సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు రోజు రోజుకూ శ్రుతిమించి పోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఎవరో హీరోయిన్ తన ఫాలోవర్లతో చిట్ చాట్ పెడుతుంది. అందులో ఫలానా హీరో గురించి మీ అభిప్రాయం ఏంటి అంటారు. ఆమె పొగిడిందంటే ఆ ట్వీట్ను పట్టుకుని తమ హీరోకు ఎలివేషన్ ఇస్తారు. పొరబాటున ఆ హీరోయిన్ నెగెటివ్గా స్పందించడమో.. ఇగ్నోర్ చేయడమే చేసిందంటే ఇక అంతే సంగతులు. బూతు పురాణం మొదలైపోతుంది. ఈ విషయంలో హీరోయిన్లు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు. కానీ బంగారం, వాన, గ్రీకువీరుడు లాంటి సినిమాల్లో నటించిన ఉత్తరాది భామ మీరా చోప్రా ఇలా లౌక్యంగా వ్యవహరించలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తనకు తెలియదన్న పాపానికి బూతులు తిట్టించుకుంది.
ట్విట్టర్ చిట్ చాట్ సందర్భంగా తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరని ఓ ఫాలోవర్ మీరాను అడిగితే మహేష్ బాబు పేరు చెప్పిందామె. తన బంగారం కోస్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. ఆయనో సూపర్ స్టార్, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని సమాధానం ఇచ్చింది. ఐతే ఎన్టీఆర్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. అతనెవరో తనకు తెలియదని అంది. ఒక నెటిజన్ శక్తి, దమ్ము సినిమాలు చూస్తే తారక్ ఫ్యాన్ అయిపోతావ్ అన్నాడు. దానికి బదులుగా తనకంత ఆసక్తి లేదు అంది మీరా. ఇక అంతే తారక్ ఫ్యాన్స్ బూతు పురాణం మొదలైంది. మీరాతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి తిట్టిపోశారు. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లు సోషల్ మీడియాలో కామన్ అని వదిలేయకుండా మీరా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎన్టీఆర్ను ట్యాగ్ చేస్తూ.. అతడి అభిమానులు తననెలా బూతులు తిడుతున్నారో వివరించింది. ఇలాంటి అభిమానుల్ని పెట్టుకుని నువ్వు సక్సెస్ ఫుల్ ఎలా అవుతావ్ అని ప్రశ్నించింది. తన ట్వీట్ను ఇగ్నోర్ చేయొద్దని కూడా కోరింది. మొత్తానికి కొందరు ఫ్యాన్స్ చేసిన అతికి ఇప్పుడు తారక్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
This post was last modified on June 2, 2020 11:17 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…