Movie News

హీరో గారి భార్య ద‌ర్శ‌క‌త్వం


హీరోలు మంచి ఇమేజ్ సంపాదిస్తే.. హీరోల కుటుంబ సభ్యులు కూడా అవకాశం ఉన్నంతమేర సినిమా సంబంధిత వ్యవహారాల్లో పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు హీరోలు తమ భార్యలను ప్రొడక్షన్లోకి తీసుకురావడం.. లేదంటే స్టైలింగ్ లాంటివి చేయించుకోవడం చేస్తుంటారు. బాలీవుడ్లో స్వశక్తితో మంచి స్థాయిని అందుకున్న ఆయుష్మాన్ ఖురానా విషయానికొస్తే.. అతడి భార్య తాహిరా కశ్యప్‌కు సినిమాల మీద మంచి పట్టే ఉంది. ఆమెకు మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. దర్శకత్వ విభాగంలోనూ పని చేసింది.

ఈ అనుభవంతో ఆమె పిన్ని, టాహీ, క్వారంటైన్ క్రిష్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ సైతం డైరెక్ట్ చేసింది. ఇప్పుడు ఫీచర్ ఫిలిం డైరెక్టోరియల్ డెబ్యూకు రెడీ అయిపోయింది. ‘శర్మా జీ కి బేటి’ పేరుతో తాహిరా తొలి సినిమా తెరకెక్కనుంది.

ఇందులో సాక్షి తన్వర్, దివ్య దత్తా, సయామీ ఖేర్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. టైటిల్‌కు తగ్గట్లే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అట. మహిళల విషయంలో మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయో ఫన్నీగా చర్చించబోతోందట తాహిరా. ఇదొక సెటైరికల్ మూవీ అంటున్నారు. ఇటీవల తాహిరా ఆరోగ్య పరంగా ఒక సమస్య ఎదుర్కొని కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. నిల్వ చేసిన బాటిల్ జ్యూస్ తాగడంతో ఆమె అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందింది. ఇలాంటి ప్రాడెక్ట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరిస్తూ ఒక పోస్టు కూడా పెట్టింది.

ఆ సంగతలా ఉంచితే తాహిరా ఒక క్యాన్సర్ సర్వైవర్ కావడం గమనార్హం. 2018లో ఆమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. అదృష్టవశాత్తూ త్వరగా క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స తీసుకోవడంతో ఆమె కోలుకుని మామూలు మనిషి అయింది. ఇప్పుడు దర్శకురాలిగా మారి సినిమా కూడా తీయబోతోంది. మరి ఈ ప్రయత్నంలో ఆమె ఏ మేర విజయం సాధిస్తుందో చూడాలి.

This post was last modified on October 14, 2021 10:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

40 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago