మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ముగిసి వారం కావస్తోంది. కానీ ఈ ఎన్నికల రగడ ఇంకా ఆగట్లేదు. ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ అనేక విమర్శలు, ఆరోపణలు చేయడం.. తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. దీనిపై మంచు విష్ణు ప్యానెల్ నుంచి తీవ్ర స్పందనేమీ లేదు. సాధ్యమైనంత సైలెంటుగా ఉంటూ ముందుకు వెళ్లిపోదామనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఐతే ఎన్నికల నిర్వహించిన తీరుపై ఇంతకుముందే అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్.. అంతటితో ఆగకుండా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం లోపల తమ ప్యానెల్ సభ్యులపై దాడి జరిగిందని.. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ను కోరుతూ లేఖ రాయడం తెలిసిందే. ఐతే ప్రకాష్ రాజ్ విజ్ఞప్తిని కృష్ణమోహన్ తిరస్కరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఆయన నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే ఈ లోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ పోలీసులు ఇందులో జోక్యం చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉన్న గదిని సీజ్ చేశారు. పోలీసులు స్వచ్ఛందంగా ఈ పని చేసే అవకాశం లేదు. బహుశా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల అధికారి నిరాకరించిన నేపథ్యంలో.. ప్రకాష్ రాజ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటాడని.. దీంతో వారు రంగంలోకి దిగి ఈ గదికి తాళం వేసి ఉంటారని భావిస్తున్నారు.
మరి ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. ఎన్నికల సందర్భంగా అంతా సవ్యంగా సాగి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడంలో ఎన్నికల అధికారికి ఉన్న అభ్యంతరమేంటన్నది ప్రశ్న. ప్రకాష్ రాజ్ అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. అవసరమైతే కోర్టుకు వెల్లడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 17, 2021 1:15 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…