కొన్ని రోజుల్లో వివాహ నాలుగో వార్షికోత్సవం జరుపుకోబోతున్న సమయంలో తామిద్దరం విడిపోతున్నట్లుగా ప్రకటన చేసి తమ జంటను అభిమానించే అందరికీ తీవ్ర వేదక కలిగించారు అక్కినేని నాగచైతన్య, సమంత. ప్రేమలో ఉన్నపుడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక చూడముచ్చటగా అనిపించిన ఈ జంట విడిపోతుంటే.. తమకు తెలిసిన వాళ్లు ఇలా వేరు పడ్డట్లుగా చాలామంది చాలా మథన పడిపోయారు. ఈ జంట ఎందుకిలా చేసిందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.
ఐతే ఎంతో ఆలోచించాకే చైతూ-సామ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనడంలో సందేహం లేదు. విడిపోవడానికి కారణాలేంటో, ఈ నిర్ణయం పర్యవసానాలేంటో వాళ్లిద్దరికే అందరి కంటే బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో చర్చోపచర్చలు అనవసరం. ఐతే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే.. చైతూనే సమంతను కాదనుకుని ఉంటాడు, విడాకుల నిర్ణయం పట్ల సమంతనే ఎక్కువ బాధపడుతోంది.. చైతూను వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు అని.
గత కొన్ని రోజుల్లో ఇరువురి ప్రవర్తన, వాళ్లు వ్యక్తపరిచిన భావాలను బట్టి జనాలకు ఇదే అభిప్రాయం కలుగుతోంది. సామ్ కచ్చితంగా బాధలో ఉందన్నది సన్నిహిత వర్గాల సమాచారం. ఐతే ఈ బాధ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడ్డానికి, జీవితంలో ముందుకు సాగడానికి ఆమె నిర్ణయించుకుందని.. ఇందుకు సినిమాల్లో బిజీ కావడమే సరైన మందు అని భావిస్తోందని అంటున్నారు. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సామ్.. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతి కలయికలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో నటిస్తూనే సామ్.. మూణ్నాలుగు చిత్రాలకు సంతకం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడు రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇవి కాక రెండు మూడు చిత్రాలు కూడా ఓకే అయ్యాయట. విడాకుల వార్త నుంచి అందరి దృష్టిని మళ్లించేలా త్వరలోనే వరుసగా ఈ సినిమాల ప్రకటనలు వచ్చేలా చూస్తోందట సామ్. వీలైనంతగా కెరీర్ను పొడిగించుకుని వ్యక్తిగత జీవితంలో లోటును పూడ్చుకోవాలని, విడాకుల బాధ నుంచి బయటపడాలని ఆమె చూస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on October 8, 2021 10:38 am
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…