Chiranjeevi
రాజకీయాల నుంచి బయటపడ్డాక మర్యాద రామన్న అయిపోయాడు చిరంజీవి. ఆయన ఒకరి మీద విమర్శలు చేయడానికి ఇబ్బంది పడతాడు. అదే సమయంలో ఇంకొకరు తనను విమర్శించినా తట్టుకోలేడు. అసలు ఎవరి దృష్టిలోనూ తాను చెడు కాకూడదు, అందరితోనూ మంచిగా ఉండాలి.. మంచోడు అనిపించుకోవాలి అన్న ఒక ఛట్రంలో చిరంజీవి ఇరుక్కుపోయాడేమో అనిపిస్తుంది కొన్నేళ్లుగా ఆయన తీరు గమనిస్తే.
ఇలా మర్యాదరామన్న పాత్ర పోషిస్తున్న సమయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలొచ్చి చిరంజీవిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ ఎన్నికల్లో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ బరిలో నిలిచారన్నది స్పష్టం. ఐతే ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్, నాగబాబు చెప్పడమే తప్ప.. చిరంజీవి మాత్రం ఆ మాట బహిరంగంగా చెప్పలేదు. ప్రకాష్ రాజ్కు మద్దతూ ప్రకటించలేదు. ఇక్కడ ఆయనకు మొహమాటం అడ్డొచ్చింది. మంచు విష్ణు బరిలో ఉండగా.. ప్రకాష్ రాజ్కు ఓపెన్గా సపోర్ట్ చేసి మోహన్ బాబుతో తగువు పెట్టుకోవడం చిరంజీవికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ చిరు ఇలా ఓపెన్ కాకపోవడం వల్లే ప్రకాష్ రాజ్కు పెద్ద డ్యామేజ్ జరిగింది. అదే సమయంలో చిరంజీవి ఇమేజ్కూ దెబ్బ పడింది.
ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో ఆ వైఫల్యాన్ని చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి అంటగడుతున్నారు. చిరంజీవి సత్తా ఇంతేనా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రకాష్ రాజ్ను చిరు గెలిపించుకోలేకపోయాడే అంటున్నారు. ఐతే ప్రకాష్ రాజ్కు మద్దతు ఇవ్వాలనుకున్నపుడు చిరు ఆ పని ఓపెన్గానే చేయాల్సింది. చిరంజీవి ఆయన గురించి రెండు మాటలు చెప్పి ఓటు వేయమంటే కచ్చితంగా పరిస్థితి భిన్నంగా ఉండేది. చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్కు ఉందని తెలిసీ మోహన్ బాబు తన కొడుకును బరిలో నిలిపినపుడు.. ప్రకాష్ రాజ్కు ఓపెన్గా సపోర్ట్ చేయడానికి చిరంజీవికి వచ్చిన ఇబ్బందేంటన్నది అర్థం కాని విషయం. ఈ మొహమాటం వల్ల ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓటమికి సంబంధించి ఎంతో కొంత బాధ్యత తీసుకోక తప్పట్లేదు.
This post was last modified on October 11, 2021 9:08 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…