మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆచార్య’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మొన్నామధ్య డిస్ట్రిబ్యూటర్లతో చిరంజీవి, కొరటాల శివ మీటింగ్ పెట్టుకొని డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.
దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని భావించారు. కానీ ఈ విషయంలో చిరంజీవి తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయడం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు ఇష్టం లేదట. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఏపీలో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుపుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై ఈ లెక్కలన్నీ మార్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తరువాత ‘ఆచార్య’ సినిమాను విడుదల చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని సలహాలు ఇస్తున్నారు.
అలానే రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు మూడు వారాల గ్యాప్ లో విడుదలవ్వడం మంచిది కాదని అంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ తో చిరంజీవి తన సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ప్రకటించాలని చూస్తున్నారు. జనవరిలో అయితే పోటీగా చాలా సినిమాలు ఉన్నాయి. మరి ‘ఆచార్య’కు ఏ డేట్ దొరుకుతుందో చూడాలి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది.
This post was last modified on October 9, 2021 9:09 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…