నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన కామెంట్లు కొన్ని వింటే.. ఇలా బాలయ్య మాత్రమే మాట్లాడగలడు అనిపిస్తుంది. ఎవరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా తనకేమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు బాలయ్య.
ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించి తన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో బాలయ్య ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చివర్లో కొసమెరుపు లాంటి కామెంట్లు చేశాడు. ప్రతి తెలుగు వాడూ ఎన్టీఆర్ అభిమానే అని.. అలాగే తన అభిమాని కూడా అని బాలయ్య స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ముందు ఎన్టీఆర్తో మొదలుపెట్టి తర్వాత తన గురించి చెబుతూ పార్టీలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తన అభిమానులే అన్నాడు బాలయ్య.
‘‘చాలా మంది నా దగ్గరికి వచ్చి.. ‘సార్ నేను ఎన్టీ రామారావు గారి అభిమానినండీ’ అంటారు. ‘కాదని చెప్పు.. దమ్ముందా.. పడతది’ అంటా. ప్రతి తెలుగోడూ నా అభిమానే. ప్రతి పార్టీలో వాడూ నా అభిమానే. సమాజమే నా అభిమానం. నాన్నగారు అన్నారు.. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. అందులో నేను అర్చకుణ్ని అని. నా వంతు అన్ని రకాలుగా కృషి చేస్తున్నా. నా పూజల ద్వార అయితేనేమి.. హస్పిటల్ ద్వారా అయితేనేమి. నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితేనేమి. ఒక ఆర్టిస్టుగా విజ్ఞానం, వినోదం, ఆలోచన రేకెత్తించడంలో అయితేనేమి. ఇన్నిన్ని చేస్తున్నపుడు అందరూ నా అభిమానులే. కులం, మతం, వర్గాలకు అతీతంగా అందరూ నా అభిమానులే’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు బాలయ్య.
ఈ క్రమంలో ‘ఒక్కమగాడు’ సినిమాలోని ‘‘నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణుడిని.. ఐశ్వర్యంలో వైశ్యని.. మంచికి మాలని.. వంచిస్తే ఎదిరించే మాదిగని…’’ డైలాగ్ పేల్చాడు బాలయ్య.
This post was last modified on June 4, 2020 1:38 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…