ప్రముఖ మలయాళ నటుడు నెడుమూడి వేణు(73) కన్నుమూశారు. కొన్ని నెలలుగా కడుపు సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కేరళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు(అక్టోబర్ 11) తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కోవిడ్ తో పోరాడి గెలిచారు. కానీ ఇంతలోనే అనారోగ్యంతో మరణించడం అభిమానులను బాధిస్తోంది.
ఈయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. లెజండరీ నటుడిని కోల్పోయామంటూ పోస్ట్ లు పెడుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్ లాంటి స్టార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నెడుమూడి వేణు మళయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు.
ఆయన అసలైన పేరు కేశవన్ వేణుగోపాల్ అయినప్పటికీ.. స్టేజ్ నేమ్ నెడుమూడి వేణుతో పాపులర్ అయ్యారు. ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆయన 500కి పైగా చిత్రాల్లో నటించారు. నటనతో పాటు కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఓ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తన కెరీర్ లో నటుడిగా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను, ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు.
This post was last modified on October 11, 2021 4:20 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…