సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ చాలా మంది నటీనటులు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కంగనా గ్యాప్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో నెపోటిజం ఉందని చర్చలు జరుగుతున్నాయి. దీని కారణంగా టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావడం లేదనేది వాదన. సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్యకు కారణం కూడా ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం అని అంటుంటారు. అయితే ఇండస్ట్రీలో నెపోటిజం కంటే రేసిజం ఎక్కువ ఉందని అంటున్నారు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.
బాలీవుడ్ కు చెందిన ఈ నటుడు తన విలక్షణ పాత్రలో అందరికీ దగ్గరయ్యారు. ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ తో నవాజుద్దీన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. తాజాగా ఆయన ఇండస్ట్రీలో రేసిజంపై చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆయన నటించిన ‘సీరియస్ మ్యాన్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఇందిరా తివారి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఇందిరాను హీరోయిన్ గా తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు నవాజుద్దీన్.
దానికి కారణం ఆమె నల్లగా, పొట్టిగా ఉంటుందని. ఈ సినిమా తరువాత ఇందిరాకు మరో ఆఫర్ వస్తే అదే గొప్ప విజయమని అన్నారు. బాలీవుడ్లో తెల్లగా ఉండేవాళ్లతో పాటు నల్లగా ఉండేవారు కూడా హీరోయిన్లుగా చేయాలని కోరుకున్నారు. నల్లగా ఉన్నప్పటికీ.. అద్భుతంగా నటించేవాళ్లు చాలా మంది ఉన్నారని.. కానీ ఇండస్ట్రీలో ఉన్న రేసిజం వలన ఎంతో మంది గ్రేట్ యాక్టర్స్ బలైపోయారని చెప్పారు. ఈ సమస్యపై చాలా కాలంగా పోరాటం చేస్తున్నానని నవాజుద్దీన్ చెప్పుకొచ్చారు.
This post was last modified on October 12, 2021 8:44 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…