దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. విడుదలకు ముందు సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ నెగెటివ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ తో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. ఫైనల్ గా ఇదొక ప్లాప్ సినిమాగా తేల్చేశారు. ఈ ప్లాప్ ఎఫెక్ట్ శర్వానంద్ మీద కంటే దర్శకుడు అజయ్ భూపతిపై బాగా పడింది.
‘ఆర్ఎక్స్100’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు మంచి క్రేజ్ వచ్చింది. పాయల్ బోల్డ్ సీన్స్, క్లైమాక్స్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాయి. దీంతో దర్శకుడు అజయ్ భూపతికి చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అవకాశాలు వచ్చాయి. ‘మహాసముద్రం’ లాంటి మల్టీస్టారర్ కథ రాసుకున్న అజయ్ భూపతి ముందుగా నాగచైతన్యను సంప్రదించారు. చైతు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ.. ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఫైనల్ గా రవితేజ సినిమాకి ఓకే చెప్పడంతో స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు అజయ్ భూపతి. రవితేజ-సిద్ధార్థ్ లను హీరోలుగా అనుకున్నాడు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని రవితేజ సూచించారు. ముఖ్యంగా కథలో ‘మహా’ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని మార్పులు చేయమని కోరాడు రవితేజ. కానీ అజయ్ భూపతి ఆ సలహాలను పట్టించుకోలేదు. దీంతో రవితేజ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా రవితేజను టార్గెట్ చేస్తూ ‘అన్ ప్రొఫెషనల్ బిహేవియర్’ అంటూ పోస్ట్ పెట్టాడు.
చివరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకొని శర్వానంద్ ను రంగంలోకి దింపింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రవితేజ బాగానే తప్పించుకున్నాడంటూ ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రవితేజ.. అజయ్ భూపతి జడ్జిమెంట్ తప్పని నిరూపించాడు.
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…