సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు రోజు రోజుకూ శ్రుతిమించి పోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఎవరో హీరోయిన్ తన ఫాలోవర్లతో చిట్ చాట్ పెడుతుంది. అందులో ఫలానా హీరో గురించి మీ అభిప్రాయం ఏంటి అంటారు. ఆమె పొగిడిందంటే ఆ ట్వీట్ను పట్టుకుని తమ హీరోకు ఎలివేషన్ ఇస్తారు. పొరబాటున ఆ హీరోయిన్ నెగెటివ్గా స్పందించడమో.. ఇగ్నోర్ చేయడమే చేసిందంటే ఇక అంతే సంగతులు. బూతు పురాణం మొదలైపోతుంది. ఈ విషయంలో హీరోయిన్లు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు. కానీ బంగారం, వాన, గ్రీకువీరుడు లాంటి సినిమాల్లో నటించిన ఉత్తరాది భామ మీరా చోప్రా ఇలా లౌక్యంగా వ్యవహరించలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తనకు తెలియదన్న పాపానికి బూతులు తిట్టించుకుంది.
ట్విట్టర్ చిట్ చాట్ సందర్భంగా తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరని ఓ ఫాలోవర్ మీరాను అడిగితే మహేష్ బాబు పేరు చెప్పిందామె. తన బంగారం కోస్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. ఆయనో సూపర్ స్టార్, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని సమాధానం ఇచ్చింది. ఐతే ఎన్టీఆర్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. అతనెవరో తనకు తెలియదని అంది. ఒక నెటిజన్ శక్తి, దమ్ము సినిమాలు చూస్తే తారక్ ఫ్యాన్ అయిపోతావ్ అన్నాడు. దానికి బదులుగా తనకంత ఆసక్తి లేదు అంది మీరా. ఇక అంతే తారక్ ఫ్యాన్స్ బూతు పురాణం మొదలైంది. మీరాతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి తిట్టిపోశారు. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లు సోషల్ మీడియాలో కామన్ అని వదిలేయకుండా మీరా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎన్టీఆర్ను ట్యాగ్ చేస్తూ.. అతడి అభిమానులు తననెలా బూతులు తిడుతున్నారో వివరించింది. ఇలాంటి అభిమానుల్ని పెట్టుకుని నువ్వు సక్సెస్ ఫుల్ ఎలా అవుతావ్ అని ప్రశ్నించింది. తన ట్వీట్ను ఇగ్నోర్ చేయొద్దని కూడా కోరింది. మొత్తానికి కొందరు ఫ్యాన్స్ చేసిన అతికి ఇప్పుడు తారక్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
This post was last modified on June 2, 2020 11:17 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…