Movie News

‘మా’ ఎన్నికల్లో ట్విస్టులు ఆగట్లేదు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ముగిసి వారం కావస్తోంది. కానీ ఈ ఎన్నికల రగడ ఇంకా ఆగట్లేదు. ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ అనేక విమర్శలు, ఆరోపణలు చేయడం.. తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. దీనిపై మంచు విష్ణు ప్యానెల్ నుంచి తీవ్ర స్పందనేమీ లేదు. సాధ్యమైనంత సైలెంటుగా ఉంటూ ముందుకు వెళ్లిపోదామనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఐతే ఎన్నికల నిర్వహించిన తీరుపై ఇంతకుముందే అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్.. అంతటితో ఆగకుండా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం లోపల తమ ప్యానెల్ సభ్యులపై దాడి జరిగిందని.. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను కోరుతూ లేఖ రాయడం తెలిసిందే. ఐతే ప్రకాష్ రాజ్ విజ్ఞప్తిని కృష్ణమోహన్ తిరస్కరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఆయన నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి.

ఐతే ఈ లోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ పోలీసులు ఇందులో జోక్యం చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉన్న గదిని సీజ్ చేశారు. పోలీసులు స్వచ్ఛందంగా ఈ పని చేసే అవకాశం లేదు. బహుశా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల అధికారి నిరాకరించిన నేపథ్యంలో.. ప్రకాష్ రాజ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటాడని.. దీంతో వారు రంగంలోకి దిగి ఈ గదికి తాళం వేసి ఉంటారని భావిస్తున్నారు.

మరి ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. ఎన్నికల సందర్భంగా అంతా సవ్యంగా సాగి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడంలో ఎన్నికల అధికారికి ఉన్న అభ్యంతరమేంటన్నది ప్రశ్న. ప్రకాష్ రాజ్ అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. అవసరమైతే కోర్టుకు వెల్లడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on October 17, 2021 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

52 minutes ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

2 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

3 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago