నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన కామెంట్లు కొన్ని వింటే.. ఇలా బాలయ్య మాత్రమే మాట్లాడగలడు అనిపిస్తుంది. ఎవరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా తనకేమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు బాలయ్య.
ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించి తన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో బాలయ్య ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చివర్లో కొసమెరుపు లాంటి కామెంట్లు చేశాడు. ప్రతి తెలుగు వాడూ ఎన్టీఆర్ అభిమానే అని.. అలాగే తన అభిమాని కూడా అని బాలయ్య స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ముందు ఎన్టీఆర్తో మొదలుపెట్టి తర్వాత తన గురించి చెబుతూ పార్టీలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తన అభిమానులే అన్నాడు బాలయ్య.
‘‘చాలా మంది నా దగ్గరికి వచ్చి.. ‘సార్ నేను ఎన్టీ రామారావు గారి అభిమానినండీ’ అంటారు. ‘కాదని చెప్పు.. దమ్ముందా.. పడతది’ అంటా. ప్రతి తెలుగోడూ నా అభిమానే. ప్రతి పార్టీలో వాడూ నా అభిమానే. సమాజమే నా అభిమానం. నాన్నగారు అన్నారు.. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. అందులో నేను అర్చకుణ్ని అని. నా వంతు అన్ని రకాలుగా కృషి చేస్తున్నా. నా పూజల ద్వార అయితేనేమి.. హస్పిటల్ ద్వారా అయితేనేమి. నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితేనేమి. ఒక ఆర్టిస్టుగా విజ్ఞానం, వినోదం, ఆలోచన రేకెత్తించడంలో అయితేనేమి. ఇన్నిన్ని చేస్తున్నపుడు అందరూ నా అభిమానులే. కులం, మతం, వర్గాలకు అతీతంగా అందరూ నా అభిమానులే’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు బాలయ్య.
ఈ క్రమంలో ‘ఒక్కమగాడు’ సినిమాలోని ‘‘నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణుడిని.. ఐశ్వర్యంలో వైశ్యని.. మంచికి మాలని.. వంచిస్తే ఎదిరించే మాదిగని…’’ డైలాగ్ పేల్చాడు బాలయ్య.
This post was last modified on June 4, 2020 1:38 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…