మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ముగిసి వారం కావస్తోంది. కానీ ఈ ఎన్నికల రగడ ఇంకా ఆగట్లేదు. ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ అనేక విమర్శలు, ఆరోపణలు చేయడం.. తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. దీనిపై మంచు విష్ణు ప్యానెల్ నుంచి తీవ్ర స్పందనేమీ లేదు. సాధ్యమైనంత సైలెంటుగా ఉంటూ ముందుకు వెళ్లిపోదామనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఐతే ఎన్నికల నిర్వహించిన తీరుపై ఇంతకుముందే అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్.. అంతటితో ఆగకుండా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం లోపల తమ ప్యానెల్ సభ్యులపై దాడి జరిగిందని.. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ను కోరుతూ లేఖ రాయడం తెలిసిందే. ఐతే ప్రకాష్ రాజ్ విజ్ఞప్తిని కృష్ణమోహన్ తిరస్కరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఆయన నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే ఈ లోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ పోలీసులు ఇందులో జోక్యం చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉన్న గదిని సీజ్ చేశారు. పోలీసులు స్వచ్ఛందంగా ఈ పని చేసే అవకాశం లేదు. బహుశా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల అధికారి నిరాకరించిన నేపథ్యంలో.. ప్రకాష్ రాజ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటాడని.. దీంతో వారు రంగంలోకి దిగి ఈ గదికి తాళం వేసి ఉంటారని భావిస్తున్నారు.
మరి ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. ఎన్నికల సందర్భంగా అంతా సవ్యంగా సాగి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడంలో ఎన్నికల అధికారికి ఉన్న అభ్యంతరమేంటన్నది ప్రశ్న. ప్రకాష్ రాజ్ అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. అవసరమైతే కోర్టుకు వెల్లడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 17, 2021 1:15 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…