దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. విడుదలకు ముందు సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ నెగెటివ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ తో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. ఫైనల్ గా ఇదొక ప్లాప్ సినిమాగా తేల్చేశారు. ఈ ప్లాప్ ఎఫెక్ట్ శర్వానంద్ మీద కంటే దర్శకుడు అజయ్ భూపతిపై బాగా పడింది.
‘ఆర్ఎక్స్100’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు మంచి క్రేజ్ వచ్చింది. పాయల్ బోల్డ్ సీన్స్, క్లైమాక్స్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాయి. దీంతో దర్శకుడు అజయ్ భూపతికి చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అవకాశాలు వచ్చాయి. ‘మహాసముద్రం’ లాంటి మల్టీస్టారర్ కథ రాసుకున్న అజయ్ భూపతి ముందుగా నాగచైతన్యను సంప్రదించారు. చైతు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ.. ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఫైనల్ గా రవితేజ సినిమాకి ఓకే చెప్పడంతో స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు అజయ్ భూపతి. రవితేజ-సిద్ధార్థ్ లను హీరోలుగా అనుకున్నాడు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని రవితేజ సూచించారు. ముఖ్యంగా కథలో ‘మహా’ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని మార్పులు చేయమని కోరాడు రవితేజ. కానీ అజయ్ భూపతి ఆ సలహాలను పట్టించుకోలేదు. దీంతో రవితేజ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా రవితేజను టార్గెట్ చేస్తూ ‘అన్ ప్రొఫెషనల్ బిహేవియర్’ అంటూ పోస్ట్ పెట్టాడు.
చివరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకొని శర్వానంద్ ను రంగంలోకి దింపింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రవితేజ బాగానే తప్పించుకున్నాడంటూ ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రవితేజ.. అజయ్ భూపతి జడ్జిమెంట్ తప్పని నిరూపించాడు.
This post was last modified on October 19, 2021 11:12 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…