దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. విడుదలకు ముందు సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ నెగెటివ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ తో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. ఫైనల్ గా ఇదొక ప్లాప్ సినిమాగా తేల్చేశారు. ఈ ప్లాప్ ఎఫెక్ట్ శర్వానంద్ మీద కంటే దర్శకుడు అజయ్ భూపతిపై బాగా పడింది.
‘ఆర్ఎక్స్100’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు మంచి క్రేజ్ వచ్చింది. పాయల్ బోల్డ్ సీన్స్, క్లైమాక్స్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాయి. దీంతో దర్శకుడు అజయ్ భూపతికి చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అవకాశాలు వచ్చాయి. ‘మహాసముద్రం’ లాంటి మల్టీస్టారర్ కథ రాసుకున్న అజయ్ భూపతి ముందుగా నాగచైతన్యను సంప్రదించారు. చైతు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ.. ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఫైనల్ గా రవితేజ సినిమాకి ఓకే చెప్పడంతో స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు అజయ్ భూపతి. రవితేజ-సిద్ధార్థ్ లను హీరోలుగా అనుకున్నాడు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని రవితేజ సూచించారు. ముఖ్యంగా కథలో ‘మహా’ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని మార్పులు చేయమని కోరాడు రవితేజ. కానీ అజయ్ భూపతి ఆ సలహాలను పట్టించుకోలేదు. దీంతో రవితేజ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా రవితేజను టార్గెట్ చేస్తూ ‘అన్ ప్రొఫెషనల్ బిహేవియర్’ అంటూ పోస్ట్ పెట్టాడు.
చివరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకొని శర్వానంద్ ను రంగంలోకి దింపింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రవితేజ బాగానే తప్పించుకున్నాడంటూ ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రవితేజ.. అజయ్ భూపతి జడ్జిమెంట్ తప్పని నిరూపించాడు.
This post was last modified on October 19, 2021 11:12 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…