సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు రోజు రోజుకూ శ్రుతిమించి పోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఎవరో హీరోయిన్ తన ఫాలోవర్లతో చిట్ చాట్ పెడుతుంది. అందులో ఫలానా హీరో గురించి మీ అభిప్రాయం ఏంటి అంటారు. ఆమె పొగిడిందంటే ఆ ట్వీట్ను పట్టుకుని తమ హీరోకు ఎలివేషన్ ఇస్తారు. పొరబాటున ఆ హీరోయిన్ నెగెటివ్గా స్పందించడమో.. ఇగ్నోర్ చేయడమే చేసిందంటే ఇక అంతే సంగతులు. బూతు పురాణం మొదలైపోతుంది. ఈ విషయంలో హీరోయిన్లు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు. కానీ బంగారం, వాన, గ్రీకువీరుడు లాంటి సినిమాల్లో నటించిన ఉత్తరాది భామ మీరా చోప్రా ఇలా లౌక్యంగా వ్యవహరించలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తనకు తెలియదన్న పాపానికి బూతులు తిట్టించుకుంది.
ట్విట్టర్ చిట్ చాట్ సందర్భంగా తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరని ఓ ఫాలోవర్ మీరాను అడిగితే మహేష్ బాబు పేరు చెప్పిందామె. తన బంగారం కోస్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. ఆయనో సూపర్ స్టార్, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని సమాధానం ఇచ్చింది. ఐతే ఎన్టీఆర్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. అతనెవరో తనకు తెలియదని అంది. ఒక నెటిజన్ శక్తి, దమ్ము సినిమాలు చూస్తే తారక్ ఫ్యాన్ అయిపోతావ్ అన్నాడు. దానికి బదులుగా తనకంత ఆసక్తి లేదు అంది మీరా. ఇక అంతే తారక్ ఫ్యాన్స్ బూతు పురాణం మొదలైంది. మీరాతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి తిట్టిపోశారు. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లు సోషల్ మీడియాలో కామన్ అని వదిలేయకుండా మీరా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎన్టీఆర్ను ట్యాగ్ చేస్తూ.. అతడి అభిమానులు తననెలా బూతులు తిడుతున్నారో వివరించింది. ఇలాంటి అభిమానుల్ని పెట్టుకుని నువ్వు సక్సెస్ ఫుల్ ఎలా అవుతావ్ అని ప్రశ్నించింది. తన ట్వీట్ను ఇగ్నోర్ చేయొద్దని కూడా కోరింది. మొత్తానికి కొందరు ఫ్యాన్స్ చేసిన అతికి ఇప్పుడు తారక్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
This post was last modified on June 2, 2020 11:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…