సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు రోజు రోజుకూ శ్రుతిమించి పోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఎవరో హీరోయిన్ తన ఫాలోవర్లతో చిట్ చాట్ పెడుతుంది. అందులో ఫలానా హీరో గురించి మీ అభిప్రాయం ఏంటి అంటారు. ఆమె పొగిడిందంటే ఆ ట్వీట్ను పట్టుకుని తమ హీరోకు ఎలివేషన్ ఇస్తారు. పొరబాటున ఆ హీరోయిన్ నెగెటివ్గా స్పందించడమో.. ఇగ్నోర్ చేయడమే చేసిందంటే ఇక అంతే సంగతులు. బూతు పురాణం మొదలైపోతుంది. ఈ విషయంలో హీరోయిన్లు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు. కానీ బంగారం, వాన, గ్రీకువీరుడు లాంటి సినిమాల్లో నటించిన ఉత్తరాది భామ మీరా చోప్రా ఇలా లౌక్యంగా వ్యవహరించలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తనకు తెలియదన్న పాపానికి బూతులు తిట్టించుకుంది.
ట్విట్టర్ చిట్ చాట్ సందర్భంగా తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరని ఓ ఫాలోవర్ మీరాను అడిగితే మహేష్ బాబు పేరు చెప్పిందామె. తన బంగారం కోస్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. ఆయనో సూపర్ స్టార్, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని సమాధానం ఇచ్చింది. ఐతే ఎన్టీఆర్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. అతనెవరో తనకు తెలియదని అంది. ఒక నెటిజన్ శక్తి, దమ్ము సినిమాలు చూస్తే తారక్ ఫ్యాన్ అయిపోతావ్ అన్నాడు. దానికి బదులుగా తనకంత ఆసక్తి లేదు అంది మీరా. ఇక అంతే తారక్ ఫ్యాన్స్ బూతు పురాణం మొదలైంది. మీరాతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి తిట్టిపోశారు. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లు సోషల్ మీడియాలో కామన్ అని వదిలేయకుండా మీరా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎన్టీఆర్ను ట్యాగ్ చేస్తూ.. అతడి అభిమానులు తననెలా బూతులు తిడుతున్నారో వివరించింది. ఇలాంటి అభిమానుల్ని పెట్టుకుని నువ్వు సక్సెస్ ఫుల్ ఎలా అవుతావ్ అని ప్రశ్నించింది. తన ట్వీట్ను ఇగ్నోర్ చేయొద్దని కూడా కోరింది. మొత్తానికి కొందరు ఫ్యాన్స్ చేసిన అతికి ఇప్పుడు తారక్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
This post was last modified on June 2, 2020 11:17 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…