నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన కామెంట్లు కొన్ని వింటే.. ఇలా బాలయ్య మాత్రమే మాట్లాడగలడు అనిపిస్తుంది. ఎవరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా తనకేమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు బాలయ్య.
ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించి తన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో బాలయ్య ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చివర్లో కొసమెరుపు లాంటి కామెంట్లు చేశాడు. ప్రతి తెలుగు వాడూ ఎన్టీఆర్ అభిమానే అని.. అలాగే తన అభిమాని కూడా అని బాలయ్య స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ముందు ఎన్టీఆర్తో మొదలుపెట్టి తర్వాత తన గురించి చెబుతూ పార్టీలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తన అభిమానులే అన్నాడు బాలయ్య.
‘‘చాలా మంది నా దగ్గరికి వచ్చి.. ‘సార్ నేను ఎన్టీ రామారావు గారి అభిమానినండీ’ అంటారు. ‘కాదని చెప్పు.. దమ్ముందా.. పడతది’ అంటా. ప్రతి తెలుగోడూ నా అభిమానే. ప్రతి పార్టీలో వాడూ నా అభిమానే. సమాజమే నా అభిమానం. నాన్నగారు అన్నారు.. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. అందులో నేను అర్చకుణ్ని అని. నా వంతు అన్ని రకాలుగా కృషి చేస్తున్నా. నా పూజల ద్వార అయితేనేమి.. హస్పిటల్ ద్వారా అయితేనేమి. నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితేనేమి. ఒక ఆర్టిస్టుగా విజ్ఞానం, వినోదం, ఆలోచన రేకెత్తించడంలో అయితేనేమి. ఇన్నిన్ని చేస్తున్నపుడు అందరూ నా అభిమానులే. కులం, మతం, వర్గాలకు అతీతంగా అందరూ నా అభిమానులే’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు బాలయ్య.
ఈ క్రమంలో ‘ఒక్కమగాడు’ సినిమాలోని ‘‘నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణుడిని.. ఐశ్వర్యంలో వైశ్యని.. మంచికి మాలని.. వంచిస్తే ఎదిరించే మాదిగని…’’ డైలాగ్ పేల్చాడు బాలయ్య.
This post was last modified on June 4, 2020 1:38 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు.…
ఎవరైనా సంగీత దర్శకుడికి పేరొచ్చేది అతనిచ్చే మొదటి ఆల్బమ్ ని బట్టే. అది హిట్టయ్యిందా అవకాశాలు క్యూ కడతాయి. లేదూ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ…
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…