Movie News

బాలయ్య మార్క్ కామెంట్.. ప్రతి తెలుగోడూ నా అభిమానే

నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన కామెంట్లు కొన్ని వింటే.. ఇలా బాలయ్య మాత్రమే మాట్లాడగలడు అనిపిస్తుంది. ఎవరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా తనకేమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు బాలయ్య.

ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించి తన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో బాలయ్య ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చివర్లో కొసమెరుపు లాంటి కామెంట్లు చేశాడు. ప్రతి తెలుగు వాడూ ఎన్టీఆర్ అభిమానే అని.. అలాగే తన అభిమాని కూడా అని బాలయ్య స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ముందు ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి తర్వాత తన గురించి చెబుతూ పార్టీలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తన అభిమానులే అన్నాడు బాలయ్య.

‘‘చాలా మంది నా దగ్గరికి వచ్చి.. ‘సార్ నేను ఎన్టీ రామారావు గారి అభిమానినండీ’ అంటారు. ‘కాదని చెప్పు.. దమ్ముందా.. పడతది’ అంటా. ప్రతి తెలుగోడూ నా అభిమానే. ప్రతి పార్టీలో వాడూ నా అభిమానే. సమాజమే నా అభిమానం. నాన్నగారు అన్నారు.. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. అందులో నేను అర్చకుణ్ని అని. నా వంతు అన్ని రకాలుగా కృషి చేస్తున్నా. నా పూజల ద్వార అయితేనేమి.. హస్పిటల్ ద్వారా అయితేనేమి. నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితేనేమి. ఒక ఆర్టిస్టుగా విజ్ఞానం, వినోదం, ఆలోచన రేకెత్తించడంలో అయితేనేమి. ఇన్నిన్ని చేస్తున్నపుడు అందరూ నా అభిమానులే. కులం, మతం, వర్గాలకు అతీతంగా అందరూ నా అభిమానులే’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు బాలయ్య.

ఈ క్రమంలో ‘ఒక్కమగాడు’ సినిమాలోని ‘‘నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణుడిని.. ఐశ్వర్యంలో వైశ్యని.. మంచికి మాలని.. వంచిస్తే ఎదిరించే మాదిగని…’’ డైలాగ్ పేల్చాడు బాలయ్య.

This post was last modified on June 4, 2020 1:38 pm

Share

Recent Posts

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

34 minutes ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

2 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

2 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

3 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

9 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

11 hours ago