Movie News

‘ఆచార్య’ ప్లాన్ మారిందా..?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆచార్య’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మొన్నామధ్య డిస్ట్రిబ్యూటర్లతో చిరంజీవి, కొరటాల శివ మీటింగ్ పెట్టుకొని డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.

దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని భావించారు. కానీ ఈ విషయంలో చిరంజీవి తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయడం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు ఇష్టం లేదట. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఏపీలో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుపుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై ఈ లెక్కలన్నీ మార్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తరువాత ‘ఆచార్య’ సినిమాను విడుదల చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని సలహాలు ఇస్తున్నారు.

అలానే రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు మూడు వారాల గ్యాప్ లో విడుదలవ్వడం మంచిది కాదని అంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ తో చిరంజీవి తన సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ప్రకటించాలని చూస్తున్నారు. జనవరిలో అయితే పోటీగా చాలా సినిమాలు ఉన్నాయి. మరి ‘ఆచార్య’కు ఏ డేట్ దొరుకుతుందో చూడాలి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది.

This post was last modified on October 9, 2021 9:09 pm

Share
Show comments

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago