ప్రముఖ మలయాళ నటుడు నెడుమూడి వేణు(73) కన్నుమూశారు. కొన్ని నెలలుగా కడుపు సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కేరళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు(అక్టోబర్ 11) తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కోవిడ్ తో పోరాడి గెలిచారు. కానీ ఇంతలోనే అనారోగ్యంతో మరణించడం అభిమానులను బాధిస్తోంది.
ఈయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. లెజండరీ నటుడిని కోల్పోయామంటూ పోస్ట్ లు పెడుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్ లాంటి స్టార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నెడుమూడి వేణు మళయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు.
ఆయన అసలైన పేరు కేశవన్ వేణుగోపాల్ అయినప్పటికీ.. స్టేజ్ నేమ్ నెడుమూడి వేణుతో పాపులర్ అయ్యారు. ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆయన 500కి పైగా చిత్రాల్లో నటించారు. నటనతో పాటు కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఓ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తన కెరీర్ లో నటుడిగా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను, ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు.
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…