‘మేమిద్దరం విడిపోతున్నాం’.. కొద్ది రోజుల క్రితం నాగచైతన్య, సమంతలు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటికే వాళ్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నా, రూమర్స్ అయి ఉంటాయి అనుకున్నారంతా. కానీ ఎప్పుడైతే ఇద్దరూ స్వయంగా ప్రకటించారో అందరూ షాకైపోయారు. అంత అన్యోన్యంగా కనిపించే జంట విడిపోవడమేంటి అని బాధపడిపోయారు. ఆ తర్వాత కాసేపటికి వాళ్లు ఎందుకు విడిపోయారు అనేదానిపై చర్చ మొదలైంది. అన్ని చర్చలకూ సమంతే టార్గెట్ అయ్యింది.
సామ్, చైతులు విడిపోడానికి ముమ్మాటికీ సమంతే కారణమంటూ అభిమానులతో పాటు మీడియా కూడా తేల్చేయడాన్ని సామ్ భరించలేకపోయింది. సోషల్ మీడియాలో ఇవాళ స్ట్రాంగ్గా రియాక్టయ్యింది. ‘నామీద సానుభూతి చూపించినవారందరికీ చాలా థ్యాంక్స్. కానీ కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. పుకార్లు పుట్టిస్తున్నారు. నేను అవకాశవాదినంట. పిల్లల్ని వద్దని అనుకున్నానట. అబార్షన్లు కూడా చేయించుకున్నానట. చివరికి నాకు అఫైర్స్ కూడా ఉన్నాయంటున్నారు. డివోర్స్ తీసుకోవడం ఎంతో బాధపెట్టే విషయం. నేనా బాధలో ఉన్నప్పుడు నాపై ఇలా దాడి చేయడం అన్యాయం. నేనెప్పుడూ అలా చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా నేను చెక్కు చెదరను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అంటూ బాధ, కోపం, వ్యంగ్యం కలగలిపి తన మనసులోని మాటల్ని బైటపెట్టింది సమంత.
ఆమె బాధలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇలా జరిగిందేమో అని అంచనాలు వేసేస్తూ ఎవరికి వారు ఓ కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. చూసేవారికి, వినేవారికి నిజమనిపించేలా నిర్థారించి చెప్పేస్తున్నారు. భర్త నుంచి విడిపోయి ఒంటరిదైపోయిందని కామెంట్ చేసినవారే.. ఆమె నిజంగా ఒంటరిదాన్ని చేసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
సమంత కాస్త ఫాస్ట్గా ఉండటం వల్లో.. నాగచైతన్య కాస్త కూల్ గయ్ కావడం వల్లో.. అందరూ చైతుని చూసి అయ్యో పాపం అంటున్నారు అని ఇప్పటికే కొందరు మహిళా కార్యకర్తలు, సెలెబ్రిటీలు కామెంట్ చేశారు. సమంత టాప్లో ఉంది కదా, ఇండివిడ్యువాలిటీ ఎక్కువ కదా, అలా చేసే ఉంటుందేమో చాలామంది అనేసుకుంటున్నారు. అంతేకానీ ఇది పర్సనల్ విషయం కదా, భార్యాభర్తలు విడిపోతే ఇద్దరూ ఎంతో కొంత సఫరవుతారు కదా అనే యాంగిల్ని వాళ్లు పూర్తిగా మర్చిపోతున్నారు. బహుశా అందుకే సమంత ఈ పోస్ట్ పెట్టిందేమో!
This post was last modified on October 9, 2021 1:26 am
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…