Movie News

‘సుఖీభవ’ కుర్రాణ్ని ఎందుకలా కొట్టారు?

సోషల్ మీడియా పుణ్యమా అని ఉన్నట్లుండి అనామకులు తెగ పాపులర్ అయిపోతుంటారు. కొన్ని క్షణాల వీడియోలతో సూపర్ పాపులర్ అయిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇలా పాపులర్ అయినవాడే శరత్. ఈ పేరు చెబితే ఎవరో తెలియకపోవచ్చు కానీ.. ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ’’ అంటూ సాగే వీడియోను గుర్తు చేస్తే అందరికీ అతనెవరో తెలిసిపోతుంది.

ఒక టీ ప్రాడక్ట్ యాడ్‌ను అనుకరిస్తూ తమాషాగా అతను చేసిన డ్యాన్స్ భలే వైరల్ అయింది. కోట్ల మందికి ఆ కుర్రాడిని పరిచయం చేసింది. దీని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ట్రోల్ కంటెంట్‌కు అతణ్ని చాలా బాగా వాడేసింది సోషల్ మీడియా. పేరు తెలియకుండానే బాగా పాపులర్ అయిపోయిన ఈ కుర్రాడు.. ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎవరో అతణ్ని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలై కనిపించాడు.

శరత్ మీద ఎవరు ఎందుకు దాడి చేశారనే విషయంలో గత రెండు రోజుల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే మంగళవారం శరత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో వెల్లడించాడు. ‘‘నేనంటే పడని వ్యక్తులు నా మీద దాడి చేశారు. గతంలో నా చెల్లిని వేధింపులకు గురి చేస్తుంటే సాయి, హరి అనే వ్యక్తులను కొట్టాను. ఆ కేసులో నేను గతంలో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చాను.

నేను ఇలా బయటికి రాగానే నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ ఇచ్చారు. ఐతే ఇదంతా జీర్ణించుకోలేక.. నా ఎదుగుదల నచ్చక నాపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నన్ను కొట్టిన వాళ్ల మీద రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని ముఖం మీద దెబ్బలతోనే మీడియాతో మాట్లాడుతూ వివరించాడు శరత్.

This post was last modified on October 19, 2021 11:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

1 hour ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

3 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

3 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

5 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

6 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

7 hours ago