అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మా’ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ను షురూ చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఎన్నికల బరిలో నిలిచిన రెండుప్యానళ్లు పోటాపోటీగా ప్రచారం చేసుకోవటం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
పోలింగ్ వేళ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం.. ఆయన ఓటు ఎవరికి వేశారన్న విషయాన్ని బయటకు చెప్పేందుకు నిరాకరించారు. తాను ఎవరికి మద్దతు ఇచ్చానన్న విషయాన్ని బయటకు చెప్పటం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని చెప్పిన ఆయన.. అన్నయ్య చిరంజీవి.. మోహన్ బాబు మంచి స్నేహితులని.. వారి స్నేహబంధం మీద ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావాన్ని చూపించవని చెప్పారు.
మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరం లేదన్న ఆయన.. ఈ ఎన్నికలతో సినిమా ఇండస్ట్రీ చీలిపోవటం అనేది ఉండదని స్పష్టం చేశారు. మా ఎన్నికల వేళ.. పవన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
This post was last modified on October 10, 2021 10:16 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…