Chiranjeevi
రాజకీయాల నుంచి బయటపడ్డాక మర్యాద రామన్న అయిపోయాడు చిరంజీవి. ఆయన ఒకరి మీద విమర్శలు చేయడానికి ఇబ్బంది పడతాడు. అదే సమయంలో ఇంకొకరు తనను విమర్శించినా తట్టుకోలేడు. అసలు ఎవరి దృష్టిలోనూ తాను చెడు కాకూడదు, అందరితోనూ మంచిగా ఉండాలి.. మంచోడు అనిపించుకోవాలి అన్న ఒక ఛట్రంలో చిరంజీవి ఇరుక్కుపోయాడేమో అనిపిస్తుంది కొన్నేళ్లుగా ఆయన తీరు గమనిస్తే.
ఇలా మర్యాదరామన్న పాత్ర పోషిస్తున్న సమయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలొచ్చి చిరంజీవిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ ఎన్నికల్లో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ బరిలో నిలిచారన్నది స్పష్టం. ఐతే ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్, నాగబాబు చెప్పడమే తప్ప.. చిరంజీవి మాత్రం ఆ మాట బహిరంగంగా చెప్పలేదు. ప్రకాష్ రాజ్కు మద్దతూ ప్రకటించలేదు. ఇక్కడ ఆయనకు మొహమాటం అడ్డొచ్చింది. మంచు విష్ణు బరిలో ఉండగా.. ప్రకాష్ రాజ్కు ఓపెన్గా సపోర్ట్ చేసి మోహన్ బాబుతో తగువు పెట్టుకోవడం చిరంజీవికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ చిరు ఇలా ఓపెన్ కాకపోవడం వల్లే ప్రకాష్ రాజ్కు పెద్ద డ్యామేజ్ జరిగింది. అదే సమయంలో చిరంజీవి ఇమేజ్కూ దెబ్బ పడింది.
ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో ఆ వైఫల్యాన్ని చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి అంటగడుతున్నారు. చిరంజీవి సత్తా ఇంతేనా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రకాష్ రాజ్ను చిరు గెలిపించుకోలేకపోయాడే అంటున్నారు. ఐతే ప్రకాష్ రాజ్కు మద్దతు ఇవ్వాలనుకున్నపుడు చిరు ఆ పని ఓపెన్గానే చేయాల్సింది. చిరంజీవి ఆయన గురించి రెండు మాటలు చెప్పి ఓటు వేయమంటే కచ్చితంగా పరిస్థితి భిన్నంగా ఉండేది. చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్కు ఉందని తెలిసీ మోహన్ బాబు తన కొడుకును బరిలో నిలిపినపుడు.. ప్రకాష్ రాజ్కు ఓపెన్గా సపోర్ట్ చేయడానికి చిరంజీవికి వచ్చిన ఇబ్బందేంటన్నది అర్థం కాని విషయం. ఈ మొహమాటం వల్ల ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓటమికి సంబంధించి ఎంతో కొంత బాధ్యత తీసుకోక తప్పట్లేదు.
This post was last modified on October 11, 2021 9:08 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…