శలు చేయటం.. తీవ్ర ఆరోపణలు చేయటం మామూలే. అయితే.. దేశ చరిత్రలో ఇప్పటివరకు ప్రధాన…
గేమ్ ఛేంజర్ ఫలితం గురించి మాట్లాడేందుకు ఏం లేదు కానీ అప్పుడప్పుడు వద్దన్నా దాని తాలూకు కంటెంట్ అభిమానులను గుచ్చుతూనే…
కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక…
టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు… నిత్యం వివాదాలతోనే సహవాసం చేస్తున్నట్లుగా ఉంది. యంగ్…
తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ అసెంబ్లీకి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఏదో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి…
విభజన హామీల అమలు.. సమస్యల పరిష్కారంపై మరోసారి కేంద్ర ప్రభుత్వం బంతాట ప్రారంభించింది. మీరే తేల్చుకోండి! అని తేల్చి చెప్పింది.…