నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమా ‘అఖండ’. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ముందు అనుకున్న ప్రకారమైతే మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఆలస్యం తప్పలేదు. ఆ తర్వాత దసరా రిలీజ్ అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆపై దీపావళి మీదికి ఫోకస్ మళ్లింది.
దీపావళికి నెల రోజుల సమయం ఉండగానే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పండక్కి బాలయ్య సందడి ఉంటుందనే ఆశతోనే ఉన్నారు అభిమానులు. మీడియాలో కూడా దీని గురించి ప్రచారం జరిగింది. కానీ ‘అఖండ’ టీం నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. దసరా రోజు దీపావళి రిలీజ్ గురించి ప్రకటన ఉంటుందని.. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారని అన్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు.
దసరా రోజు కనీసం పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ కూడా వదల్లేదని.. రిలీజ్ గురించి అప్డేటే లేదని నిర్మాణ సంస్థ ‘ద్వారక క్రియేషన్స్’ను ట్విట్టర్లో నందమూరి అభిమానులు ఉదయం నుంచి తిడుతూనే ఉన్నారు. అయినా సాయంత్రానికి కూడా చలనం లేదు. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘అఖండ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం జరుగుతుండటంతో దీపావళి విడుదల సాధ్యం కాదని ఫిక్సయిపోయారట.
క్రిస్మస్, సంక్రాంతి సీజన్లకు బెర్తులు బుక్ అయిపోయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబరు తొలి వారంలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారట. త్వరలోనే దీని గురించి ప్రకటన ఇస్తారని అంటున్నారు. కాబట్టి దీపావళికి రజినీకాంత్ తమిళ అనువాద చిత్రం ‘పెద్దన్న’తో పాటు మారుతి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’, పూరి ఆకాశ్ మూవీ ‘రొమాంటిక్’లకు ఫిక్సయిపోవచ్చు.
This post was last modified on October 15, 2021 5:35 pm
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…