కొన్ని రోజుల్లో వివాహ నాలుగో వార్షికోత్సవం జరుపుకోబోతున్న సమయంలో తామిద్దరం విడిపోతున్నట్లుగా ప్రకటన చేసి తమ జంటను అభిమానించే అందరికీ తీవ్ర వేదక కలిగించారు అక్కినేని నాగచైతన్య, సమంత. ప్రేమలో ఉన్నపుడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక చూడముచ్చటగా అనిపించిన ఈ జంట విడిపోతుంటే.. తమకు తెలిసిన వాళ్లు ఇలా వేరు పడ్డట్లుగా చాలామంది చాలా మథన పడిపోయారు. ఈ జంట ఎందుకిలా చేసిందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.
ఐతే ఎంతో ఆలోచించాకే చైతూ-సామ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనడంలో సందేహం లేదు. విడిపోవడానికి కారణాలేంటో, ఈ నిర్ణయం పర్యవసానాలేంటో వాళ్లిద్దరికే అందరి కంటే బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో చర్చోపచర్చలు అనవసరం. ఐతే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే.. చైతూనే సమంతను కాదనుకుని ఉంటాడు, విడాకుల నిర్ణయం పట్ల సమంతనే ఎక్కువ బాధపడుతోంది.. చైతూను వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు అని.
గత కొన్ని రోజుల్లో ఇరువురి ప్రవర్తన, వాళ్లు వ్యక్తపరిచిన భావాలను బట్టి జనాలకు ఇదే అభిప్రాయం కలుగుతోంది. సామ్ కచ్చితంగా బాధలో ఉందన్నది సన్నిహిత వర్గాల సమాచారం. ఐతే ఈ బాధ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడ్డానికి, జీవితంలో ముందుకు సాగడానికి ఆమె నిర్ణయించుకుందని.. ఇందుకు సినిమాల్లో బిజీ కావడమే సరైన మందు అని భావిస్తోందని అంటున్నారు. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సామ్.. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతి కలయికలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో నటిస్తూనే సామ్.. మూణ్నాలుగు చిత్రాలకు సంతకం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడు రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇవి కాక రెండు మూడు చిత్రాలు కూడా ఓకే అయ్యాయట. విడాకుల వార్త నుంచి అందరి దృష్టిని మళ్లించేలా త్వరలోనే వరుసగా ఈ సినిమాల ప్రకటనలు వచ్చేలా చూస్తోందట సామ్. వీలైనంతగా కెరీర్ను పొడిగించుకుని వ్యక్తిగత జీవితంలో లోటును పూడ్చుకోవాలని, విడాకుల బాధ నుంచి బయటపడాలని ఆమె చూస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on October 8, 2021 10:38 am
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…