దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. విడుదలకు ముందు సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ నెగెటివ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ తో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. ఫైనల్ గా ఇదొక ప్లాప్ సినిమాగా తేల్చేశారు. ఈ ప్లాప్ ఎఫెక్ట్ శర్వానంద్ మీద కంటే దర్శకుడు అజయ్ భూపతిపై బాగా పడింది.
‘ఆర్ఎక్స్100’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు మంచి క్రేజ్ వచ్చింది. పాయల్ బోల్డ్ సీన్స్, క్లైమాక్స్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాయి. దీంతో దర్శకుడు అజయ్ భూపతికి చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అవకాశాలు వచ్చాయి. ‘మహాసముద్రం’ లాంటి మల్టీస్టారర్ కథ రాసుకున్న అజయ్ భూపతి ముందుగా నాగచైతన్యను సంప్రదించారు. చైతు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ.. ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఫైనల్ గా రవితేజ సినిమాకి ఓకే చెప్పడంతో స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు అజయ్ భూపతి. రవితేజ-సిద్ధార్థ్ లను హీరోలుగా అనుకున్నాడు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని రవితేజ సూచించారు. ముఖ్యంగా కథలో ‘మహా’ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని మార్పులు చేయమని కోరాడు రవితేజ. కానీ అజయ్ భూపతి ఆ సలహాలను పట్టించుకోలేదు. దీంతో రవితేజ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా రవితేజను టార్గెట్ చేస్తూ ‘అన్ ప్రొఫెషనల్ బిహేవియర్’ అంటూ పోస్ట్ పెట్టాడు.
చివరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకొని శర్వానంద్ ను రంగంలోకి దింపింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రవితేజ బాగానే తప్పించుకున్నాడంటూ ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రవితేజ.. అజయ్ భూపతి జడ్జిమెంట్ తప్పని నిరూపించాడు.
This post was last modified on October 19, 2021 11:12 pm
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…