కొన్ని రోజుల్లో వివాహ నాలుగో వార్షికోత్సవం జరుపుకోబోతున్న సమయంలో తామిద్దరం విడిపోతున్నట్లుగా ప్రకటన చేసి తమ జంటను అభిమానించే అందరికీ తీవ్ర వేదక కలిగించారు అక్కినేని నాగచైతన్య, సమంత. ప్రేమలో ఉన్నపుడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక చూడముచ్చటగా అనిపించిన ఈ జంట విడిపోతుంటే.. తమకు తెలిసిన వాళ్లు ఇలా వేరు పడ్డట్లుగా చాలామంది చాలా మథన పడిపోయారు. ఈ జంట ఎందుకిలా చేసిందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.
ఐతే ఎంతో ఆలోచించాకే చైతూ-సామ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనడంలో సందేహం లేదు. విడిపోవడానికి కారణాలేంటో, ఈ నిర్ణయం పర్యవసానాలేంటో వాళ్లిద్దరికే అందరి కంటే బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో చర్చోపచర్చలు అనవసరం. ఐతే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే.. చైతూనే సమంతను కాదనుకుని ఉంటాడు, విడాకుల నిర్ణయం పట్ల సమంతనే ఎక్కువ బాధపడుతోంది.. చైతూను వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు అని.
గత కొన్ని రోజుల్లో ఇరువురి ప్రవర్తన, వాళ్లు వ్యక్తపరిచిన భావాలను బట్టి జనాలకు ఇదే అభిప్రాయం కలుగుతోంది. సామ్ కచ్చితంగా బాధలో ఉందన్నది సన్నిహిత వర్గాల సమాచారం. ఐతే ఈ బాధ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడ్డానికి, జీవితంలో ముందుకు సాగడానికి ఆమె నిర్ణయించుకుందని.. ఇందుకు సినిమాల్లో బిజీ కావడమే సరైన మందు అని భావిస్తోందని అంటున్నారు. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సామ్.. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతి కలయికలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో నటిస్తూనే సామ్.. మూణ్నాలుగు చిత్రాలకు సంతకం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడు రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇవి కాక రెండు మూడు చిత్రాలు కూడా ఓకే అయ్యాయట. విడాకుల వార్త నుంచి అందరి దృష్టిని మళ్లించేలా త్వరలోనే వరుసగా ఈ సినిమాల ప్రకటనలు వచ్చేలా చూస్తోందట సామ్. వీలైనంతగా కెరీర్ను పొడిగించుకుని వ్యక్తిగత జీవితంలో లోటును పూడ్చుకోవాలని, విడాకుల బాధ నుంచి బయటపడాలని ఆమె చూస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on October 8, 2021 10:38 am
'అయ్యగారే నెంబర్ వన్' డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు మళ్లీ వైరల్ అవుతున్నాడు.…
ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేసి నూతన…
ప్రస్తుతం దేశంలో జెన్ జీ హవా నడుస్తుంది. ఏ నిముషంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో కానీ దేశంలో…
బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ స్పీడ్ పెంచలేదు. 2024 మే నెలలో…
ఫిలిం సెలబ్రెటీలు కనిపిస్తే చాలు.. కొందరు మీడియా వాళ్లకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చేస్తుంది. వాళ్లను ఏమైనా అడిగచేయొచ్చు అనుకుంటారు.…
గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ‘పెద్ది’ దగ్గర్నుంచి ప్రతి రెండు వారాలకూ ప్రేక్షకులను అలరించే సినిమా పడుతోంది.…