అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మా’ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ను షురూ చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఎన్నికల బరిలో నిలిచిన రెండుప్యానళ్లు పోటాపోటీగా ప్రచారం చేసుకోవటం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
పోలింగ్ వేళ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం.. ఆయన ఓటు ఎవరికి వేశారన్న విషయాన్ని బయటకు చెప్పేందుకు నిరాకరించారు. తాను ఎవరికి మద్దతు ఇచ్చానన్న విషయాన్ని బయటకు చెప్పటం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని చెప్పిన ఆయన.. అన్నయ్య చిరంజీవి.. మోహన్ బాబు మంచి స్నేహితులని.. వారి స్నేహబంధం మీద ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావాన్ని చూపించవని చెప్పారు.
మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరం లేదన్న ఆయన.. ఈ ఎన్నికలతో సినిమా ఇండస్ట్రీ చీలిపోవటం అనేది ఉండదని స్పష్టం చేశారు. మా ఎన్నికల వేళ.. పవన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
This post was last modified on October 10, 2021 10:16 am
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…