కొన్ని రోజుల్లో వివాహ నాలుగో వార్షికోత్సవం జరుపుకోబోతున్న సమయంలో తామిద్దరం విడిపోతున్నట్లుగా ప్రకటన చేసి తమ జంటను అభిమానించే అందరికీ తీవ్ర వేదక కలిగించారు అక్కినేని నాగచైతన్య, సమంత. ప్రేమలో ఉన్నపుడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక చూడముచ్చటగా అనిపించిన ఈ జంట విడిపోతుంటే.. తమకు తెలిసిన వాళ్లు ఇలా వేరు పడ్డట్లుగా చాలామంది చాలా మథన పడిపోయారు. ఈ జంట ఎందుకిలా చేసిందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.
ఐతే ఎంతో ఆలోచించాకే చైతూ-సామ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనడంలో సందేహం లేదు. విడిపోవడానికి కారణాలేంటో, ఈ నిర్ణయం పర్యవసానాలేంటో వాళ్లిద్దరికే అందరి కంటే బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో చర్చోపచర్చలు అనవసరం. ఐతే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే.. చైతూనే సమంతను కాదనుకుని ఉంటాడు, విడాకుల నిర్ణయం పట్ల సమంతనే ఎక్కువ బాధపడుతోంది.. చైతూను వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు అని.
గత కొన్ని రోజుల్లో ఇరువురి ప్రవర్తన, వాళ్లు వ్యక్తపరిచిన భావాలను బట్టి జనాలకు ఇదే అభిప్రాయం కలుగుతోంది. సామ్ కచ్చితంగా బాధలో ఉందన్నది సన్నిహిత వర్గాల సమాచారం. ఐతే ఈ బాధ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడ్డానికి, జీవితంలో ముందుకు సాగడానికి ఆమె నిర్ణయించుకుందని.. ఇందుకు సినిమాల్లో బిజీ కావడమే సరైన మందు అని భావిస్తోందని అంటున్నారు. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సామ్.. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతి కలయికలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో నటిస్తూనే సామ్.. మూణ్నాలుగు చిత్రాలకు సంతకం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడు రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇవి కాక రెండు మూడు చిత్రాలు కూడా ఓకే అయ్యాయట. విడాకుల వార్త నుంచి అందరి దృష్టిని మళ్లించేలా త్వరలోనే వరుసగా ఈ సినిమాల ప్రకటనలు వచ్చేలా చూస్తోందట సామ్. వీలైనంతగా కెరీర్ను పొడిగించుకుని వ్యక్తిగత జీవితంలో లోటును పూడ్చుకోవాలని, విడాకుల బాధ నుంచి బయటపడాలని ఆమె చూస్తున్నట్లు కనిపిస్తోంది.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…